1 నుంచి విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం

posted on: May 5, 2026 1:02PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కల సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే ఎస్సీఓర్  జోన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం   గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్‌  పేర్కొంది.

దీంతో, ఇండియన్  రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ జోన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కొత్త జోన్ పరిధిలోకి ప్రస్తుతం ఉన్న గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు వస్తాయి. అదేవిధంగా, ప్రస్తుత వాల్తేరు డివిజన్‌ను విభజించి, దానిలోని కొంత భాగాన్ని విశాఖపట్నం డివిజన్‌గా ఏర్పాటు చేసి కొత్త జోన్‌లో కలుపుతారు. మిగిలిన భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేసి, దానిని ఈస్ట్ కోస్ట్ రైల్వే  పరిధిలో ఉంచుతారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...