గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి

తెలంగాణలో బిజెపి కార్యాలయంపై కాంగ్రేస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ మంగళవారం బిజెపి శ్రేణులు గాంధీభవన్ వైపు దూసుకొచ్చాయి. ఈ శ్రేణులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ చార్జి చేశారు.  తెలంగాణాలో కాంగ్రెస్ బిజెపి మధ్య నువ్వా నేనా అన్నట్టు తయారయ్యింది.  బిజెపి కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనను బిజెపి ఖండించడమే గాక ర్యాలీ నిర్వహించింది. ముందే పసిగట్టిన ఇంటెలిజెన్స్, ఎస్ బి అప్రమత్తమై ప్రభుత్వానికి హెచ్చరిక  చేసింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని బిజెపి శ్రేణులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. బిజెపి కార్యకర్తలు గాంధీభవన్ వైపు రాళ్లు రువ్వడంతో వారిపై పోలీసులు లాఠీ చార్జి చేశారు 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu