భార్య పీక కోసి.. రక్తం పూసుకొని.. శవంతో సెల్ఫీ..
posted on May 8, 2021 5:10PM
చూడ ముచ్చటైన జంట. హరి వెడ్స్ మంజుల. పెళ్లి సమయంలో ఆ జంటను చూసి అంతా భలే ఉన్నారే అని సంబర పడ్డారు. ఆ నవ దంపతులు సైతం ఆనందంగా తమ దాంపత్య జీవితాన్ని స్టార్ట్ చేశారు. మొత్తం ఏడు నెలల దాంపత్య జీవితం. త్రీ మంత్స్ హ్యాపీ. దెన్ స్టార్టెడ్ ట్రబుల్స్. ఎవరి దిష్టి తగిలిందో ఏమో.. వారి కాపురంలో కల్లోలం మొదలైంది. హరిలో అనుమాన బీజం నాటుకుంది. అది మొక్కై.. మహా వృక్షమై.. అతన్ని నిలువెల్లా ఆక్రమించేసింది. ఇక అంతే, భార్యపై అనుమానంతో మొగుడు కాస్తా యముడిగా మారాడు.
కడప జిల్లా బద్వేల్కు చెందిన హరి, తన భార్య మంజుల వేరే ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ రగిలిపోయాడు. వాడెవడో తెలీదు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోందనే డౌట్. ఎవరితోనో ఛాటింగ్ చేస్తోందని సందేహం. నిజంగా ఆమెకు ఎవరితోనో సంబంధం ఉందనడానికి ఎలాంటి సాక్షమూ లేదు. ఉన్నదల్లా.. అనుమానం ఒక్కటే. అదొక్కటి చాలదా? మనిషిని మృగంగా మార్చేయడానికి. హరి విషయంలోనూ అదే జరిగింది. అనుమానంతో.. భార్యపై అక్రమ సంబందం నెపం మోపి.. అమానుషంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ప్రతీ రోజూ భార్యకు టార్చరే. మొగుడు చేతిలో చిత్రహింసలే. ఇలా, కొన్ని నెలలుగా వారి ఇంట్లో గొడవలే గొడవలు.
రోజూ మాదిరే శుక్రవారం రాత్రి కూడా ఆ భార్యాభర్తలు పెద్దగా గొడవపడ్డారు. కొంతసేపటికి నిద్ర పోయారు. తెల్లారేసరికి ఆమె శవమై పడుంది. భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది. భార్యపై ఎప్పటి నుంచో అనుమానంతో కోపం పెంచుకున్న హరి.. ఆ రోజు తెల్లవారు జామున భార్యపై దారుణానికి పాల్పడ్డాడు. కాలయముడిగా మారాడు. గాఢనిద్రలో ఉన్న భార్యను కత్తితో పీకకోసి చంపేశాడు. తీవ్ర రక్తస్రావంతో మంజుల అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
భార్యను పీక కోసి చంపింనా శాంతించలేదు ఆ శాడిస్టు మొగుడు. భార్య రక్తాన్ని ఒంటికి పూసుకొని ఉన్మాదిగా ప్రవర్తించాడు. రక్తపు మడుగులో పడున్న భార్య డెడ్బాడీతో సెల్ఫీ తీసుకుని.. పైశాచిక ఆనందం పొందాడు. వాడు మనిషా? మృగమా?
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హరిని అదుపులోకి తీసుకొని.. అతనిపై కేసు నమోదు చేశారు. హరిని కఠినంగా శిక్షించాలని మంజుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.