మదనపల్లిలో కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టు

Publish Date:Nov 12, 2025

Advertisement

 

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో  కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. పట్టణంలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్‌ బయటకొచ్చింది. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతిచెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

వైజాగ్‌కు చెందిన పద్మ అనే మహిళ.. మరో ఇద్దరు మహిళలను మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. వారికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేసి కిడ్నీలు తొలగించారు. ఆపరేషన్ తర్వాత యమున అనే మహిళ మృతిచెందింది. 

అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యమున కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మదనపల్లె గ్లోబల్‌ ఆసుపత్రి వైద్యులను అరెస్ట్ చేశారు. కిడ్నీ రాకెట్‌లో కీలక నిందితుడు రాకేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

అన్నమయ్య జిల్లాకు చెందిన డీసీహెచ్‌ డాక్టర్‌ ఆంజనేయులు కోడలు డాక్టర్‌ శాశ్వతి గ్లోబల్‌ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కిడ్నీ రాకెట్ వెనుక మదనపల్లె డయాలసిస్‌ కేంద్రం మేనేజర్‌ బాలు, పుంగనూరు డయాలసిస్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ నాయక్‌ ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

డాక్టర్‌ శాశ్వతి ఈ ముఠాతో కలిసి కిడ్నీ మార్పిడులకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. డయాలసిస్‌ సెంటర్‌కు వచ్చే ధనవంతులను టార్గెట్‌ చేసి, కిడ్నీ అవసరమైన పేషెంట్లకు కొత్త కిడ్నీలు దొరుకుతాయని నమ్మబలికే ఈ రాకెట్‌ నడిపారు.

ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమునను కిడ్నీ బ్రోకర్లు పద్మ, సత్య, వెంకటేశ్‌ సంప్రదించారు. కిడ్నీ ఇస్తే రూ.8 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. యమున కిడ్నీని మదనపల్లె గ్లోబల్‌ ఆసుపత్రిలో సేకరించి, గోవాలోని ఒక వ్యక్తికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.

నవంబర్‌ 9న ఆపరేషన్‌ జరుగుతుండగా, యమున మూర్చపడి మృతిచెందింది. ఈ ఘటనను గ్లోబల్‌ ఆసుపత్రి నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని తిరుపతి మీదుగా వైజాగ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.

అయితే యమున భర్త సూరిబాబుకు అనుమానం రావడంతో తిరుపతి నుంచి 112కి ఫిర్యాదు చేశారు. తిరుపతి పోలీసుల సమాచారంతో మదనపల్లె టూ టౌన్‌ పోలీసులు గ్లోబల్‌ ఆసుపత్రిపై దాడి చేశారు. అక్కడే ఉన్న మేనేజర్లు బాలు, వెంకటేశ్‌ నాయక్‌లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వైజాగ్‌కు చెందిన బ్రోకర్లు సత్య, పద్మ, వెంకటేశ్వర్లను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

By
en-us Political News

  
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
హరీష్ రావుపై తాన చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చే నాయకులను కవిత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ కు మద్దతుగా నోరెత్తిన నేతలపై కవిత విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, వారి అవినీతి బాగోతాలు కూడా బయటపెడుతూ వారి నోళ్లు మూయించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం అంటే.. కేటీఆర్ కు కష్టకాలం మొదలయ్యిందనే చెప్పాలంటున్నారు పరిశీలకులు. ఇప్ప‌టికే వ‌రుస ఓట‌ముల‌తో ఉక్కిరిబిక్కిరై ఉన్న కేటీఆర్ ఇప్పుడు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తార‌న్నది పార్టీ శ్రేణుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.