Read more!

తెలంగాణలో ఎలక్షన్ టైమ్.. షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది.  హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం (ఫిబ్రవరి 9) ఎన్నికల షెడ్యుల్ ప్రకటించింది. 

ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 16న నోటిఫికేషన్, మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ జరగనుందని ఎన్నికల సంఘం పేర్కొంది. సయ్యద్ అస్సాన్ జాఫ్రి ఎమ్మెల్సీ పదవి కాలం త్వరలో ముగియనుండగా మహబూబ్​నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి పదవీకాలం 2023 మార్చి 29న ముగియనుంది.

ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకూ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాదే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు రెండు  ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు ఎనలేని ప్రాధాన్యత సంతరించుకున్నాయి.