ఏపీ సర్కార్ దివాలా?

Publish Date:Dec 7, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దివాలా తీసిందా? అంటే, ప్రభుత వర్గాల నుంచే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రం ఇప్పటికే ఇక అప్పులు  పుట్టని స్థితికి చేరుకుంది. చివరకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, ఇతరత్రా పద్దుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిన నిధులను, పాత బకాయిల కింద వెనక్కి తీసేసుకుందంటే పరిస్టితి ఏమిటో మళ్లీ ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల నిధులను ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.  

అదలా ఉంటే, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడం లేదు. చివరకు   పెన్షన్లు కూడా సకాలంలో జమ కావడం లేదు. పెన్షన్ జమ కాగానే, హమ్మయ్యా, ఈ నెలకు పెన్షన్ జమైంది  అనే భావన కలుగుతోందని  పెన్షనర్లు వాపోతున్నారు. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వారంటున్నారు. అలాగే, ఫస్ట్ తేదీన జమ కావలసిన జీతాలు 15, 20 తేదీల వరకూ కూడా జమ కావడం లేదు.  ఏ రోజుకు ఆరోజు గల్లాపెట్టె చూసుకుని, విడతల వారీగా ఉద్యోగుల జీతాలు జమ చేస్తున్నారు. ఈ అన్నిటినీ మించి, చిన్నా చితక కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులు, కొండల్లా పేరుకు పేరుకుపోతున్నాయి. 

ఓ వంక ఉద్యోగులు, జీతాలు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే, కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దివాలా తీసింది అనేందుకు సంకేతాలే.  నిజానికి, జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు, ఆర్థిక వ్యవస్థ తడబడుతూనే ఉంది. తప్పటడుగులు వేస్తూనే వుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ‘ఉచిత’ ఖర్చుల పద్దును  పెంచుకుంటూ, పట్టాలు తప్పి ప్రయాణం సాగిస్తోంది. ఇప్పుడు పరిస్థితి మరింతగా దిగజారి, చేతులెత్తేసే  స్థితికి వచ్చేసిందని, అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్యంగా  సర్కార్ పనులు చేసిన కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు ఎంత కాలానికీ క్లియర్ కాకపోవడంతో రోడ్డెక్కి, ఆందోళనలు చేశారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా, సర్కార్ లో కదలిక లేదు. ఇక చేసేది లేక కోర్టు తలుపులు తట్టారు. క్యూ కట్టి ప్రభుత్వం పై చీటింగ్ పిటిషన్లు వేస్తున్నారు. అది కూడా ఒకరో ఇద్దరో కాదు. ఒకటో రెండో కాదు.. ఏకంగా వందల సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కోర్టులు, అక్షింతలు వేసినా, తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఆదేశాలు జారీ చేసినా, జగన్ రెడ్డి ప్రభుత్వం  పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మీద విశ్వాసంతో అప్పులు చేసి పనులు చేసిన కాంట్రాక్టర్లు  మరోమార్గం లేక కోర్టు ధిక్కరణ కేసులు వేస్తున్నారు.

అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు సరికదా, అసలుకే ఎసరు పెట్టే  ఆలోచనలు చేస్తునట్లు తెలుస్తోంది. ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అంటే కోర్టు వెలుపల మాజీ నాయమూర్తుల ద్వారా వివాదాలను పరిష్కరించునే ప్రయత్నం  సర్కార్ చేస్తునట్లు తెలుస్తోంది. ఆర్బిట్రేషన్‌కు వెళ్ళడం అంటే కాంట్రాక్టర్లను మరో విధంగా మోసం చేయడమే అవుతుందని, అంటున్నారు. అదే జరిగితే, ఒక విధంగా ప్రభుత్వం విశ్వాసం కోల్పోవడమే అవుతుంది.  అంతే కాదు, ప్రభుత్వం దివాల తీసిందని, పరోక్షంగానే అయినా ప్రభుత్వమే అంగీకరించినట్లు అవుతుందని అంటున్నారు. 

