కప్పు లక్కును ఈసారైనా మార్చగలదా?
posted on Nov 1, 2025 12:47PM

విమెన్స్ వన్డే వరల్డ్ కప్ -2025 విన్నర్స్ జట్టుకు భారీ ప్రైజ్ మనీ దక్కనుంది. మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ విజేతగా నిలిచిన జట్టుకు 39.7 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది. అదే రన్నరప్ గా నిలిచిన జట్టుకు 19.8 కోట్లు దక్కుతాయి. ఈ వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ సారి టోర్నీలో ఏ జట్టు విజేతగా నిలిచినా ఆ జట్టుకు ఇదే తొలి వరల్డ్ కప్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సారి విశ్వవిజేతగా నిలవనున్న జట్టే ఏదన్న ఉత్కంఠ నెలకొంది. విమెన్స్ వరల్డ్ కప్ టోర్నీని ఇంత వరకూ ఏడు సార్లు ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఇంగ్లాండ్ కూడా టెటిల్ విన్నర్ గా గతంలో నిలిచింది. ఈ సారి ఆ రెండు జట్లూ కూడా సెమీస్ తోనే టోర్నీ నుంచి వైదొలిగాయి.
సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ పై అద్భుతమైన విజయాన్ని సాధించి సగర్వంగా ఫైనల్స్ లో అడుగు పెట్టింది టీమిండియా. ఈ మ్యాచ్ లో జెమీ మారోడ్రిగ్స్ రికార్డు సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సూపర్భ్ ఆఫ్ సెంచురీతో రాణించింది. దీంతో గత కొన్నేళ్లుగా అజేయంగా ఉన్న ఆస్ట్రేలియాను మట్టి కరిపించి మరీ ఫైనల్ లోకి అడుగుపెట్టింది టీమ్ ఇండియా.
భారత్- దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం(నవంబర్ 2) ఫైనల్స్ జరగనుంది. ఈ మ్యాచ్ కు వేదిక సెమీస్ జరిగిన నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం కావడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. సెమీస్ చూపిన జోరును ఫైనల్స్ లోనూ మన విమెన్ క్రికెటర్లు కొనసాగించాలని యావత్ భారత్ కోరుకుంటోంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం (నవంబర్ 2) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఎలా ఫెర్ఫార్మ్ చేస్తుంది అన్న చర్చ కూడా క్రికెట్ అభిమానుల్లో జోరుగా సాగుతోంది.
బిగ్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లలో చతికిల పడటం దక్షిణాఫ్రికా కు అలవాటేననీ, ఈ సారైనా ఆ ఒరవడిని దక్షిణాఫ్రికా మహాళల క్రికెట్ జట్టు ఫుల్ స్టాప్ పెడుతుందా అన్న డిబేట్ క్రికెట్ అభిమానుల్లో జరుగుతోంది.
మరో వైపు భారత విమెన్స్ టీమ్ కూడా ఇప్పటి వరకూ మూడు సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరినా కప్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే క్రికెట్ లో ఆ జట్టును అది మహిళల జట్టైనా, పురుషుల జట్టైనా మోస్ట్ అన్ లక్కీయెస్ట్ జట్టుగా చెబుతుంటారు. దీంతో ప్రస్తుత 2025 విమెన్స్ వరల్డ్ కప్ లోనైనా ఈ జట్టును అదృష్టం వరిస్తుందా అన్న చర్చ నడుస్తోంది. అలాగే గతంలో ఫైనల్ లో చతికిలబడినట్లుగా కాకుండా టీమ్ ఇండియా విమెన్స్ జట్టు ఈసారి విజేతగా నిలవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందనేది లేలాలంటే.. ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.