వెంక‌న్న‌ను వెంటాడి వేటాడారు!.. ధూళిపాళ్ల‌, ప‌ట్టాభిలానే మ‌రో ఫైర్‌బ్రాండ్ అరెస్ట్‌..

Publish Date:Jan 24, 2022

Advertisement

ఎట్ట‌కేళ‌కు టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న‌ను అరెస్ట్ చేసి క‌సి తీర్చుకుంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ఆయ‌న ఎక్క‌డ దొర‌కుతారా అని ఎప్ప‌టి నుంచో కాచుకు కూర్చొంది. టీడీపీలో పెద్ద నోరున్న నేత‌గా.. నిత్యం వైసీపీ స‌ర్కారును కుళ్ల‌బొడిచే వెంక‌న్న‌పై జ‌గ‌న్ అండ్ కో కొంత‌కాలంగా ర‌గిలిపోతోంది. అస‌లే బెజ‌వాడ‌. అందులోనూ బుద్దా. ఇక ఆయ‌న దూకుడుకు, నోటికి ఎదురుంటుందా? అదే వైసీపీకి ఇబ్బందిగా మారింది. అందుకే, ప‌దే ప‌దే వెంక‌న్న‌ను టార్గెట్ చేసింది. ఓసారి భౌతిక దాడుల‌కు తెగ‌బ‌డగా.. తృటిలో త‌ప్పించుకున్నారు. ఇక లాభం లేద‌ని.. త‌న అన‌ధికార సైన్యాన్ని రంగంలోకి దింపిన‌ట్టుంది. ఆయ‌న ప్రెస్‌మీట్ల‌లో లూజ్ లైన్స్‌ను క్యాచ్ చేసి.. కార్న‌ర్ చేసింది. అరెస్ట్‌తో మ‌రో టీడీపీ నేతను బెదిరించి, భ‌య‌పెట్ట‌, నోరు మూయించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ధూళిపాళ్ల‌, ప‌ట్టాభిలానే మ‌రో ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌పై పంజా విసిరింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. 

బుద్దా వెంక‌న్న మొద‌టినుంచీ వైసీపీ టార్గెట్‌గానే ఉన్నారు. ఓసారి ఆయ‌న‌పై దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. క‌నిపిస్తే దాడులు.. కుదిరితే కేసులు.. వీలైతే హ‌త్య‌లు.. ఏపీలో వైసీపీ మూకల ఆగ‌డాల‌కు అంతేలేకుండా పోతోంది. ఇటీవ‌ల ప‌ల్నాడులో చంద్ర‌య్య‌ను వైసీపీ నాయ‌కులు న‌డిరోడ్డుపై దారుణంగా చంపేశారు. ఆ త‌ర్వాత‌ గుడివాడ‌లో టీడీపీ నేత బోండా ఉమాపై మ‌రోసారి హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. అంత‌కుముందు, బోండా ఉమాతో పాటు బుద్దా వెంక‌న్న‌పై ప‌ల్నాడులో మ‌ర్డ‌ర్ అటెంప్ట్ జ‌రిగింది.

గ‌తంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌మ‌యంలో మాచ‌ర్ల‌లో బోండా ఉమా, బుద్దా వెంక‌న్న‌లు ప్ర‌యాణిస్తున్న కారును.. వైసీపీ రౌడీలు కొన్ని కిలోమీట‌ర్ల పాటు వెంబ‌డించి దాడి చేశారు. తుర‌క కిశోర్ అనే వైసీపీ లీడ‌ర్‌ పెద్ద క‌ర్ర‌తో.. బుద్దా వెంక‌న్న‌పై దాడి చేశాడు. కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టి.. కారు లోప‌ల ఉన్న నేత‌ల‌ను ఆ క‌ర్ర‌తో కొట్టాడు. కానీ, తృటిలో త‌ప్పించుకుని.. కారును వేగంగా న‌డిపి.. ఆ హ‌త్యాయ‌త్నం నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అయినా, వ‌ద‌ల‌కుండా కారును వైసీపీ వ‌ర్గాలు వెంబ‌డించ‌గా.. స్థానిక పోలీసులు త‌మ వాహ‌నంలో బుద్దా వెంక‌న్న‌, బోండా ఉమాల‌ను సుర‌క్షితంగా విజ‌య‌వాడ త‌ర‌లించారు. ఆనాడు బుద్దా, బోండాల‌ను చంపాల‌ని చూసిన తుర‌క కిశోర్‌కు ఆ త‌ర్వాత మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన ఘ‌న‌త వైసీపీది. రౌడీల‌కు ఆ పార్టీలో అధిక ప్రాధాన్యం ఉంటుంద‌నే దానికి ఆ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. 

ఇప్ప‌టి వ‌ర‌కూ వైసీపీ వ‌ర్గీయుల చేతిలో 33 మంది టీడీపీ నాయ‌కులు హ‌త్య‌కు గుర‌య్యారు. 500 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఇక కేసుల సంఖ్య అయితే లెక్కేలేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి మాజీ మంత్రులు, అధికార ప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు.. అనేక వంద‌ల మందిని ఏదో ఒక కేసులో ఇరికించింది వైసీపీ ప్ర‌భుత్వం. అయినా ఆగ‌కుండా.. చంద్ర‌బాబు ఇంటిపై ముట్ట‌డి.. మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీసు ధ్వంసం.. లాంటి విధ్వంస‌కాండ కొన‌సాగిస్తూనే ఉంది. రాజారెడ్డి రాజ్యాంగం.. క‌డ‌ప ఫ్యాక్ష‌న్ అంటూ టీడీపీ ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా.. డీజీపీ కొమ్ము కాస్తున్నారంటూ ఎంత‌గా ఆరోపిస్తున్నా.. ఏపీలో వైసీపీ మూక‌ల ఆగ‌డాలు మాత్రం ఆగ‌డం లేదు. వారి అరాచ‌కాల‌కు అంతే లేకుండా పోతోంది. 

ఇక‌, బుద్దా వెంక‌న్న నోరు మూయించ‌డం వైసీపీ మూక‌ల ప‌ని కావ‌ట్లేద‌ని భావించారో ఏమో.. పోలీసుల‌ను ఆయ‌న‌పైకి పంపించార‌ని టీడీపీ మండిప‌డుతోంది. తాజాగా, విచారణ పేరుతో విజయవాడ టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్నను అరెస్టు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ముఖ్యమంత్రి, కొడాలి నాని, ఏపీ డీజీపీలపై విమర్శలు గుప్పించారన్న కారణం మీద పోలీసులు బుద్ధా వెంకన్న ఇంటికెళ్లి మ‌రీ అరెస్టు చేశారు. 

ఏపీలో విపరీతమైన అణచివేత కొనసాగుతోందని, పోలీసులు కూడా అధికార పార్టీ కనుసన్నల్లోనే వ్యవహరిస్తున్నారని నినాదాలు చేశారు. గ‌తంతో ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను పాత కేసుల్లో కొత్త‌గా అరెస్ట్ చేసి వేధించార‌ని అంటారు. ఇక బోసిడికే డైలాగ్‌ను ప‌ట్టుకొని ప‌ట్టాభి విష‌యంలో నానా ర‌చ్చ చేశారు. ధూళిపాళ్ల‌, ప‌ట్టాభిలానే ఇప్పుడు బుద్దా వెంక‌న్నను అటాక్ చేశార‌ని అంటున్నారు. గుడివాడ ఘటన తరువాత టీడీపీ నేతల విమర్శలను కూడా జీర్ణించుకోలేకపోతున్న పోలీసులు.. తామేం చేసినా చూస్తూ ఉండాల్సిందే తప్ప ఎదురు ప్రశ్నిస్తే ఎందాకైనా వస్తామన్నట్టుగా వారి ప్రవర్తన ఉందన్న వ్యాఖ్యానాలు ఈ అరెస్టు తరువాత వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కె.కన్వెన్షన్ ఎపిసోడ్ కు కొనసాగింపుగా కొడాలి నానిపై, రాష్ట్ర పోలీసు బాసు డీజీపీ గౌతమ్ సవాంగ్ పై విమర్శలు ఎక్కుపెట్టినందుకు బుద్ధా వెంకన్నను అరెస్టు చేసి లోప‌లేశారు. 

పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారంటూ తీవ్రస్థాయిలో ఆక్రోశం వెళ్లగక్కిన టీడీపీ నేతలను వివరణల పేరుతో అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ అరెస్టులు ఒక్క వెంకన్నతోనే ఆగిపోవని, మరిన్ని అరెస్టులతో ప్రతిపక్షంలో భయాందోళనలు రేపే కుట్ర జరుగుతోందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వెంకన్న కామెంట్లను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు అసలు కొడాలి నాని కామెంట్లను ఎందుకు కౌంట్ లోకి తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. పార్టీ అధినేత మీద ఎంత దారుణంగా మాట్లాడాడో ప్రపంచమంతా చూసింది. అయినా పోలీసులకు ఆ విషయమే తెలియనట్టు.. కేవలం బుద్ధా వెంకన్న కామెంట్లను మాత్రమే కౌంట్ లోకి తీసుకోవడం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదంతా క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లేన‌ని మండిప‌డుతున్నారు. 

By
en-us Political News

  
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.