కుల చిచ్చు రగిల్చే కుట్ర.. మంత్రులూ మీకిది తగునా?

Publish Date:Jan 28, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరార్ధం బ్రాహ్మణార్ధం అన్నట్లుగా చేపట్టిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై జిల్లాలలో అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ కడప జిల్లాలోనే చిచ్చు రాజుకుంది. వైఎస్సార్ జిల్లాను రెండుగా చేసి రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనాపై రాజంపేట వాసులు భగ్గుమంటున్నారు. లోక్‌సభ నియోజకవర్గం కేంద్రంగా ఉన్న రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
 

అదలా ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలోనే రాష్ట్ర రాజకీయ రాజధానిగా పేరొందిన విజయవాడ కేంద్రంగా ప్రతిపాదించిన కొత్త జిల్లాకు ప్రభుత్వం ‘ఎన్టీఆర్’ పేరును ప్రతిపాదించింది. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్టీఆర్ మీద గౌరవంతో, ఈ నిర్ణయం తీసుకుందా, కులాల మద్య చిచ్చు పెట్టేందుకే కుట్ర చేస్తోందా అంటే రెండవదే నిజం అనిపిస్తోందని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ  ప్రతిపాదనను  తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుందని,వ్యతికేంచాలనీ వైసీపీ ఆశించింది. ఆవిధంగా, ఎన్టీఆర్’ ను తెలుగు దేశం పార్టీకి దూరం చేయవచ్చనే ఆలోచన చేసింది.అయితే, వైసీపీ కుట్రను ముందుగానే పసిగట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే జగన్ రెడ్డి సర్కార్’కు చురకలు అంటించారు.సర్కార్ కపట నాటకాన్ని బయట పెట్టారు. అందుకే, ఎన్టీఆర్‌ను ఎవ‌రు గౌర‌వించినా తాము స్వాగ‌తిస్తామన్నారు. అయితే ఎన్టీఆర్ కేవ‌లం ఒక ప్రాంతానికి చెందిన నేత కాద‌ని.. ఆయ‌న‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని తాము డిమాండ్ చేస్తున్నామ‌ని గుర్తు చేశారు.అలాగే, ఓ వంక రాష్ట్రంలో ఎక్కడికక్కడ  ఎన్టీఆర్ విగ్రహలాను ధ్వంసం చేస్తూ.. మరో వంక ఎన్టీఆర్ పట్ల  తమకు  ప్రేమ ఉన్నట్లు నటిస్తే ప్రజలు నమ్మరని టీడీపీ నాయకులు చురకలు అంటించారు. అలాగే, అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ స్మృతి వ‌నం ప్రాజెక్టును నిలిపి వేసిన  జ‌గ‌న్ ప్రభుత్వం ఎన్టీఆర్‌పై త‌మ‌కు ప్రేమ ఉంద‌ని చెప్పే ప్రయ‌త్నాన్ని ప్రజ‌లు న‌మ్మర‌న్నారు. చివ‌రికి ఎన్టీఆర్ పేరున ఉన్న అన్నా క్యాంటీన్‌లను కూడా జ‌గ‌న్ నిలిపి వెయ్యడం నిజం కాదా, అని ప్రశ్నిస్తున్నారు. దీంతో  వైసీపీ  నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. అందుకే వైసీపీ, ప్రభుత్వం కొత్త  ఎత్తులు వేస్తున్నాయని అంటున్నారు.
అదలా ఉంటే, మంత్రులు పేర్ని నానీ, కొడాలి నాని విజయవాడ విషయంలో, కులం చిచ్చు రగిల్చే కుట్రకు తెర తీస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపధ్యంలోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలుంటే చెప్పాలంటూ తెరపైకొచ్చిన నానీ జోడీ, చెరో కులరాగం ఎత్తుకున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందులో భాగంగానే పేర్ని నానీ, విజయవాడ జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలనే డిమాండ్ వస్తే మెజారిటీ ప్రజల ఆమోదాన్నే పరిగణనలోకి తీసుకుంటామన్నారని అన్నారు. అంటే కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం మంత్రి నానీ చేశారని అంటున్నారు.
మరోవైపు మచిలీపట్నం కేంద్రంగా ప్రతిపాదించిన  కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని జిల్లా ప్రజలు పాదయాత్రలో సీఎం జగన్‌ను కోరారని మరో మంత్రి కొడాలి నాని అన్నారు. అందుకే ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతానని జగన్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అదే సమయలో ఎన్టీఆర్ జన్మ స్థలం నిమ్మకూరు, మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో ఉందని అన్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చినట్లు కొడాలి నాని తెలిపారు. తమ వద్దకు వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంటే, రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచే విజయవాడ విషయంలో చిచ్చు రగిల్చేందుకు ప్రభుత్వం, అధికార పార్టీ  ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు అంటున్నారు.
నిజానికి, వంగవీటిని తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని  సొంతం చేసుకునేందుకు వైసీపీ ఇప్పటికే ఒక విఫల యత్నం చేసింది. వంగవీటి రాధా హత్యకు రిక్కీ జరిగిన సందర్భంలో మంత్రి కొడాలి నానీ, ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తరపున రాయబేరాలునడిపారు. అయితే, చంద్రాబాబు చాణక్యం మూడు నానీల పప్పులు ఉడకలేదు.అందుకేఇప్పుడు మళ్ళీ, విజయవాడ జిల్లా పేరును చుట్టూ కుల రాజకీయం   చేసేందుకు వైసేపీ కుట్ర చేస్తోందని అంటున్నారు.

 

By
en-us Political News

  
ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌, గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు.
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.
సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.