అదోకటి అలా ఉంటే, మోసపోయిన వారిలో, కరోనా సమయంలో మానవతా దృక్పథంతో మాస్కులు కుట్టిన మహిళలు, చిన్న చిన్న టైలర్ షాపులు, దర్జీలు, కరోనా రోగులకు భోజనాలు  సరఫరా చేసిన హోటల్ యజమానులు, ఇతర చిన్నా చితకా వ్యాపారులు కూడా ఉన్నారు. ఇప్పడు వీరంతా వీధిన పడ్డారు. అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే, ప్రభుత్వ దివాలా కు సాంకేతిక నిర్వచనం  ఏదైనా కావచ్చును, కానీ, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మాత్రం  సర్కార్ దివాలాకోరుతనానికి  అద్దం పడుతోందని అంటున్నారు.

By
en-us Political News

  
తిమ్మిని బమ్మిని చేసి, మాటలతో మాయ చేసే తండ్రి సపోర్టు బాగా వుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాట్లాడినా నడిచింది.
శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను మే 1కి వాయిదా వేసింది. వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ శవంలా మిగిలింది. అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాటికీ క్షమించరు.
మలేసియా రాజధాని కౌలా లంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మలేసియా నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలోనే ఢీకొన్నాయి
జగన్ పేరు చెప్పగానే ఎవరికైనా ఎం గుర్తుకు వస్తుంది. ముఖ్యమంత్రి హోదా. తననూ తన అధికారాన్ని, తన ప్రభుత్వ విధానాలనూ వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయించడం, ఇంకా కోపం తగ్గకపోతే రఘురామరాజుపై జరిగినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా పోలీసులను ఆదేశించడం.
రోజా.. రాజకీయ నాయకురాలిగా మారిన నటి. ఏపీ పర్యాటకశాఖ మంత్రి. రెండు సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఏపీఐఐసీ చైర్ పర్సన్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె తెలుగుదేశంలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో దిట్ట.
ప్రపంచ రాజకీయాల్లో తాజాగా ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది... అదే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ పాకిస్తాన్ దేశాన్ని సందర్శించడం.
పూర్తిగా సానుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా అత్యంత సంక్షిష్టంగా మార్చుకుని ఇబ్బందులు పడటం కాంగ్రెస్ కు పరిపాటి. గతంలో రాజకీయ పండితులు ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులు ఓడించలేరు. కానీ ఆ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది అని చెప్పేవారు.
చంద్ర‌బాబు నాయుడు స్కెచ్ వేశారంటే ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నారా చంద్రబాబునాయుడు.. పార్టీని న‌మ్ముకున్న వారికి.. క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా నిలిచిన వారికి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తారని పేరుంది. తాజాగా మ‌రోసారి ఆ విష‌యం రుజువైంది.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం(ఏప్రిల్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొంద‌డానికి ఎలాంటి డ్రామాలు ఆడేందుకైనా వెనుకాడ‌రు. ఈ విష‌యం గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రుజువైంది. కోడిక‌త్తి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందిన జ‌గ‌న్‌.. బాబాయ్ హ‌త్య‌ను చంద్ర‌బాబుపైనెట్టి ప్ర‌జ‌ల సానుభూతి ఓట్ల‌తో అధికారంలోకి వ‌చ్చారు.
బీజేపీ హ్యాట్రిక్ ధీమా సడలినట్లు కనిపిస్తోంది. మోడీత్వ మేనిఫెస్టో ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదని తొలి దశ పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
నాయకుడు పార్టీని ముందుండి నడిపించడమే కాదు.. క్లిష్ట సమయాల్లోనూ, సంక్షోభంలోనూ కూడా పార్టీ నేతలూ, క్యాడర్ లో తనపై విశ్వాసం, నమ్మకం కోల్పోకుండా నిలబెట్టుకోవాలి. చంద్రబాబు ఆ విషయంలో ఏ ఇతర రాజకీయ నేతకన్నా ముందు ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.