మహేశ్వరంలో షర్మిల పాదయాత్ర.. స్థానికులతో మాట-ముచ్చట..
posted on Oct 25, 2021 12:21PM
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల వడివడిగా అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘ లక్ష్యంతో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అచ్చం తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఆయనలానే చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించిన షర్మిల.. 6 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం ఆరవ రోజుకు చేరుకుంది. ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. సాయంత్రం లేమురు దగ్గర షర్మిల ‘మాట ముచ్చట’ కార్యక్రమం నిర్వహిస్తారు.
షర్మిల పాదయాత్రకు అన్ని వర్గాల ఉంచి మంచి మద్దతు లభిస్తోంది. అచ్చం తండ్రిలానే పేదలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటున్నారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. శ్రీలంకకు చెందిన వైఎస్ అభిమానులు షర్మిలను కలిసి పాదయాత్రకి మద్దతు తెలిపారు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారంటూ కొనియాడారు.