దేవదేవుని సన్నిధిలో 'బాబు గర్జన'

Publish Date:Dec 30, 2013

Advertisement

 

 

 

దేవదేవుని సన్నిధిలో ప్రజా గర్జన ప్రారంభమైందని, తెలుగుదేశం ఈ మహయజ్ఞాన్ని ప్రారంభించిందని, అందరూ భాగస్వాములు కావాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఆదివారం జరిగిన ప్రజా గర్జన సభలో పిలుపునిచ్చారు. సుదీర్ఘ సమయం ప్రసంగించిన చంద్రబాబు ఆద్యంతం పూర్తి ఉద్రేకంగా మాట్లాడారు. బాబు ప్రసంగం ఇప్పటిదాకా ఆయన చేసిన వాటికి భిన్నంగా సాగింది. జనాన్ని తరచూ ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబడుతూ నేరుగా వారితోనే మాట్లాడిన అనుభూతిని కల్పించారు. ఆయన ఉపన్యాస ధోరణి గతానికి పూర్తి భిన్నంగా ఉండి జనాన్ని బాగా ఆకట్టుకుంది.

 

మరోవైపు వేదికపైకి వచ్చినప్పటి నుంచీ బాబు ఆద్యంతం ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు. తరచూ చిరునవ్వులు చిందిస్తూ జనానికి విజయసంకేతం చూపిస్తూ అభివాదం చేశారు. ఆయన పలకరింపులకు ప్రతిగా జనం రెచ్చిపోయి కేరింతలు కొట్టారు.



టీడీపీ విజన్ 2020 తయారు చేస్తే కాంగ్రెస్ దొంగలు విజన్ 420 తయారు చేశారంటూ 2004 నుంచి కాంగ్రెస్ పాలనను, ప్రత్యేకించి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను దృష్టిలో ఉంచుకుని విమర్శన్ద్మాలు సంధించారు. సోనియా గాంధీకి ప్రజలు దయతో ఓటు వేస్తే అనకొండ పాము కంటే భయంకరంగా దేశమంతా వేలాది అనకొండలను తయారు చేసిందని, వాటిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకటైతే సోనియా అల్లుడు రాబర్ట్ వాధ్రా ఇంకొకటని దెప్పి పొడిచారు. పిల్ల అనకొండ జగన్ అంటూ వర్ణించారు. ఈ అనకొండలు దేశాన్ని మింగేస్తున్నాయని, జగన్ వందలాది కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు.



ఒకవైపు కాంగ్రెస్, వైకాపాపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తూనే ఇంకోవైపు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేయదలచారో వాగ్దానాలు, హామీల రూపంలో చెప్పారు. తమను గద్దెనెక్కిస్తే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామంటూ సామాన్యులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తామని, ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీల వర్షం కురిపించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యత తనదే అని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. బీసీ డిక్లరేషన్ తమ పార్టీయే ఇచ్చిందని, పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన లక్షహ్యొం అని స్పష్టం చేశారు.



రాష్ట్ర విభజన విషయంలో అంటీముట్టనట్టుగా మాట్లాడే చంద్రబాబు తిరుపతి సభలో విభజన సమస్యల గురించి చాలాసేపే మాట్లాడారు. రాష్ట్రం విడిపోవాలంటే సీమాంధ్రకు న్యాయం జరగాలని, సమైక్యంగా ఉండాలంటే తెలంగాణకు న్యాయం చేయాలని, వీటిలో ఏది జరగాలన్నా రెండు ప్రాంతాల వారినీ ఒక చోటికి చేర్చి ఒప్పించాలని అనడం జనానికి నిజమే కదా అనిపించేలా చేసింది. చివరన చంద్రబాబు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామంటూ ప్రతిజ్ఞ చేయించినపుడు కూడా జనం ఉత్సాహంగా లేచి నిలుచుని ప్రతిజ్ఞ చేశారు.

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.