విజయసాయి వ‌ర్సెస్‌ రఘురామ.. ట్విట‌ర్ ఫైట్‌.. ర‌చ్చ రంబోలా...

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఉన్న‌ట్టుండి నిద్ర లేచారు. త‌మ పార్టీకే చెందిన రెబెల్ ఎంపీ ర‌ఘురామ‌పై ట్వీట్ ఫైట్‌కి దిగారు. ఈయ‌నేదో నిఖార్సైన లీడ‌ర్‌గా.. ఆయ‌న్ను ఏదో గిల్లాల‌ని చూశారు. గిల్లితే గిల్లించుకునే ర‌కం కాదుగా ర‌ఘురామా. అందుకే, లెక్క‌కు లెక్క స‌రి చేశారు. ట్వీట్‌కు ట్వీట్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. విజ‌య‌సాయి, ర‌ఘురామ‌ల మ‌ధ్య జ‌రిగిన ఆ ట్విట‌ర్ వార్‌.. ర‌చ్చ రంబోలాగా మారింది. 

మొద‌ట‌.. విజ‌య‌సాయినే మొద‌లుపెట్టారు. జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా!.. అంటూ ఏదేదో అన్నారు. పెయిడ్‌ మైక్‌.. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్‌మెంట్లు.. నీచపు జీవితం.. ప్రజలను తాకట్టు.. ఇలా ఏదేదో అనేశారు విజ‌య‌సాయి. ర‌ఘురామ ఊరుకుంటారా? స్ట్రాంగ్ రిటార్డ్ ఇచ్చారు. అవునా? ఏ1కు భారంగా ఉందనే కదా నన్ను కడతేర్చాలనుకున్నారు. పాపం వివేకానందరెడ్డిలా! మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది మిస్టర్‌ ఏ2..! అంటూ ర‌ఘురామ ఘాటు రిప్లై...

ఇక్క‌డితో ఆగ‌లేదు వారిద్ద‌రి ట్విట‌ర్ వార్‌. విజ‌య‌సాయి మ‌రింత రెచ్చిపోయారు.. ఎవ‌రి మెప్పు కోస‌మో విప్పుకు తిరుగున్నారు.. ప‌క్క‌వాళ్ల‌కు ప్రేమ‌బాణాలు.. ఢిల్లీలో కూర్చొని కాక‌మ్మ‌ క‌బుర్లు.. రాళ్ల‌తో కొడ‌తారు.. అంటూ సాయిరెడ్డి మ‌రింత రెచ్చగొట్టారు. అందుకు త‌గ్గ‌ట్టే ర‌ఘురామ సైతం రెచ్చిపోయారు. రాజ్య‌స‌భ రెన్యువ‌ల్‌.. ఏ1 చేతిలో త‌న్నులు తిన‌డం ఖాయం అంటూ ర‌ఘురామ విజ‌య‌సాయిరెడ్డికి ట్విట‌ర్‌లో టిట్ ఫ‌ర్ టాట్ ఇచ్చారు. వీరిద్ద‌రి డైలాగ్ వార్‌ మ‌ధ్య‌లో నెటిజ‌న్లూ ఎంట‌రై.. విజ‌య‌సాయికి మ‌రిన్ని వాత‌లు పెట్టారు.