డిసెంబర్7న బీజేపీలోకి తీన్మార్ మల్లన్న..

తెలంగాణలో సంచలనంగా నిలిచిన ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ రాజకీయంగా మరో ఇన్నింగ్స్ కు సిద్ధమయ్యారు.  కొంత కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన కమలం పార్టీలో చేరబోతున్నారు. డిసెంబర్ 7న  ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటున్నట్లు తీన్మార్ మల్లన్న ట్విట్టర్ ద్వారా తెలిపారు. బిజెపిలో చేరేందుకు అన్ని అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాయని. డిసెంబర్ 7వ తేదీన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు చెప్పారు. మోడీ సిద్ధాంతాలకు తాను ఆకర్షితునుడైనట్లు. ఈ నేపథ్యంలోనే బిజెపిలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు మల్లన్న. 

జ్యోతిష్యుడు లక్ష్మికాంత శర్మ కేసు పెట్టడంతో తీన్నార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత అతనిపై మొత్తం 37 కేసులు నమోద్యయాయి. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులు అరెస్ట్ చేశారు. 107 రోజుల జైలు జీవితం తర్వాత తీన్మార్ మల్లన్న జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే మల్లన్న జైలులో ఉన్న సమయంలో అతన్ని విడుదల చేసుకునేందుకు మల్లన్న భార్య చాలా ప్రయత్నాలు చేసింది.  బీజేపీ పెద్దలను కలిసి వినతి చేసుకుంది. పీఎం మోడీ, హోం మంత్రి అమిత్షాకు మెయిల్ ద్వారా ఓ విన్నపం విన్నవించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తన భర్త నిరంతరం పోరాడుతున్నారని అందులో పేర్కొన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ వచ్చిన ప్రతిసారి ఇష్టారీతిన సెక్షన్ల కింద కేసులు పెడుతూ జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారని వివరించారు.

ఈ ఏడాది జనవరిలో జరిగిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించారని వివరించారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండో ప్లేస్లో నిలిచారన్నారు. తన భర్త తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరాలనుకుంటున్నారని, మోడీ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేయాలనుకుంటు న్నారని తెలుపడం జరిగింది. అవసరమైతే బీజేపీ పార్టీలో చేరతామని, మా ఆయనకు బెయిల్ ఇప్పించాలని వేడుకుంది. దీంతో మల్లన్న బీజేపీ గూటిలో చేరడం ఖాయమని అనుకున్నారు. కానీ ఆయన తొందరపడలేదు. డిసెంబర్ 7న బీజేపీలో చేరుతున్నట్లు ఆదివారం ఉదయం ఆయన అధికారిక ట్విట్టర్లో ప్రకటించారు.