జెండా ఆవిష్కరణ వేళ విషాదం.. విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి
posted on Aug 15, 2022 3:50PM
దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేళ విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో జెండా ఎగురేసేందుకు ప్రయత్నిస్తూ విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
అనీల్ కుమార్ గౌడ్ (40), తిరుపతి (42) లు సాతంత్ర్య దినోత్సవ వేళ పతాకావిష్కరణ చేస్తున్నారు. అయితే జెండా కర్ర పైనున్ విద్యుత్ వైర్లకు తాకింది. ఈ విషయం గమనించని ఇరువురూ పతావిష్కరణకు ప్రయత్నించారు.
దీంతో ఇరువురికీ కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో అనిల్ కుమార్ గౌడ్, తిరుపతి అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి ధనుంజ్ గాయపడ్డారు. గాయపడిన ధనుంజయ్ ను ఆసుపత్రికి తరలించారు. పంద్రాగస్టు వేడుకలో జరిగిన ఈ దుర్ఘటనతో అంతటా విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.