తమిళనాడులో కుంభవృష్టి..పోలింగ్‌కు తీవ్ర ఆటంకం..!

తమిళనాడులో భారీ వర్షం కురుస్తోంది. రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో పోలింగ్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వర్షం దెబ్బకు ఓటర్లు ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. 3 గంటలు కావోస్తున్నా చాలా ప్రాంతాల్లో 40 నుంచి 45 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. వర్షం కొనసాగితే, పోలింగ్ శాతం గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు పోలింగ్ సమయాన్ని పొడిగించాల్సిందిగా ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu