విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తిరపతి సంక్షేమం సభ రద్దు

posted on: Jun 9, 2026 9:02AM

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సంభవించిన ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనాన్ని కలిగించింది ఈ దుర్ఘటనలో  9 మంది కార్మికులు   ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.   ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేసిన ప్రభుత్వం.. కార్మికుల మృతికి సంతాపం ప్రకటించింది. తిరుపతి వేదికగా మంగళవారం (జూన్ 9)న జరగాల్సిన కూటమి రెండేళ్ల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా సంక్షేమం పేరిట నిర్వహించతలపెట్టిన సభను రద్దు చేసింది.  

 విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు మరణించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   
ఇలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.  అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.  

కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలను ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ మంగళవారం (జూన్ 9)న పరామర్శించనున్నారు. వీరిరువురూ విశాఖ వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...