టీడీపీ పార్టీ ఆఫీసులో సీఎం జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్ .. 

నిన్న ఏపీ సీఎం జగన్ బర్త్ డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అటు పార్టీ ముఖ్య నేతల నుండి ఇటు గల్లీ నేతల వరకు అట్టహాసంగా ఈ వేడుకలను నిర్వహించారు. అయితే నిన్న నెల్లూరు టీడీపీ ఆఫీసులో కూడా సీఎం జగన్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. అదేంటి జగన్ బర్త్ డేను టీడీపీ ఆఫీసులో నిర్వహించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..?. ఇసుకతో తయారు చేసిన కేక్ ను కట్ చేసి వినూత్న రీతిలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌కు మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ వారు ప్రార్థనలు చేశారు. అంతేకాకుండా సీఎం జగన్ జన్మదిన వేడుకలు వైసీపీ శ్రేణులు ఎందుకు చేస్తున్నాయో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రెండేళ్లలో ఏకంగా మూడు సార్లు ఇసుక విధానాన్ని మార్చారని ఆరోపించారు. ప్రతీసారి వెయ్యి రూపాయలు పెంచుతూ పోతున్నారని, ప్రస్తుతం యూనిట్ ఇసుక ధర రూ. 6500 కు చేరిందన్నారు. ఒకపక్క మండుతున్న పెట్రోల్, డీజిల్‌ రేట్లతో సమానంగా ఇసుక రేటు కూడా పెరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో సరైన ఇసుక విధానం లేకపోవడం వల్ల ఏపీలో దీనిపై ఆధారపడిన కోటి మంది ఉపాధి కోల్పోయారని వారు విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu