తెలుగుదేశం ప్రచార గీతాల వీడియో విడుదల

ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌,  గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం  (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి  టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.  ఈ సందర్భంగా  పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.డి. జనార్థన్‌ మాట్లాడుతూ...  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల దృష్ణా ఏపీలోని జగన్  ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో చేసిన అరాచకం,  ప్రజలను వేధించిన విధానాలతో , భావితరాలకు ధన, మాన రక్షణ కరవైంది. కనుక ఏపీ లోని ఈ పరిస్థితులకు చలించిన కొంత మంది సినీ ప్రముఖులు కొన్ని పాటలను రూపొందించారు. కె.ఎస్‌. రామారావు, కొడాలి వేంకటేశ్వర్‌ రావులు కలిసి రెండు పాటలను రూపొందించారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇంతకుముందే 12 పాటలను రూపొందించి ఉన్నారు. ఇప్పుడు 13వ పాటను రూపొందించి ఆ పాటను పాడటం కూడా జరిగింది. ఈ పాటలను రూపొందించడంలో  ముఖ్యపాత్ర వహించిన ప్రతి ఒక్కరికీ అభినందనలను తెలియజేస్తున్నాన్నారు.  పార్టీ జాతీయ అధికార ప్రతినిధి  నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ...  ఇటువంటి అద్భుతమైన పాటలను వినే అదృష్టం తనకు కలిగిందని అన్నారు. వినడం, చూడటం ద్వారా సమాజం ప్రభావం ఉంటుందనీ,  జనం పడుతున్న అనేక రకాల ఇబ్బందులను  స్పష్టంగా మన కళ్లకు కనిపించే విధంగా, చెవులలో మారుమ్రోగే విధంగా పాటలు రాసి పాడిన వారికి, నటించిన వారికి ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలను తెలియజేస్తున్నానన్నారు.  కొన్ని పాటలు ప్రభుత్వాన్నే మార్చిన పరిస్థితులను చూశాం. జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం నిరంతరంగా శ్రమిస్తున్న  నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వాన్ని బలపర్చడం కోసం తనకు తోచిన విధంగా సహకరిస్తున్న ప్రతివ్యక్తికి, పెద్దలందరికీ పేరుపేరున ధన్యవాదాలను తెలియజేస్తున్నానన్నారు.   అనంతరం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి  తిరునగరి జ్యోత్స్న మాట్లాడుతూ జగన్ పాలనలో ఏపీ ఎదుర్కొంటున్న పరిస్థితులను చూపించి ఏపీలో ప్రజా పరిపాలన రావాలనే ఉద్దేశంతో ప్రతి వర్గం కృషి చేస్తున్నదన్నారు.  రాష్ట్రం బాగు కోసం చలన చిత్ర రంగం తన  వంతు బాధ్యతగా  కంకణబద్దులై పని చేస్తున్నారని ప్రశంసించారు. ఈ పాటలలో ప్రతి వర్గం పడుతున్న బాధలను కళ్లకు కట్టడమే కాకుండా, ఆ బాధలను తీర్చగలిగే నాయకుడు ఎవరన్నది కూడా   మనసుకు హత్తుకునే లా తెలియజేశాయని ప్రశంసించారు.  పాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. జగన్ ఐదేళ్ల  అరాచక పాలనకు చరమగీతం పాడాలనీ,  అటువంటి ప్రభుత్వం గద్దె దిగాలని, ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావాలన్న సత్సంకల్పంతో  ఈ బృహత్తర ఆలోచన చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ప్రముఖ నిర్మాత, కె.ఎస్‌. రామారావు  ఇంత మంది, ఇంత ఇన్సిపిరేషన్‌తో పాటలను రాసి, తీయడానికి ప్రధాన కారణం 45 డిగ్రీల ఎండలలోనూ చంద్రబాబు  ఏపీ ప్రజల కోసం కష్టపడుతుండటమేనన్నారు. చంద్రబాబు శ్రీమతి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్‌, నందమూరి బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌ గారు మండుటెండల్లో ఏపీ బాగుండాలని కష్టపడి పని చేస్తున్నారు. ఆ ఎండల ప్రభావం ఇక్కడ ఉండే మనకు తెలియదు. ఆ మండుటెండలు ఎలా ఉంటాయో ఏపీలోకి వెళ్లి చూస్తే   తెలుస్తుంది అన్నారు. ఏడు పదుల వయస్సులో  మండుటెండలో చంద్రబాబు  తిరుగుతుండటం చూసి స్ఫూర్తిని పొంది కొడాలి వేంకటేశ్వర్‌ రావు, గుమ్మడి గోపాలకృష్ణ గారు ముందుకు వచ్చి చేశారు. దేశానికి నాయకుడు కావాల్సిన చంద్రబాబు  తనను తాను తగ్గించుకుని  రాష్ట్రం కోసం పని చేస్తున్నారు, అటువంటి మనిషి ఏపీని అభివృద్ధి చేసుకుందామని ప్రజలను రిక్వెస్ట్‌ చేసుకుంటుంటే బాధ కలుగుతోందంటూ కేఎస్ రామారావు భావోద్వేగానికి గురయ్యారు.   ఏపీలో ఇంత దరిద్రపు పాలనను ఎవరూ ఊహించలేరు. చంద్రబాబు స్ఫూర్తితో ఉడతా భక్తిగా సహాయం చేయాలనే   ద్దేశంతో, టి.డి. జనార్థన్‌ గారి ప్రోత్సాహంతో ఈ పాటలను మీ ముందుకు తీసుకొస్తు న్నామన్నారు.  వీటిని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం తీసుకురావాలి. ఏపీని బాగు చేసుకోవడానికి చంద్రబాబుకి మీ అందరి సహకారం కావాలి, ఆయనను గెలిపించుకోవడం మన అందరి బాధ్యత అని కేఎస్ రామారావు అన్నారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడిన నిర్మాత నిర్మాత, కొడాలి వేంకటేశ్వర్‌ రావు ఈ పాటలను   టి.వి. పరిశ్రమ వారు, వర్కర్సు చేసినవి. ఈ కార్యక్రమాన్ని మొదట హేమంత్‌ అనే వ్యక్తి ప్రారంభించారు. నేను, కె.ఎస్‌. రామారావు   చేసింది తక్కువ. నాని, చక్రి, అశోక్‌, శ్రీనివాస్‌ వంటి వారు వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని షూట్‌ చేశారు. దీనిని డైరెక్టుగా షూట్‌ చేసి సాంగ్స్‌ ను చేశాం. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పాటలను చేయడం జరిగింది. 175 నియోజకవర్గాలకు వీటిని రీఎడిట్‌ చేసి ప్రతి నియోజకవర్గానికి పనికివచ్చే విధంగా చేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో గుమ్మడి గోపాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్‌  ప్రకాష్‌ రెడ్డి, శిరీషా, సీబీఎన్‌ వారియర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

చీపురుపల్లిలో బొత్సకు ఎదురుగాలి.. బలంగా పుంజుకున్న కళా వెంకటరావు!

మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం  నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరిన బొత్స 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్లీ అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చీపురుపల్లిలో బొత్స పరాజయం లక్ష్యంగా తెలుగుదేశం వ్యూహాత్మకంగా ఆలోచించింది. బొత్సకు దీటైన ప్రత్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అని భావించి ఆయనను అక్కడ నుంచి పోటీలోకి దింపాలని భావించింది.  గంటా ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ నియోజకవర్గం నుంచైనా విజయం సాధిస్తారని ప్రతీతి. అయితే చీపురుపల్లి నుంచి బరిలోకి దిగడానికి విముఖత చూపిన గంటా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నుంచే పోటీ చేయడానికి ఇష్టపడ్డారు. బొత్సాపై పోటీకి గంటా నిరాకరించ డం తెలుగుదేశం పార్టీకి ప్రతికూల సంకేతాలు పంపిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. అయితే చీపురుపల్లిలో తెలుగుదేశం కష్టాలు అక్కడితో తీరిపోలేదు. గంటా పోటీకి నిరాకరించడంతో తెలుగుదేశం అధినేత చివరి నిముషంలో చీపురుపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కళా వెంకటరావును నిలిపారు. అయితే ఆ ఎంపిక పార్టీలో సీనియర్ నాయకుడికి టికెట్ నిరాకరించకుండా అకామిడేట్ చేసినట్లుగానే కనిపించింది.  దీంతో చీపురుపల్లిలో తెలుగుదేశం క్యాడర్ కూడా నిరుత్సాహపడింది. అక్కడ నాగార్జున గత కొంత కాలంగా పని చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో మంచి పట్టు సాధించారు. అయితే చంద్రబాబు రాజాం నుంచి తీసుకువచ్చి కళా వెంటకరావుకు పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులన్నీ చీపురుపల్లిలో గంటా గెలుపు నల్లేరు మీద బండికగా మార్చేశాయని అప్పట్లో పరిశీలకులు సైతం విశ్లేషించారు. అయితే అనూహ్యంగా చీపురుపల్లిలో పరిస్థితి రోజురోజుకూ మారిపోతోంది. తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా నియోజకవర్గంలో బొత్సకు ఎదురు గాలి వీస్తున్నది.  నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మెరకమూడిదాం మండలంలో  తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతు లభించింది. అక్కడ కళా వెంకట్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగాయి. అలాగే నియోజకవర్గంలోని పలు ఇతర మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు పెరిగాయి. ఈ పరిస్థితులను చూస్తుంటే బొత్సకు చీపురుపల్లిలో విజయం అంత వీజీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఆశల పల్లకిలో కేసీఆర్!

అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు. సరిగ్గా అదే విధంగా గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికలకు ముందు కూడా తాను అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెప్పారు. అయితే వాస్తవ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఆయన దాదాపుగా అటువంటి సర్వేలపైనే ఆధారపడ్డారు. లోక్ సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు అనివార్యమనీ, మళ్లీ బీఆర్ఎస్ హవా నడుస్తుందని పార్టీ నేతలను, శ్రేణులనూ నమ్మించే ప్రయత్నం చేశారు. లోక్ సభ ఎన్నికలలో పెటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ లు అందజేసిన కేసీఆర్ పాతిక మంది కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారనీ, లోక్ సభ ఎన్నికల తరువాత వారంతా బీఆర్ఎస్ గూటికి చేరుతారనీ చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఓ 20 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. ఆయన మాటలలో వాస్తవం సంగతి పక్కన పెడితే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ లో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తున్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ దే పై చేయి అనీ రాష్ట్రంలో తన మాటే చెల్లుబాటు అవుతుందనీ భ్రమపడుతున్నారు.   లొక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలో కచ్చితంగా ఎనిమిది స్థానాలలో విజయం సాధిస్తుందనీ, మరో మూడు స్థానాల్లో కేడా గెలిచే అవకాశాలున్నాయనీ తన అంతర్గత సర్వేలో తేలిందని చెప్పుకొచ్చిన ఆయన ఆ సర్వే ఎప్పుడు ఎవరితో చేయించారో వెల్లడించలేదు. అధికారంలో ఉన్న సమయంలో అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు ద్వారా సర్వేలు చేయించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఇటువంటి అంతర్గత సర్వేలకు పార్టీపైనే ఆధారపడాలి. విపక్షంగా మారిన క్షణం నుంచీ బీఆర్ఎస్ స్థిమితంగా ఉన్న పరిస్థితి లేదు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక దగ్గర నుంచీ అంతటా కేసీఆర్ కు ఇబ్బందికరంగానే పార్టీ నేతలూ, కేడర్ వ్యవహరించారు.  ఇంతకీ ఆయన ధీమా ఏమిటంటే 104 సీట్లు వచ్చినప్పుడే  బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించింది. 64 సీట్లతో కాంగ్రెస్‌నుఅధికారంలో ఎలా కొనసాగనిస్తుందన్నది ఆయన ధీమా. అదే జరిగితే  భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దే  అని కేసీఆర్  ఊహలపల్లకిలో ఊరేగుతున్నారు.  అయితే ఆయన కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పి 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అదీ గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన కాంగ్రస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయనా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయి. ఇటీవల ఒక సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాతిక మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారనీ, ఏ క్షణంలోనైనా వారు ‘చేయి’ అందుకుంటారనీ చెప్పారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు లోక్ సభ ఎన్నికల తరువాత నుంచీ బీఆర్ఎస్ నుంచి సిట్టింగుల వలసల వరద ప్రారంభ మౌతుందంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చెబుతున్న మాటలు, వ్యక్తం చేస్తున్న విశ్వాసంపై బీఆర్ఎస్ నేతలు భరోసా ఉంచగలరా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

రేవంత్ దూకుడు.. 14లోక్ సభ స్థానాల్లో గెలుపే టార్గెట్!

 తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది.  నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా  ప్ర‌క‌టించాల్సి ఉంది. ముఖ్యంగా ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మ‌రోవైపు తెలంగాణ‌లో 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర‌వేసేలా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించారు. అందుకు త‌గ్గట్లుగా వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా సీఎం రేవంత్ రెడ్డి అమ‌లు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని అమలు కాలేదు. అయితే హామీల అమలు విషయంలో రేవంత్ చిత్తశుద్ధి కారణంగా   ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్  గ్రాఫ్ పెరిగింది. మూడు నెల‌ల కాలంలో ఇచ్చిన హామీల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌రిష్క‌రించామ‌ని, ఎన్నిక‌ల కోడ్ తొల‌గించిన వెంట‌నే మిగిలిన హామీల‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం ద్వారా వారి నుంచి మ‌రింత మ‌ద్ద‌తు పొందేలా కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీక‌రించింది.  లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి భుజానికెత్తుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేయ‌నున్నారు. తమ ప్రభుత్వ పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమ్ అని ఇప్పటికే  ప్రపకటించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్ర‌చారానికి శ్రీకారం చుట్టారు.   మే 11వ తేదీ వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. శుక్ర‌వారం (ఏప్రిల్ 19) మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌.. సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభ లో పాల్గొంటారు. ఈనెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు మద్దతుగా ర్యాలీ, సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 21న భువనగిరి లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22న మధ్యాహ్నం ఆదిలాబాద్ లో నిర్వహించే సభ లో పాల్గోనున్న రేవంత్‌.. 23న నాగర్ కర్నూల్, 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించే స‌భ‌ల్లో పాల్గొంటారు. 25న చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మద్దతుగా ర్యాలీలో పాల్గొని అనంత‌రం జ‌రిగే సభలో రేవంత్ రెడ్డి ప్ర‌సంగిస్తారు. ఇలా మే 11వ తేదీ వ‌ర‌కు  రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సుడిగాలి ప‌ర్య‌టన‌లు చేయ‌నున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి పార్టీలో చేరిక‌ల జోరు రోజురోజుకు పెరుగుతోంది. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్, క‌డియం శ్రీ‌హ‌రి, తెల్లం వెంక‌ట్రావులు కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. రెండు రోజుల్లో ఆయ‌న‌సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంది. గ్రేట‌ర్‌లో మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ, డిప్యూటీ మేయ‌ర్ తో పాటు కొంద‌రు కార్పొరేట‌ర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ నుంచి ముఖ్య‌నేత‌లు, ద్వితీయ శ్రేణి నేత‌లు కాంగ్రెస్ లోకి క్యూ క‌డుతుండ‌టంతో పార్టీ బ‌లం రోజురోజుకు పెరుగుతున్నది.   దీంతో రాష్ట్రంలో 17 లోక్‌స‌భ స్థానాల్లో 14  నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమాతో ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీ మూడు నెల‌ల పాల‌నకు పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రెఫ‌రెండమ్ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌కొట్ట‌డం ద్వారా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీది గాలివాటం గెలుపేన‌ని నిరూపించేందుకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  మ‌రోవైపు బీజేపీ అధిష్టానంసైతం కాంగ్రెస్ కు షాకిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీల నేత‌లు రేవంత్ రెడ్డి మూడు నెల‌ల పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇచ్చిన హామీల‌ను అమలు చేయ‌డంలో రేవంత్ స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డానికే అధికారాన్ని వినియోగిస్తున్నార‌ని మాజీ సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీరును ఎండ‌గ‌తామ‌ని అన్నారు. అయితే,  బీజేపీ, బీఆర్ ఎస్   నేత‌ల నుంచి ఎదుర‌య్యే విమ‌ర్శ‌ల‌కు రేవంత్ రెడ్డి  ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాధానం ఇస్తూ తిప్పికొడుతున్నారు. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌డంతోపాటు.. రాబోయే కాలంలో ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండ‌గా ఉంటుందో స్ప‌ష్టం చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ అధిష్టానం టార్గెట్ ను రేవంత్ ఏమేర‌కు రీచ్ అవుతాడ‌నే అంశం తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ.. త్వరలో కాంగ్రెస్ గూటికి!?

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే  ప్రకాష్ గౌడ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఆయన కేవలం మర్యాదపూర్వకంగా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు రేవంత్ రెడ్డిని కలవలేదు. తాను తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరుతామని చెప్పడానికే రేవంత్ రెడ్డిని కలిశారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది. ఇలా ఉండగా గత కొంత కాలంగా ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత లోక్ సభ ఎన్నికల తరువాత రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయనీ, కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉందనీ, ఇప్పటికే 20 మంది వరకూ తమతో టచ్ లో ఉన్నారనీ చెప్పి 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లడం విశేషం. వసలను నిరోధించడానికే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పారని ప్రకాష్ గౌడ్ ఉదంతంతో తేటతెల్లమైంది. కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాతిక మంది  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లోకి వచ్చారనీ, వీరంతా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారనీ చెప్పిన సంగతి తెలిసిందే.  మొత్తం మీద సిట్టింగులను కాపాడుకోవడంలో, వలసలను నివారించడంలో బీఆర్ఎస్ అధినాయకత్వొం చేతులెత్తేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఉత్తరాదిలో కానరాని బీజేపీ హవా.. ఆర్ఎస్ఎస్ చెబుతున్నది నిజమేనా?

సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే  కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.  అలాగే ప్రముఖ రాజకీయ, ఆర్థిక వేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ కూడా ఉత్తరాదిలో బీజేపీ గ్రాఫ్ డౌనైందంటున్నారు.   దేశంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న కమలం పార్టీపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని ఆయన వివరిస్తున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, అలాగే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కూడా బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ 400 స్థానాలు అని గొప్పలు చెప్పుకుంటోందనీ, క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే ఆ పార్టీ కనీసం 200 స్థానాలలో విజయం సాధించడం కూడా కష్టమేననీ చెబుతున్నారు.  ఆర్ఎస్ఎస్ వినా బీజేపీ గ్రాఫ్ పడిపోతోందన్న అభిప్రాయాలన్నీ  రాజకీయ వైరంతో చెబుతున్న మాటలు, జోశ్యాలుగా కొట్టి పారేసినా బీజేపీ మెంటార్ రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మాత్రం ఆలోచించాల్సిందేనంటున్నారు పరిశీలకులు. ఆర్ఎస్ఎస్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన అంతర్గత సర్వేలో   ఈ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ రెండోందలకు మించి స్థానాలను గెలుచుకునే పరిస్థితి లేదని తేలింది. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ వర్గాలే చెబుతున్నాయి.  ఆర్ఎస్ఎస్ అంచనా ప్రకారం 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ గణనీయంగా సీట్లను నష్టపోతున్నది. ఆర్ఎస్ఎస్ చెబుతున్న దానిని బట్టి చూస్తే బీజేపీ సొంతంగా 178 స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది.  అంటే క నీసం 300 స్థానాల సొంతంగా విజయం అన్న బీజేపీ లక్ష్యం నెరవేరే చాన్సే లేదు.   వాస్తవానికి గత కొన్ని నెలలుగా పరిశీలకులు వైసీపీకి ఉత్తరాదిలో ఆదరణ తగ్గుతోందంటూ విశ్లేషణలు చేస్తున్నారు. ఆక్కడ తగ్గే స్థానాలను దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ హైకమాండ్ ఉందని అంటున్నారు. అయితే దక్షిణాదిలో ఒక్క కర్నాటక వినా ఆ పార్టీకి పెద్దగా కలిసి వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. నిన్న మొన్నటి వరకూ అక్కర్లేదు మేమే చాలు అంటూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను దూరం చేసుకున్న కమలనాథులు ఇప్పుడు చిన్నా చితకా పార్టీలను కూడా ఎన్డీయేలోకి ఆహ్వానిస్తూ.. మరో సారి అధికారంలోకి వస్తే కచ్చితంగా మిత్రధర్మాన్ని పాటించి భాగస్వామ్య పక్షాలకు సముచిత ప్రాధాన్యతను ఇస్తామని నమ్మకంగా చెబుతున్నారు.   ఉత్తరాదిలో బలమైన   రాజపుట్లు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మారడం కూడా ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేందుకు కారణమైందని అంటున్నారు.   బీజేపీ ప్రముఖుడు ఇటీవల రాజ్‌పుట్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ ప్రభావం ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో బీజేపీపై ప్రతికూల ప్రభావాన్ని చూపడానికి కారణమయ్యాయి.    ఇక ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం కూడా, బీజేపీకి మైనస్ అయ్యిందన్నది పరిశీలకుల విశ్లేషణ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఇటీవల వెల్లడించిన  వివరాలలో  ఈడీ-సీబీఐ కేసులకు గురైన కంపెనీలన్నీ తర్వాత, బీజేపీకి భారీ మొత్తంలో  ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు ఇచ్చాయతేలడం బీజేపీకి భారీ నష్టం చేకుర్చనుందని అంటున్నారు. ఏయే కంపెనీ బీజేపీకి ఎంతెంత విరాళాలు ఇచ్చిందన్న వివరాలు గత కొద్దిరోజు నుంచి మీడియాలో శరపరంపరగా వస్తూనే ఉన్నాయి. అది సహజంగానే బీజేపీకి కొంత నష్టం కలిగి ఉండవచ్చంటున్నారు. 

కొరడా ఝుళిపిస్తున్న ఈసీ.. వైసీపీకి ఇక దబిడి దిబిడే!

ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు. దీంతో ఈసీ కొర‌డా ఝుళిపించింది. వైసీపీతో అంట‌కాగుతూ.. ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రిస్తున్న రాష్ట్ర స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డిపై ఈసీ వేటు వేసింది. మ‌రోవైపు ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడి హోదాలో ఉండి ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి సైతం ఈసీ షాకిచ్చింది. మంత్రుల‌తో స‌మానంగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల‌కు ఎన్నిక‌ల నియ‌మావ‌ళి వ‌ర్తిస్తుంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి  ముకేశ్ కుమార్ మీనా ప్ర‌భుత్వ‌ స‌ల‌హాదారుల‌కు స‌మాచారం చేర‌వేయాల‌ని పొలిటిక‌ల్ సెక్ర‌ట‌రీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిన్న‌టి వ‌ర‌కు ఎల‌క్ష‌న్ నియ‌మావ‌ళితో సంబంధం లేకుండా విప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేసిన వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల నోటికి తాళం ప‌డిన‌ట్ల‌యింది. మ‌రోవైపు  వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న సీఎస్, డీజీపీల‌ను ప‌క్క‌న‌పెట్టేందుకు ఈసీ అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం సూచ‌న‌ల‌తో సీఎస్‌, డీజీపీల‌పై చ‌ర్య‌లు ఉంటాయ‌ని రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ మీనా స్ప‌ష్టం చేశారు. దీంతో ఎన్నిక‌ల వేళ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ప్ర‌వ‌ర్తిస్తున్న వైసీపీ మ‌ద్ద‌తుదారుల‌కు ఈసీ షాకివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.  ఎన్నిక‌ల కోడ్ స‌మ‌యంలోనూ కొంద‌రు ప్ర‌భుత్వ అధికారులు వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో డీజీపీ స్థాయినుంచి వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కింది స్థాయి అధికారుల‌పై ఎన్నిక‌ల సంఘానికి కూట‌మి నేత‌లు ఆధారాల‌తో స‌హా ఫిర్యాదులు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ప్ర‌వ‌ర్తిస్తున్న వారిపై ఈసీ కొర‌డా ఝుళిపిస్తుంది. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాచ‌రిక పాల‌న‌ను కొన‌సాగించారు. ఐదేళ్ల‌లో జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల నుంచి ఎదురువుతున్న నిర‌స‌న‌ల‌తో జ‌గ‌న్‌, వైసీపీ అభ్య‌ర్థులు బెంబేలెత్తిపోతున్నారు. జ‌గ‌న్ చేప‌ట్టిన బ‌స్సు యాత్ర‌కుసైతం ప్ర‌జాద‌ర‌ణ క‌రువైంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల్లో మ‌రోసారి సానుభూతి పొందేందుకు రాయిదాడి ఘ‌ట‌న‌ను జ‌గ‌న్‌ తెర‌పైకి తెచ్చార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. రాయిదాడి ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసి ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందాల‌ని చూసిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టింది. దీంతో పోలీసులు స‌హాయంతో రాయిదాడి ఘ‌ట‌న‌ను  తెలుగుదేశం నేత‌ల‌పై నెట్టేందుకు వైసీపీ పెద్ద‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌తంలో ఇదే త‌ర‌హాలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కోడి క‌త్తి, వివేకానంద రెడ్డిల హ‌త్య ఘ‌ట‌న‌ల‌ను తెలుగుదేశంపై నెట్టి ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంద‌డం ద్వారా వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఈసారికూడా అదే త‌ర‌హా వ్యూహాన్ని అమ‌లు చేసిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై  ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికితోడు ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైసీపీ నేత‌ల‌పై ఈసీ కొర‌డా ఝుళిపిస్తున్నది.   రాష్ట్ర స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న‌న్ని రోజులు వైసీపీ కార్య‌క‌ర్త‌గానే వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌తిప‌క్షాల‌పై ఉద్యోగుల‌ను రెచ్చ‌గొట్ట‌డం, ప్ర‌భుత్వ ఉద్యోగి హోదాలో ఉండి రాజ‌కీయ పార్టీల నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం వంటి ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. అయితే, ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చిన స‌మ‌యంలోనూ ఆయ‌న తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ప్ర‌భుత్వ ఉద్యోగిని అనే విష‌యం మ‌రిచి కార్య‌క‌ర్త‌లా మారి వైసీపీ అభ్య‌ర్థుల‌కు ఓటు వేయాల‌ని ప్ర‌చారం సైతం చేశాడు. గ‌త నెల 31న ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేలు, మైద‌కూరు, ప్రొద్దుటూరు, క‌డ‌ప ఆర్టీసీ డీపోల్లో ప్ర‌జా రావాణా శాఖ (పీటీడీ) వైఎస్ ఆర్ జిల్లా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు చ‌ల్లా చంద్ర‌య్య‌, మ‌రికొంద‌రితో క‌లిసి వైసీపీ అభ్య‌ర్థుల‌కు ఓటు వేయాల‌ని  క‌ర‌ప‌త్రాలు పంచారు. ఈ దృశ్యాలు మీడియాలో వచ్చాయి. దీంతో  తెలుగుదేశం నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు.  ఈసీ స్పందించింది. చ‌ల్లా చంద్ర‌య్య‌తో పాటు 10 మందిని వెంట‌నే స‌స్పెండ్  చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. మ‌రోవైపు వెంక‌ట్రామిరెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైఎస్ఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ , ఎన్నిక‌ల అధికారి కూడా   ప్ర‌భుత్వానికి సిఫార్సు చేశారు.  దీంతో ప్ర‌భుత్వం స్పందించి వెంక‌ట్రామిరెడ్డిని స‌స్పెండ్ చేసింది. వైసీపీ హ‌యాంలో ప్ర‌భుత్వ అధికారి హోదాలో ఉండి ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేసిన వెంక‌ట్రామిరెడ్డి.. ఎన్నిక‌ల కోడ్ లోనూ వైసీపీ కార్య‌క‌ర్త‌గానే వ్య‌వ‌రిస్తుండ‌టంతో ఈసీ కొర‌డా ఝుళిపించింది.  ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సేవలో తరిస్తున్న మరికొందరు ఉన్నతాధికారులపైనా వేటుకు ఈసీ రంగం సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం దాదాపు ఖాయ‌మ‌నే  భావన అధికార వ‌ర్గాల్లో వ్యక్తమౌతోంది. ఇప్ప‌టికే సీఎస్‌, డీజీపీపై ఎన్నిక‌ల సంఘానికి ప‌లు ఫిర్యాదు వెళ్లాయి. వీరు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్నార‌ని, ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఫిర్యాదుల్లో పేర్కొన్నాయి. దీంతో డీజీపీ, సీఎస్, మ‌రికొంద‌రు అధికారుల‌పై అందిన ఫిర్యాదుల్లోని అంశాల‌పై సంబంధిత అధికారుల నుంచి వివ‌ర‌ణ తీసుకొని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించామ‌ని, ప్ర‌స్తుతం కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకునే నిర్ణ‌యం కోసం వేచిచూస్తున్నామ‌ని రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ చెప్పారు. దీంతో మ‌రో రెండుమూడు రోజుల్లో డీజీపీ, సీఎస్‌తో పాటు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న అధికారుల‌పై ఈసీ వేటువేసే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల‌కూ ఈసీ షాకిచ్చింది. వైసీపీ ప్ర‌భుత్వంలో 40 మందికిపైగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు ఉన్నారు. వీరిలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితోపాటు ప‌లువురు ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌తీనెలా ప్ర‌భుత్వ జీతం తీసుకుంటూ ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో ప‌లువురు ఈసీకి ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదుల‌ను ఈసీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందిస్తూ.. మంత్రుల‌తో స‌మానంగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల‌కు ఎన్నిక‌ల నియ‌మావ‌ళి వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. తాజా ప‌రిణామాల‌తో ఇక‌పై ఎవ‌రైనా ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు ఎన్నిక‌ల నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే వేటు వేసేందుకు ఈసీ సిద్ధ‌మైంది. ఈసీ నిర్ణ‌యంతో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి నోటికి తాళంప‌డిన‌ట్ల‌యింది. ఈసీ తాజా నిర్ణ‌యంతో స‌జ్జ‌ల ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది.  102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.   ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఓట్ల పండుగ తొలి దశ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ  పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు యువత, తొలిసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు. తొలి దశ పోలింగ్ ఆరంభానికి కొద్ది ముందు ప్రధాని  ఎన్నికలలో ప్రతి ఓటు ముఖ్యమైనదని పేర్కొన్నారు.  ఓటు హక్కు ఉన్నవారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటు వేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు. 

తొలి దశ ఎన్నికల పోలింగ్ షురూ!

ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది.  దేశ వ్యాప్తంగా  పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.   పటిష్ఠ భద్రత మధ్య ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తొలి దశ కోసం మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  18 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల సంఘం రంగంలోకి దించింది. తొలి దశలో  16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.  1,625 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ సాగుతుంది.      అలాగే అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో 92 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా నేడు పోలింగ్ కొనసాగుతోంది. తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్‌ సహా పలువురు పాప్యులర్ రాజకీయ నేతలు ఉన్నారు.  కాగా నేడు ఓటు వినియోగించుకోనున్న 16.63 కోట్ల మందిలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది మహిళలు, 11,371 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. 35.67 లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓట్లు వేయబోతున్నారు.   తమిళనాడు (39), రాజస్థాన్ (12), ఉత్తరప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయ (2) రాష్ట్రాల్లోని అన్ని స్థానాలకు తొలి దశలో భాగంగా నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. అండమాన్-నికోబార్ దీవులు (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1), లక్షద్వీప్ (1).. అసోం, మహారాష్ట్రలో 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్‌లో 2, త్రిపుర, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కో సీటుకు నేడు పోలింగ్ జరుగుతోంది.

పార్టీ పనులకే సజ్జల పరిమితం.. సలహాదారు పదవికి రాజీనామా?

జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే. అక్కడితో ఆగకుండా పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయన కనుసన్నలలోనే నడుస్తాయి. అంతేనా సీఎం జగన్ విదేశీ పర్యటనలలో ఉన్న సమయంలో ఆయనే డిఫాక్టో సీఎం కూడా.  అంతే కాదు ప్రభుత్వం నుంచి లక్షల్లో వేతనం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికార ప్రతినిథిగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తరఫునే కాదు, పార్టీ తరఫున మాట్లాడాలన్నా మీడియా ఎదుట సజ్జలే సాక్షాత్కరిస్తారు.  సజ్జల గారి అతి కారణంగా వైసీపీలోనే పలుమార్లు అసంతృప్తి వ్యక్తమైన సంగతి తెలిసిందే.   అటువంటి సజ్జల నోటికి తాళం వేసుకోమని ఎన్నికల సంఘం హుకుం జారీ చేసింది. కోర్టుల తీర్పులనే లెక్క చేయని వైసీపీ నేతలకు ఈసీ హుకుంలు ఒక లెక్కా అని తీసిపారేయలేం. కోడ్ అమలులో ఉంది కనుక ఈసీ వాక్కు ను తుచ తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి ఉంది.  వైసీపీ తరఫున రోజూ మీడియా ముందుకొచ్చే సజ్జల నోరుమూసుకోవలసిన పరిస్థితి వస్తే ఎలా?   ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందుతున్న 40 మంది ఏపీ సలహాదారులు కోడ్ పరిధిలోనికి వస్తారని ఈసీ పేర్కొంది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని ఇకపై అది కూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.   ఈ ఆదేశాలు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎలా తీసుకున్నారో కానీ సజ్జల మాత్రం ఇజ్జత్ కీ సవాల్ అన్నట్లుగా భావిస్తున్నారు. తనను నియంత్రించడానికి ఈసీ ఎవరు అన్న భావన వ్యక్తం చేస్తున్నారు. అవసరం అయితే ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేయడానికైనా రెడీ అంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల ప్రభ వెలుగుతోంది. సజ్జల నోటి వెంట ఒక మాట వచ్చిందంటే అది జగన్ నోటి వెంట వచ్చినట్లేనని పార్టీ వర్గాలు భావిస్తుంటాయి.   అలాంటి ఆయన ఇక మీడియాకు కనిపించకూడదు అంటే పార్టీ వాయిస్ వినిపింొచడం ఎలా? అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  దీంతో సజ్జల ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా యేసేయడానికి రెడీ అయిపోయారని  పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.   అదీ కాక ఇప్పుడు ఎలాగూ ఎన్నికల కోడ్ ఉంది. జగన్ కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. దీంతో ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన కార్యకలాపాలు కానీ, వ్యవహారాలు కానీ ఏవీ ఉండవు. అటువంటప్పుడు హోదా కోసం, వేతనం కోసం ముఖ్య సలహాదారుగా కొనసాగడం కంటే  పార్టీ నేతగా ఉండి వ్యవహారాలు చక్కబెట్టడమే బెటర్ అని సజ్జల భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే  కీలక స్థానాలను అస్మదీయులు, అనుకూలురతో నింపేశారు.  ఇప్పుడు ఇక అధికారులకు దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలు వారికి అర్ధమైపోయాయి. సో పార్టీ నేతగా  ప్రచార కార్యక్రమాలు, మీడియాతో సమన్వయం వంటి పనులు చూడటమే బెటర్ అన్న అభిప్రాయంతో సజ్జల ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

బీజేపీ, బీఆర్ఎస్ రహస్య ఒప్పందం.. రేవంత్ ఆరోపణలను నిజమేనా?

బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్, బీజేపీల రహస్య బంధం గురించిన ఆరోపణలు చేయడమే కాదు.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే లోక్ సభ ఎన్నికల అనంతరం బీజేపీ గూటికి చేరిపోతారనీ, తనతో పాటుగా తన వర్గానికి చెందిన ముప్ఫై మందిని తీసుకుని మరీ కమలం గూటికి చేరుతారని ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే ఒక అడుగు ముందుకు వేసి వంద మంది పైగా ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే బీజేపీ బీఆర్ఎస్ ను నానా ఇబ్బందులూ పెట్టిందనీ, ఇప్పుడు జస్ట్ 64 మంది ఎమ్మెల్యేలతో ఉన్న రేవంత్ సర్కార్ ను బీజేపీ బతకనీయదనీ అంటున్నారు.  అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన కౌంటర్ బీఆర్ఎస్ నే కాదు.. బీజేపీని ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేత అమిత్ షానే ఇరుకున పెట్టి డిఫెన్స్ లో పడేలా చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మద్యం కేసు నుంచి బయట పడేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారనీ, బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాలలో బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి దింపిందనీ ఆరోపించారు. అక్కడితో ఆగకుండా రెండు పార్టీల మధ్యా రహస్య ఒప్పందం లేకపోతే కేసీఆర్ కానీ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు భువనగిరి, చేవెళ్లు, జహీరాబాద్, మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గాలలో ఎందుకు ప్రచారం చేయలేదని సూటిగా ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికలలో బీజేపీకి బీఆర్ఎస్ సహకారం అందిస్తోందనడానికి  ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని నిలదీస్తున్నారు.    రేవంత్ ఆరోపణలు విమర్శలకు ఆశ్చర్యకరంగా అటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ గట్టిగా ఖండనలు రాలేదు.  రెండు పార్టీలూ కూడా అతి జాగ్రత్తకు పోయి రేవంత్ విమర్శలపై నోరెత్తకుండా ఉండటమే మేలని భావిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   దేశవ్యాప్తంగా 370 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో  ఉన్న బీజేపీ   తెలంగాణలో అధమ పక్షం పది స్థానాలలో విజయం సాధించాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. ఈ సమయంలో రేవంత్ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం విమర్శలు ఆ పార్టీని ఒకింత చిక్కుల్లో పడేసినట్లే కనిపిస్తోందంటున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌, మెదక్‌, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజ కవర్గాలలో బీఆర్ఎస్ బలహీనతలు బీజేపీకే కలిసివస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రేవంత్ విమర్శలపై స్పందించి పరిస్థితిని కంగాళీ చేసుకోవడం కంటే మౌనమే మేలన్న వ్యూహంతో బీజేపీ ఉందని అంటున్నారు. 

మీ మొహాలు మండ.. గవర్నర్ ఫోనూ ట్యాప్ చేశారా?

ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు. ఈ వేస్టుగాళ్ళు చేసిందే నీచ నికృష్టమైన పని. దాంట్లో కూడా పరిధులు దాటిపోయి ఎంత దారుణానికి దిగారనేది తెలుస్తుంటే రక్తం మరిగిపోతోంది. రాజకీయ కారణాలతో ప్రతిపక్షాల వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారయ్యా అంటే, సర్లే, ఇది కూడా రాజకీయంలో ఒక భాగం అని సరిపెట్టుకోవచ్చు. అలాగని ఇది నేరం కాకుండా పోదనుకోండి. అలా కాకుండా ఈ త్రాష్టులు ప్రతిపక్ష రాజకీయ నాయకులతో ఆగకుండా సొంత పార్టీ వారి ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. అక్కడతో ఆగారా... ఆగితే వీళ్ళు మనుషులెలా అవుతారు? సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు.. ముఖ్యంగా ఇంటి ఇల్లాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. అక్కడతో ఆగినా వీళ్ళను మనుషుల్లో వున్న పిశాచాలుగా భావించి క్షమించే అవకాశం వుండేది. ఈ నికృష్టులు మరింత అడ్వాన్స్ అయిపోయి సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి కాపురాల్లో నిప్పులు పోశారు. సమాజంలో ఉన్నత వర్గాల వారి ఫోన్లను ట్యాప్ చేసి, వాళ్ళ వ్యక్తిగత రహస్యాలను తెలుసుకుని, బ్లాక్ మెయిల్‌కి పాల్పడ్డారు.  ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లేటెస్ట్.గా బయటపడ్డ మరో ఘోరం ఇంకో ఎత్తు. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై ఫోన్‌ని కూడా ఈ బేవర్సోళ్ళు ట్యాప్ చేశారట. ఆ విషయాన్ని ఆమె తాజాగా బయటపెట్టారు. ఆమె గవర్నర్‌గా వున్న సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమాత్రం ప్రొటోకాల్‌ని పాటించకుండా ఆమెను అనేక అవమానాలకు గురిచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఇతర ముఖ్య నాయకులు తమిళిసైని ఎంతమాత్రం లెక్కచేయకుండా మాట్లాడేవాళ్ళు. తాచుపాము బుస కొట్టడం చూసి, వానపాము కూడా బుసకొట్టిందట. ఇదే తరహాలో బీఆర్ఎస్‌లోని గల్లీ లీడర్ల లాంటివాళ్ళు కూడా గవర్నర్‌కి వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఆ మహాతల్లికి ఓర్పు ఎక్కువ కాబట్టి వీళ్ళ తీరుమీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేయకుండా నెట్టుకొచ్చింది. అయితే 2022లోనే ఆమె తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఆ ఆరోపణలను ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఆ ఆరోపణలను విన్నవారు ఆమె రాజకీయ కోణాలతో ఇలాంటి ఆరోపణ చేసి వుండవచ్చని భావించారు. అయితే ఇటీవలి కాలంలో బయటపడ్డ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గమనించిన తమిళిసై మరోసారి తన ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు జరుగుతోంది కాబట్టి, తాను గతంలో చేసిన ఆరోపణలకు బలం చేకూరిందని ఆమె అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, సాక్షాత్తూ రాష్ట్రపతికి, రాజ్యాంగానికి ప్రతినిధి అయిన గవర్నర్ ఫోన్‌ని ట్యాప్ చేశారంటే, అలా చేసిన వాళ్ళని, అలా చేయడానికి ఆదేశాలు జారీ చేసిన వాళ్ళని పాత చెప్పుని పేడలో ముంచి కొట్టాలి. 

విజయోత్సవాన్ని తలపించిన లోకేష్ నామినేషన్ ర్యాలీ

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు. లోకేష్ నామినేషన్ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మిద్దెసెంటర్, వైష్ణవి కళ్యాణమండపం, పాతబస్టాండు మీదుగా సాగిన నామినేషన్ ర్యాలీ విజయోత్సవాన్ని తలపించిందని మంగళగిరి వాసులు చెబుతున్నారు.  ర్యాలీ సందర్భంగా  డిజె సౌండ్లు, డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో మంగళగిరి పట్టణం మోతెక్కిపోయింది. కాగా తండ్రి   మంగళగిరి తెలుగుదేశం సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బిజెపి సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో లోకేష్ తరఫున  2సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు ముందు మంగళగిరి శ్రీ సీతారామ ఆలయంలో నామినేషన్ పత్రాలతో కూటమి నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం బయట సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం భారీ ర్యాలీగా    మంగళగిరి మిద్దె సెంటర్, వైష్ణవి కల్యాణమండపం, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కూటమికి చెందిన ఎస్సీఎస్టీ, బీసీ మైనారిటీ నేతలు లోకేష్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు.  

తెలుగుదేశం కూటమి జోరు.. వైసీపీ బేజారు!

ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం (ఏప్రిల్ 18) కీలకఅంకం ప్రారంభం అయ్యింది.   ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది.  ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవ్వగా, ఆ క్షణం నుంచే  నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అయ్యింది.  సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఏపీలో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది.  గురువారం దశమి కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు.  25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలను ఏప్ిల్ 26,  ఉపసంహరణకు తుదిగడువు ఏప్రిల్ 29.  మే 13న పోలింగ్ ,  జూన్‌ 4వ తేదీన ఫలితాలు. ఇదంతా పక్కన పెడితే రాష్ట్రంలో నేటి నుంచి అన్ని రకాల ప్రీపోల్, పోస్ట్ పోల్ అంటే ఎగ్జిట్, ఒపినియన్ పోల్ లకు, సర్వేలకు ఈ రోజుతో చుక్క పడింది. అంటే ఫుల్ స్టాప్ పడింది. నే అన్ని రకాల సర్వేలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక నుంచి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించ కూడదు.  ప్రీ-పోల్‌ సర్వే కానీ, ఒపినియన్‌ పోల్‌ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించ కూడదు. జూన్‌ 1న మాత్రం ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. అంటే ఇప్పటి వరకూ వెలువడిన పది పదకొండు సర్వేలు మినహాయిస్తే ఇక నుంచి మళ్లీ జూన్ 1వ తేదీ అంటే సార్వత్రిక ఎన్నికల తుది దశ ముగిసే వరకూ ఎటువంటి సర్వేలూ వెలువడే అవకాశం లేదు.  ఇప్పటికే వెలువడిన సర్వేలన్నీ ఏపీలో ఎలక్షన్ వార్ వన్ సైడేనని తేల్చేయడం, తెలుగుదేశం కూటమి ఘన విజయం తథ్యమని పేర్కొన్న నేపథ్యంలో కూటమి ప్రచారంలో దూకుడు పెంచే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మరో వైపు వైసీపీ కూటమిలో గుబులు కనిపిస్తున్నది. జగన్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి బస్సు యాత్రకు జన స్పందన కరువు అవ్వడం, జగన్ వినా ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయగలిగే ప్రభావమంతమైన క్యాంపెయినర్లు లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. బొత్స, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి వంటి కీలక నేతలు సైతం తమ నియోజకవర్గంలో విజయం కోసమే చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉండటంతో పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ల కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాజాగా శిరోముండనం కేసులో ఆ పార్టీ మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు జైలు శిక్ష విధించడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది.  అలాగే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పిటిషన్ పై తీర్పు ఈ నెల 23న వెలువడ నుంది. ఒక వేళ అవినాష్ బెయిలు రద్దైతే వైసీపీకి కడపలో కూడా ఇబ్బందులు తప్పవు. అదే విధంగా జగన్ పై గులకరాయి దాడి సెంటిమెంట్ ను రగల్చడం సంగతి అటుంచి మొత్తంగా పార్టీ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా నవ్వుల పాలు చేసింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమికి దీటుగా వైసీపీ ప్రచారం జోరు పెంచే అవకాశాలు కనిపనించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మోడీ ఫస్ట్.. బీజేపీ నెక్ట్స్!

కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ... బీజేపీని మించి ఎదిగిపోయారా? పార్టీ కంటే ఆయనే ప్రధానం అనే స్థాయికి కమలం క్యాడర్ వచ్చేసిందా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔననే విశ్లేషణలే వస్తున్నాయి. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన  మేనిఫెస్టోను చూసిన ఎవరైనా మోడీ ఫస్ట్, బీజేపీ నెక్ట్స్ అన్నట్లుగానే కమలం పార్టీ పరిస్థితి మారిపోయిందన్న అభిప్రాయానికే వస్తారని అంటున్నారు.  మేనిఫెస్టోలో మోడీ గ్యారంటీలకే పెద్ద పీట వేశారు.   పదేళ్ల కాలంలో మోడీ సర్కార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను  కొనసాగిస్తామనీ,  జి.ఎస్‌.టి వంటి సంస్కరణలు, ఆర్టికల్‌ 370ని రద్దు  వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ప్రాథమిక సదుపాయాల కల్పనకు మోడీ ఇచ్చిన ఇచ్చిన ప్రాధాన్యత,   సమాజంలోని ప్రతి వర్గానికి తాము అందజేసిన లబ్ధి వంటి వాటిని మోడీ ఘనతలుగా మేనిఫెస్టోలో పేర్కొన్నారు.  మూడవసారి కూడా  మోడీ నేతృత్వంలోని ఎన్డీయే అ ధికారంలోకి రావ డం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు, మరో అయిదేళ్ల పాటుబియ్యం ఉచితంగా సరఫరా చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు బీజేపీ మేనిఫెస్టోలో ప్రముఖంగా పేర్కొన్నారు.   ఉమ్మడి పౌర స్మృతిని, ఒకే దేశం-ఒకే ఎన్నికలు తదితర అంశాలను అమలు చేస్తామనడమే కాకుండా, బులెట్‌ రైళ్లు,  వందే భారత్‌ రైళ్ల సంఖ్యను పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం, పేదలకు మూడు కోట్ల గృహాల నిర్మాణం, పైపుతో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా, మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు చేపట్టబోతున్నట్టు   ప్రకటించారు. ప్రధానంగా హిందుత్వ అజెండానే పొందుపరిచారు. దాదాపుగా బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా మోడీ గత పదేళ్లుగా తన వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకునేందుకు చేసిన ప్రకటనలు వాగ్దానాలే అనడంలో సందేహం లేదు. అయితే దేశంలో పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంపన్న, పేదల మధ్య పెరిగిన అంతరం, రైతుల ఆదాయం రెట్టింపు కావడం అటుంచి, వారి కష్టాలు మరింత పెరగడం వంటి అంశాల జోలికి బీజేపీ మేనిఫెస్టో పోలేదు. ఈ మేనిఫెస్టోలో ఆ దిశగా ఎటువంటి వాగ్దానాలూ లేవనే చెప్పాలి.  ఉద్యోగాలను సృష్టిం, రైతుల ఆదాయం రెట్టింపు వంటి గత వాగ్దానాల గురించిన ప్రస్తావనే లేదు.  దీంతో బీజేపీ పార్టీగా కంటే మోడీని మరింత ఫోకస్ లోకి తీసుకురావడం మీదనే ఎక్కువ దృష్టిపెట్టినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జనసేనకు జబర్దస్త్ ప్రచారం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ సారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకింత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతితక్కువ మంది మాత్రమే తమ మద్దతు ఎటువైపు అన్నది చెబుతున్నారు. జగన్ హయాంలో తెలుగు సినీ పరిశ్రమ నిస్సందేహంగా ఎన్నో ఇబ్బందులకు గురైంది. సినిమా టికెట్ల ధరల విషయంలో కానీ, సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలకు అనుమతుల విషయంలో కానీ జగన్ సర్కార్ ఇండస్ట్రీని ఇబ్బందులకు గురి చేసింది. జగన్ కు మొదటి నుంచీ కూడా సినీ పరిశ్రమలోని పలువురు పెద్దలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న భావన ఉంది. తాను సీఎం అయిన సందర్భంలో సినీ పరిశ్రమ పెద్దలు ఎవరూ తనను అభినందించలేదన్న కోపం కూడా మనసులో పెట్టుకున్నారని సినీ వర్గాల సమాచారం. ఆ కారణంగానే పరిశ్రమ పెద్దలను తన గెప్పెట్లో ఉంచుకోవాన్న ఉద్దేశంతోనే సినిమా టికెట్ల ధరల నియంత్రణ పేరుతో రాష్ట్రంలో పెద్ద సినిమాలు  ఒకటి రెండు రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టుకునే విధానానికి ఆయన కళ్లెం వేసినట్లు కనిపిస్తున్నారు. అలాగే కొత్త సినిమాల బెనిఫిట్ షోలకు కూడా కళ్లెం వేయడంతో పరిశ్రమ పెద్దలు ఆయన వద్దకు వెళ్లి మరీ అభ్యర్థించిన సంగతి తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి నెయ్యం కోరుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరినా ఫలితం లేకపోయిన సంగతి తెలిసిందే.  అయితే జగన్ సర్కార్ విషయంలో సినీ పరిశ్రమలోని పెద్దలు ఆర్థిక నష్టాల భయంతో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాల విషయంలో ఒకరిద్దరు వినా మొత్తం పరిశ్రమ సైలెంటైపోయిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   ఈ నేపథ్యంలో జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న కొందరు నటులు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ప్రచారం చేయడానికి ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.     జబర్దస్త్ నటులు రాంప్రసాద్, గెటప్ శీను అనకాపల్లి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అనకాపల్లి రూరల్ మండలంలోని బీఆర్టీ కాలనీలో వీరు ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. వీరి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.  

తొలి విడతలో.. బీజేపీ, కాంగ్రెస్ కూటములు నువ్వా నేనా!

దేశంలో వేసవిని మించి పొలిటికల్ హీట్ ఉంది. దేశంలో ఏడు విడతల్లో సాగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. తొలివిడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు లోని మొత్తం 39 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.   అసోం, అరుణాచల్ ప్రదేశ్ లో రెండేసి స్థానాలకు, చత్తీస్ గఢ్ లో ఒక స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. మధ్యప్రదేశ్ లో ఆరు, మహారాష్ట్రలో ఐదు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. వీటితోపాటు బీహార్‌లో నాలుగు నియోజకవర్గాలకు మణిపూర్, మేఘాలయలో రెండు  , మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో ఒక్కో నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. అంతే కాదు రాజస్థాన్ లో 12 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది, ఉత్తరాఖండ్ లో ఐదు , పశ్చిమ బెంగాల్‌లో మూడు నియోజ కవర్గాలు పోలింగ్ జరుగుతుంది. వీటితోపాటు పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో కూడా తొలిదశలో భాగంగా కొన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. తమిళనాడులో  మొత్తం 39 నియోజవర్గాల్లో ఈనెల 19న ఒకేదఫా ఎన్నికలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు కావడం విశేషం. తమిళనాడు రాజకీయాలు ఈసారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సహజంగా తమిళనాట ఎప్పుడూ ఎన్నికల గోదాలో రెండు శిబిరాలే తలపడతాయి. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మూడు కూటములు బరిలో ఉన్నాయి. ఇందులో మొదటిది డీఎంకే, కాంగ్రెస్ కూటమి. డీఎంకే ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోని   కూటమిలో కూడా డీఎంకే కూడా భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకే సాయంతో తమిళనాడులో కొన్ని సీట్లు అయినా సునాయాసంగా గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంది. కాగా అన్నాడీఎంకేతో తాజాగా సినీ నటుడు విజయ్‌కాంత్ నాయకత్వంలోని డీఎండీకే జత కట్టింది. డీఎండీకే కు ఐదు సీట్లు ఇవ్వడానికి పళనిస్వామి అంగీకరించారు. అలాగే ఎస్డీపీఐ, పుదియ తమిళగం పార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు పళనిస్వామి. ఇదిలా ఉంటే మజ్లిస్ పార్టీతో అన్నా డీఎంకే తాజాగా పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తుతో ముస్లిం మైనారిటీలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని అన్నాడీఎంకే భావిస్తోంది. కాగా భారతీయ జనతా పార్టీ 19 స్థానాలకు పోటీ చేస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్బుమణి పట్టాళి మక్కళ్ మున్నేట్ర కజగం పది చోట్ల పోటీ చేస్తోంది. అలాగే పొత్తులో ఉన్న చిన్న పార్టీలకు కూడా ఒకటి రెండు చోప్పున బీజేపీ  సీట్లు  కేటాయించింది. తమిళనాడులో నిన్నమొన్నటివరకు బీజేపీకి పెద్దగా బలం కానీ, గుర్తింపు కానీ లేదు.  ఒకసారి డీఎంకేతో మరోసారి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటూ ఏదో ఉనికి మాత్రంగా రాష్ట్రంలో ఆ పార్టీ ఉండేది.  అయితే  తమిళనాడు బీజేపీ పగ్గాలు అన్నామలై చేపట్టిన తరువాత ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి అన్నామలై బరిలో నిలిచారు.తమిళనాడులో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం హోరెత్తించారు. దశాబ్దాల నాటి కచ్చతీవు దీవిని ప్రచారాస్త్రాంగా చేసుకున్నారు. మన భూభాగంలో భాగమైన కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసి తమిళుల ప్రయోజనాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపడ్డారు. తూత్తుకుడిలో భారీ సభ నిర్వహించి తమిళనాడుకు వరాలు ప్రకటించారు.  ఇక యూపీ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో అత్యధికంగా 80 లోక్‌సభ సీట్లున్నాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలంటే ముందుగా ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాల్సి ఉంటుంది. ఏప్రిల్ 19న ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి విడత ఎన్నికలు జరగనున్న జాబితాలో సహరన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్‌, బిజ్నూర్‌, నగీనా, రాంపూర్‌, పిల్‌భిత్ నియోజకవర్గాలున్నాయి. ఈ ఎనిమిదిలో ముజఫర్‌నగర్, కైరానా, పిల్‌భిత్..బీజేపీ సిట్టింగ్ సీట్లు.  ల్‌భిత్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి ఈసారి టికెట్ ఇవ్వలేదు. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న జితిన ప్రసాద్‌కు పిల్‌భిత్ టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సత్తా చూపగల ఉప ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇటీవల జయంత్ చౌధురి నాయకత్వంలోని  రాష్ట్రీయ లోక్‌దళ్ తో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. రాష్ట్రీయ లోక్‌దళ్ కు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో గట్టి పట్టుంది. అంతేకాదు ఆర్ఎల్‌డీ మద్దతుతో జాట్ సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని బీజేపీ ఆశిస్తోంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని మరో ఉప ప్రాంతీయ పార్టీ భారతీయ సమాజ్‌ పార్టీతోనూ కమలం పార్టీకి పొత్తు ఉంది. సుహేల్‌దేవ్ నాయకత్వంలోని భారతీయ సమాజ్ పార్టీ …పూర్వాంచల్ ప్రాంతంలో బలంగా ఉంది. దీంతో పూర్వాంచల్ ప్రాంతం ఓట్లు తమ ఖాతాలోనే పడతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80స్థానాలనూ గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయోధ్యలో రామ జన్మభూమి మందిరం నిర్మాణం, బాల రాముడి ప్రతిష్టతో ప్రజల్లో పెరిగిన సెంటిమెంట్ ను ఓట్లుగా మరల్చుకోవాలనే లక్ష్యంతో మందుకు సాగుతోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ ఓట్లు రాలుస్తుందని భరోసాతో ఉన్నారు కమలనాథులు. కాగా కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌కు 17 సీట్లు కేటాయించింది సమాజ్‌వాదీ పార్టీ. మిగతా 63 సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ సహా ఇండియా కూటమిలోని మిగతా భాగస్వామ్యపక్షాలు పోటీ చేస్తున్నాయి. ఇక బీహార్ విషయానికి వస్తే..  బీహార్లో మొత్తం 40 లోక్‌సభ సెగ్మెంట్లున్నాయి. కాగా ఏప్రిల్ 19న ఈ రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాలు ఔరంగాబాద్‌, నవాడా, గయ, జమూయ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈసారి బీహార్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికలు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. మారిన సమీకరణాల నేపథ్యంలో కొన్ని నెలలకిందటే  జేడీ యూ అధినేత నితీశ్‌ కుమార్ రాజకీయంగా యూ టర్న్ తీసుకున్నారు. ఇండియా కూటమి నుంచి వైదొలగారు. మళ్లీ ఎన్డీయే కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ అండతో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో సామాన్య ప్రజల్లో నితీశ్ కుమార్‌కు అవకాశవాది అనే ముద్ర పడింది. నితీశ్ కుమార్ పొలిటికల్‌గా యూ టర్న్ తీసుకున్న తీరు ఎన్డీయే కూటమికి మైనస్ పాయింట్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ బీహార్లో మెజారిటీ యాదవ సామాజికవర్గాన్ని రాష్ట్రీయ జనతాదళ్‌ వైపు మళ్లించడంలో తేజస్వి యాదవ్  సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. అలాగే ముస్లిం మైనారిటీలు కూడా మహాఘట్‌బంధన్‌కు అనుకూలంగా మారారని అంటున్నారు. బీజేపీ, నితీశ్‌ కుమార్ నాయకత్వంలోని జేడీ యూ ఒక కూటమిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ కూటమిలో మరికొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా జనతాదళ్‌ యునైటెడ్ పార్టీ 16 సీట్లలో బరిలో దిగుతోంది. కాగా బీహార్‌లో కాంగ్రెస్, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి.  ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే..ఈ రాష్ట్రంలో  48 లోక్ సభ స్థానాలున్నాయి.  ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆరు పార్టీలు ప్రస్తుతం రెండు కూటములుగా ఏర్పడ్డాయి.  ఒకవైపు ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని శివసేన , కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ , మరోవైపు భారతీయ జనతా పార్టీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గం, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ వర్గం ఉన్నాయి. మహారాష్ట్ర రాజకీయాలను శివసేన చాలాకాలం పాటు శాసించింది. శివసేన హవా బలంగా వీచినంత కాలం మహారాష్ట్రలో బీజేపీ స్వంతంగా పాగా వేయలేకపోయింది. అయితే శివసేనలో చీలిక..  శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలికల  నేపథ్యంలో  రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించింది.  ఇక రాజస్థాన్ విషయానికి వస్తే..  రాజస్థాన్‌లో మొత్తం 25 నియోజకవర్గాలున్నాయి. తొలి దశలో అల్వార్, భరత్ పూర్, బికనీర్, చురు, దౌసా, గంగానగర్, జైపూర్ అర్బన్‌, జైపూర్ రూరల్, ఝుంఝును, కరౌలి-ధోల్పూర్, నాగౌర్, సికార్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్ల కొకసారి రాష్ట్ర ప్రభుత్వం మారే ఆనవాయితీ ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఒక టర్మ్ అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. రాజుల కోటగా పేరున్న రాజస్థాన్‌ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి అడ్డాగా ఉంది.  2014, 2019 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్ సభ స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. సారి కూడా క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో కమలం పార్టీ ఉంది.  ఇక కాంగ్రెస్ విషయానికొస్తే రాజస్థాన్ లో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఈ పరాజయం నుంచి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో   ఈ ఎన్నికల్లో ఎలాగైనా బోణీ కొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.  మొత్తం మీద రాజస్థాన్‌పై కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదన్నది పరిశీలకుల విశ్లేషణ.

టి20 వరల్డ్ కప్ లోఓపెనర్ గా కింగ్ కోహ్లీ

విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ఫామ్ బ్రహ్మాండంగా ఉన్నప్పటకీ స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ పరుగులు ధారాళంగా చేస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న విమర్శలు సొంత జట్లు అభిమానుల నుంచే వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ లో స్ట్రైక్ రేట్ కారణంగానే బెంగళూరు ప్రదర్శన పేలవంగా ఉందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే కోహ్లీ వినా ఆ జట్టులో మిగిలిన బ్యాట్స్ మన్ ఎవరూ అంచనాల మేరకు రాణించకపోవడంతోనే కోహ్లీపై ఒత్తిడి పెరిగి స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంటోందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. మొత్తం మీద ఐపీఎల్ లో కోహ్లీ ప్రదర్శన ఈ ఏడాది జరగనున్న టి20 వరల్డ్ కప్ లో అతడి స్థానంపై పలు అనుమానాలు రేకెత్తించింది. అసలు కోహ్లీకి వరల్డ్ కప్ ఆడే చాన్స్ ఉంటుందా అన్న అనుమానాలు కూడా క్రికెట్ అభిమానుల్లో వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో జట్టు ఎంపికకు సమాయత్తమౌతున్న బీసీసీఐ, సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే టీ20 వరల్డ్ కప్ లో కింగ్ కోహ్లీ ఓపెనర్ గా ఆడతాడని సంకేతాలు ఇచ్చాయి. ఈ మేరకు ఇప్పటికే కోహ్లీకి సమాచారం ఇచ్చినట్లు క్రికెట్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది.  ఐపీఎల్ లో బేంగళూరు జట్టుకు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ ఆ జట్టుకు శుభారంభాన్ని అందించడమే కాకుండా మంచి స్కోర్లు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో ఒక సెంచరీ సాధించి ఐపీల్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీని స్కిప్పర్ రోహిత్ శర్మతో కలిసి ఓపెన్ చేయాల్సిందిగా బీసీసీఐ కోరింది. అందుకు కోహ్లీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.