తెలంగాణలో ఆక్సిజన్ కొరత..ఎవరూ బయటికి రావొద్దన్న ఈటల

తెలంగాణలో ఆక్సిజన్‌ కొరత వాస్తవమేనని అంగీకరించారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. అయితే, ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో కంటే మరింత వేగంగా కరోనా విస్తరిస్తోందని.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

25 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరినట్టు ఈటల తెలిపారు. అభ్యర్థనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని.. కానీ హామీ మాత్రం ఇవ్వలేదన్నారు. తెలంగాణలో లాక్‌డౌన్ కానీ‌, కర్ఫ్యూ కానీ విధించే ఆస్కారం లేదని మంత్రి స్పష్టం చేశారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని కోరారు మంత్రి ఈటల.