ఇంత మోసమా.. ఎందుకీ కుట్ర.. ఎవరికోసం ఈ నాటకం?

Publish Date:Jan 27, 2022

Advertisement

అనుకున్నట్లుగానే, అనుమానించిన విధంగానే, ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ వేడిని రాజేసింది. జిల్లాల పేర్ల విషయంగా తలెత్తిన వివాదం మొదలు, సరిహద్దుల వివాదాలు, నియోజక వర్గాల సర్దుబాటు, కూడికలు తీసివేతలు, దూర భారాలు, కులం కొట్లాటలు, ఆస్తుల పంపకాలు, రాజకీ కుట్రలు, కుతంత్రాలు ఇలా ఒకటని కాదు, అన్ని రకాల రాజకీయ రచ్చకు  కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం, రంగం సిద్దం చేసింది. వేదికగ మారింది. ఎక్కడి కక్కడ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు, అనుకూలంగా విందులు చిందులు అన్నీ జరిగి పోతున్నాయి. 

ఈ నేపధ్యంలోనే, ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ శ్రమ అనుకోకుండా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘దివ్యమంగళ’ ప్రణాళికను, ఆయనగారి ‘పవిత్ర’ ఆశయాన్ని చాలా చక్కగా  వివరించారు. అయితే, ఆయన వివరణను విన్నతర్వాత, ఉన్న అనుమానాలు నివృత్తికాక పోగా,  ఏ నిర్ణయం వెనక ఏ కుట్ర దాగుందో, అన్న సందేహాలు ఎక్కువయ్యాయి, నిజం, ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లుగా, విజయకుమార్ వివరణతో మహా కుట్ర మాటున దాగున్న కుట్రలు, కుతంత్రాలు మరింతగా వెలుగులోకి వచ్చాయి అనటున్నారు విశ్లేషకులు, మరీ ముఖ్యమంగా స్థానిక లోగుట్లు తెలిసిన ప్రజలు, పాత్రికేయులు.  

అసలు ఇలాంటి సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు వంటి చిచ్చును రాజేయడమే, జగన్నాటక  సూత్రదారి మహా కుట్ర అనుకుంటే, ప్లానింగ్ సెక్రెటరీ ప్రవచన పలుకులు మరింత మంత్ర ముగ్ధులను చేసే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇంతవరకు బయటకు వచ్చిన దానికంటే  దాగున్నదే ఎక్కువ ఉందని, అసలు గుట్టు మొత్తం బయట పడితేనే గానీ , ఈ మొత్తం వ్యవహారం అసలు రంగు బయట పడదు అంటున్నారు. 

ఇక వారు ఏమి చెప్పారో చూడండి ..అన్నీ ఇక్కడ చెప్పలేము కాబట్టి.. ఉదాహరణకు నలుగు పలుకులు పట్టి చూద్దాం ...
1.    సంతనూతలపాడు... బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది... అయితే... బాపట్ల కి దూరం కాబట్టి ఒంగోలు తో కలిపాం...బాగుంది. చాలా బాగుంది. 
2.    పాణ్యం ... నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది... అయితే... నంద్యాల కి దూరం కాబట్టి కర్నూల్’లో కలిపాం...ఇది కూడా బాగుంది. 
3.    పుంగనూరు... రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది...అయితే... రాయచోటి దూరం కాబట్టి...(రాయచోటి ప్రస్తుత ప్రతిపాదిత జిల్లా రాజం పేటకు బదులు) చిత్తూరు లో కలిపాం...శభాష్ చక్కగా వుంది. 
4.    సర్వేపల్లి... తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది...అయితే ... తిరుపతి ( బాలాజీ) దూరం కాబట్టి నెల్లూరు జిల్లాలోనే ఉంచాం...ఇది ఇంకా .. ఇకా బాగుంది. 
కానీ, ఇన్ని జిల్లాల విషయంలో... ఇన్ని నియోజకవర్గాల విషయంలో అంత చొరవ చూపించి, దూర భారాలను అడుగులు అంగుళాలలో కొలిచి మరీ దూరం అవుతుంది అని దగ్గర చేసిన అధికారులకు "కందుకూరు" ప్రజలు ఎందుకు కనిపించలేదు...???వారికి ఒంగోలు ఎంత దూరం నెల్లూరు ఎంత దూరం...???వారి విషయంలో ఎందుకు ఇంత వివక్ష...???వారికి అవసరం లేదా సత్వర న్యాయం... పరిపాలనా సౌలభ్యం...???దీని వెనుక కుట్ర ఏంటి...??? నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు...??? ఇందుకు చారిత్రకంగా కందుకూరు నెల్లూరు జిల్లాలో ఉంది కాబట్టి అలానే ఉంచాం... ఇది ప్లానింగ్ సెక్రెటరీ విజయకుమార్ గారి ముక్తాయింపు... కానీ, కందుకూరుకు నెల్లూరు దగ్గగా ఒంగోలు దగ్గరా.. 40 కిమీ దూరంలో ఉన్న ఒంగోలు దగ్గర, 120 కిమీ దూరంలో ఉన నెల్లూరు దగ్గరో.. అధికారులెచెప్పాలని కందుకూరు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 
అదలా ఉంటే, ఈ ‘కుట్ర’, (అవును  కందుకూరు జనం ఇది కుట్రనే అంటున్నారు). అసంబద్ధ నిర్ణయానికి చీమకుర్తి గ్రానైట్ గనులు, ఒక కారణంగా అనుమనిస్తున్నారు, అలాగే, ఓడరేవులను ఇటూ చేసే కుట్ర ఉందా అన్నన్ అనుమానాలు కూడ వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలోఇప్పటికే కృష్ణ పట్నం ఓడరేవు వుంది... ప్రకాశం జిల్లాలోని రామయ్యపట్నం ఓడరేవుకు  ఇప్పటికే  శంఖు స్థాపన జరిగింది. ఇపుడు ఒకే జిల్లాలో రెండు ఓడ రేవులా??  అనే నెపంతో ఎంకేక్క్డికో ఎత్తుకుపోయే కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అయితే ఇది ఒక్క కందుకూరు సమస్య మాత్రమే కాదు.. చాలా వరకు జిల్లాల్లో చిన్నా పెద్దసమస్యలు చాలనే ఉన్నాయి అంటున్నారు.

By
en-us Political News

  
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి (మార్చి 29) సరిగ్గా 42 ఏళ్లు. ఈ 42 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. తెలుగువాడి, వేడికి అండగా, దండగా, దక్షతగా నిలిచిన పార్టీ తెలుగుదేశం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో వైపు ఇదే కేసులో టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బందిని బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు.
అధికారంలో ఉన్న ప‌దేళ్ల పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. అధికారం కోల్పోయిన త‌రువాత పార్టీ లీడర్లు, క్యాడ‌ర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక్కొక్క‌రుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు బీఆర్ ఎస్ కు గుడ్‌బై చెప్పేస్తున్నారు.
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.