ఏపీలో జడ్ స్కాలర్ డెవలప్ మెంట్ సెంటర్!

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా  సాగుతున్న ఆయన పర్యటన కు సానుకూల స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగానే నారా లోకేష్ క్లౌడ్ సెక్యూరిటీ సేవల్లో  దిగ్గజ సంస్థ అయిన  జడ్ స్కాలర్  సీఈవో జే చౌదరితో  నారా లోకేష్ భేటీ అయ్యారు. డేటా సిటీగా అవతరిస్తున్న విశాఖపట్నానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద క్లయింట్లు వస్తున్నారనీ, వారంతా ఏఐ క్లౌడ్ డేటా సెంటర్ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తారనీ పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో సైబర్ సెక్యూరిటీ కోసం జడ్ స్కాలర్ ఆధ్వర్యంలో ఆర్ & డి సెంటర్, డెవలప్ మెంట్ సెంటర్  ఏర్పాటుచేయాలని మంత్రి లోకేష్ జే చౌదరిని కోరారు.

దీనిపై స్పందించిన ఆయన తమ సంస్థ బెంగుళూరులో మేజర్ ఇంజనీరింగ్ & ఇన్నోవేషన్ సెంటర్, కోర్ ప్లాట్ ఫాం డెవలప్ మెంట్ సెంటర్ నిర్వహిస్తోందనీ,  భారతీయ గ్లోబల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్లు, , టెలికం ప్రొవైడర్లతో కలిసి భాగస్వామ్యాలను విస్తరిస్తున్నామనీ చెప్పారు. సురక్షితమైన డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కోసం అగ్రశ్రేణి భారతీయ బ్యాంకులు, ఐటీ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సేవలు అందిస్తున్నామని చెప్పడమే కాకుండా నారా లోకేష్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు. సంస్థ సహచర బృందంతో చర్చించి సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu