అన్నాహజారే మనసు కరుగుతోందా

Publish Date:Dec 29, 2013

Advertisement

 

ఒకప్పుడు అన్నాహజారేతో కలిసి జనలోక్ పాల్ బిల్లుకోసం ఉద్యమించిన అరవింద్ కేజ్రీవాల్, ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను పనిచేయించలేమని గ్రహించి, మార్పు తేవాలంటే స్వయంగా రాజకీయాలలో ప్రవేశింఛి అందుకు కృషి చేయడమే మార్గమని భావించడంతో, నాటి నుండి వారిరువురి దారులు వేరయిపోయాయి. ఆ తరువాత గత ఏడాది కాలంగా డిల్లీ ప్రజల సమస్యలపై అరవింద్ కేజ్రీవాల్ అనేక పోరాటాలు చేసారు కూడా. కానీ అవన్నీదున్నపోతు మీద వానలాగే డిల్లీ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. ఆ తరువాత ఆయన ఆమాద్మీ పార్టీని స్థాపించడం, దానితో డిల్లీ ప్రజలందరూ మమేకం కావడం, ఆయన డిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నీచకచకా జరిగిపోయాయి.

 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టిననాటి నుండి ఆయన అయన అనుచరుల నిజాయితీతో కూడిన మాటలు, చేపడుతున్న చర్యలు చూసిన తరువాత బహుశః అన్నాహజారే మనసు క్రమంగా కరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఇటీవల ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “వ్యక్తులు రాజకీయాలలోకి చేరడం నేరమని నేను భావించడం లేదు. కానీ వాటిలో చేరిన తరువాత వారి ప్రమేయం లేకుండానే అవినీతి, లంచగొండితనమూ,అధికార లాలసలో మునిగిపోతారనే ఉద్దేశ్యంతోనే నేను రాజకీయాలలో చేరడాన్ని వ్యతిరేఖిస్తున్నాను. అయితే అరవింద్ కేజ్రీవాల్ ని నేను చాలా కాలంగా చూస్తున్నాను. ఆయన చాలా నీతి, నిజాయితీ గల వ్యక్తి. ఇప్పుడు కూడా ఆయన అదేవిధంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వంలో అవినీతిని పారద్రోలి మిగిలిన రాజకీయ నేతలకు పార్టీలకు ఆదర్శంగా నిలవాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.

 

అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్స్వానికి కూడా హాజరవడానికి ఇష్టపడని అన్నాహజారే ఇప్పుడు ఈవిధంగా మాట్లాడటం చూస్తే కొంచెం మెత్తబడుతున్నట్లు అర్ధం అవుతోంది. బహుశః అరవింద్ కేజ్రీవాల్ మాటలలో నిజాయితీని అన్నాహజారే గుర్తించినందునే ఆయనలో ఈ మార్పు వచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వం మరియు ఇతర వ్యవస్థల నుండి అవినీతిని పారద్రోలడం తన ఒక్కడివల్లే కాదని, అందుకు అందరూ కలిసి కృషి చేద్దామని అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపుకు, అన్నాహజారే కూడా సానుకూలంగా స్పందించినట్లు భావించవచ్చును.

 

ఇద్దరి గమ్యం ఒకటే గనుక, ఆయన కూడా ఆమాద్మీ ప్రభుత్వం వెనుక నిలబడితే ఇక ప్రక్షాళణా కార్యక్రమం వేగవంతమవుతుంది. అదేసమయంలోల్ అమాద్మీ ప్రభుత్వం గాడి తప్పితే హెచ్చరిస్తూ ఉండవచ్చును. అంతేగాక అన్నాహజారే వచ్చిఆమాద్మీ పక్కన నిలబడితే, ఇక కాంగ్రెస్, బీజేపీలు ఎటువంటి దుస్సాహసానికి పూనుకొనే ధైర్యం చేయలేవు కూడా. అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఒక మంచి ప్రయోగానికి అన్నాహజారే వంటివారు కూడా ముందుకు వచ్చి తమ సహకారం అందిస్తే, తప్పకుండా అది విజయవంతమవదమే కాక అది క్రమంగా దేశమంతటా వ్యాపించే అవకాశం ఉంటుంది.

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.