ధైర్యం ఉంటే కేసీఆర్ చర్చకు రా.. ఓయూ

ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీసింది. విశ్వవిద్యాలయం భూములు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ పై అటు విపక్షాలు, ఇటు ఓయూ విద్యార్ధులు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓయూలో ధర్నా చేపట్టి కేసీఆర్ దిష్టి బోమ్మను కూడా తగలబెట్టారు. ఈ సందర్బంగా విద్యార్ధులు మాట్లాడుతూ పేదలపై కేసీఆర్ గారికి అంత ప్రేముంటే మైం హోం రామేశ్వర్రావుకు కట్టబెట్టిన 30 ఎకరాల భూమిలో ఇళ్లు కట్టించాలి అంతేకాని ఓయూ భూముల జోలికి వస్తే బావుండదని హెచ్చరించారు. విద్యార్ధులు నిరుద్యోగంతో బాధపడుతుంటే అవి మాత్రం పట్టించుకోకుండా పేదల పేరుతో భూములు విక్రయించడానికి కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు దమ్ము, దైర్యం ఉంటే కేసీఆర్ చర్చకు రావాలని ఓ సవాల్ కూడా విసిరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu