రాజ్యసభలో విమానాల రద్దు అంశం.. చర్యలు తీసుకుంటామన్న కేంద్రం

Publish Date:Dec 5, 2025

Advertisement

గతమూడు నాలుగు రోజులుగా రోజులుగా విమానాల రద్దు అవుతూ ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడటం, విమానాశ్రాయాలలో ఆందోళనలకు దిగడం తెలిసింది. ముఖ్యంగా ఒక్క ఇండిగో సంస్థ  దాదాపు 500 విమానాలను రద్దు చేసిన అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది.  ఈ విమానాల రద్దు అంశం సాధారణ పౌరుల నుంచి ఏంపీల వరకూ అందరిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి రాజ్యసభలో చెప్పారు. రాజ్యసభ జీరో అవర్ లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన  ఒక విమానయాన సంస్థ గుత్తాధిపత్యం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు.

ఇందుకు సంబంధించి  ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని నిలదీశారు. కాగా ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు సభకు చెప్పారు.  తాను పౌర  విమానయాన శాఖ మంత్రితో మాట్లాడానన్న ఆయన  విమానయాన సంస్థ ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.  వాస్తవానికి నిర్వహణ లోపాల కారణంగానే  ఇండిగో విమాన సర్వీసులకు ఆటంకం కలిగిందని, ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై కేంద్రం కూడా రంగంలోకి దిగి విమానాల రద్దుపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని కిరణ్ రిజుజు అన్నారు.  బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

అదలా ఉంటే..  విమానయాన కార్యకలాపాలు నిలకడగా కొనసాగేందుకు పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పలు విమానయాన సంస్థల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న డీజీసీఏ   పైలట్ల విధులపై విధించిన ఇటీవల విధించిన ఆంక్షలను సడలిస్తూ శుక్రవారం  ఉత్తర్వులు జారీ చేసింది. పైలట్లకు  వారపు విశ్రాంతికి బదులుగా సెలవు మంజూరు చేయ రాదు అన్న షరతులు ఉపసంహరించింది.

ఈ నిర్ణయంతో ఇండిగో సహా పలు విమానయాన సంస్థలకు ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పైలట్ల వారాంత విశ్రాంతి నిబంధన సడలించడం వల్ల డ్యూటీ రోస్టర్లను సులభంగా నిర్వహించుకోవచ్చని, దీంతో విమాన రద్దుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంటున్నారు.  ఇలా ఉండగా ఒక్క శుక్రవారం (డిసెంబర్ 5)నే  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళాల్సిన 84 ఇండిగో విమానాలు  క్యా న్సెల్ అయ్యాయి. అలాగే వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. 

By
en-us Political News

  
వచ్చింది. ఈ మెయిల్ సీఎంవో మరియు లోక్ భవన్‌ను వెంటనే ఖాళీ చేయాలని, పెద్ద ప్రమాదం సంభవించబోతోందన్న హెచ్చరిక ఉంది. ప్రభుత్వ ప్రముఖులు, వీఐపీలు ప్రాణాపాయంలో ఉంటారని ఆ మెయిల్ హెచ్చరించింది.
భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే సోనియా గాంధీ ఓటరుగా నమోదు చేసుకున్నారని పిటిషనర్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీంతో సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 6కు వాయిదా వేసింది.
డాన్ బ్రాడ్ మన్ పేరిట ఎన్నో ఏళ్లుగా ఉన్న హయ్యస్ట్ టెస్ట్ సెంచరీల రికార్డును మన లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ బద్దలు కొట్టాడు. ఆ గావస్కర్ రికార్డును మన సచిన్ టెండూల్కర్ బ్రేక్ చేశాడు. అలాగే టెండూల్కర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు
350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్ ఈ నెల 16 మధ్యాహ్నం అబుదాబీలో జరగనుంది అని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంపిన మెయిళ్లలో బీసీసీఐ పేర్కొంది.
రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో జనం సాయంత్రమైతే చాలు బయటకు అడుగుపెట్టాలంటేనే వణుకుతున్న పరిస్థితి. ఉదయం 9గంటల సమయంలో కూడా చలి పులి పంజా విసురుతున్నది.
మంగళవారం దేశ వ్యాప్తంగా ఇండిగో సంస్థకు చెందిన వందల విమాన సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన, విమానాశ్రయానికి రావాల్సిన 58 విమాన సర్వీసులు ఉన్నాయి.
విశాఖపట్నంలో సైబర్ సెక్యూరిటీ కోసం జడ్ స్కాలర్ ఆధ్వర్యంలో ఆర్ & డి సెంటర్, డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేయాలని మంత్రి లోకేష్ జే చౌదరిని కోరారు.
శంషాబాద్‌ నుంచి అమెరికా కు వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టాననీ, టేకాఫ్‌ అయిన పది నిమిషాల్లో పేలుస్తానని ఆ ఈమెయిల్‌ లో జాస్పర్ పకార్ట్ పేర్కొన్నాడు. అంతే కాకుండా, బాంబులు పేలకుండా ఉండాలంటే ఒక మిలియన్‌ డాలర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ రింగ్ రోడ్డు సీఎం కాన్వాయ్ లోని జామర్ వాహనం వెనుక టైర్ పేలిపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్వవహరించి వాహనాన్ని పక్కకు మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఐబొమ్మ రవిపై నమోదైన మూడు కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు ఒక్కో రోజు చొప్పున కోర్టు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాల నిపుణులు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిపారు.
వీధి కుక్కలు జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలను చంపేసిన సంఘటనలు బయోత్పాన్నే సృష్టిస్తున్నాయి.
ఢిల్లీ హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.