షాక్.. ఏపీ, తెలంగాణలకు విద్యుత్ సరఫరా నిలిపివేత!
posted on Feb 5, 2019 3:01PM
.jpg)
24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్న తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు త్వరలో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఫిబ్రవరి 9 నుంచి విద్యుత్ సరఫరాను నిలిపేయాలని ఎన్టీపీసీ భావిస్తోంది. దీనికి సంబంధించి ‘విద్యుత్ సరఫరా నియంత్రణ’ నోటీసులను ఎన్టీపీసీ ఆయా రాష్ట్రాలకు జారీ చేసింది. గత రెండు నెలల పైబడి బకాయిలు చెల్లించకపోవటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీపీసీ తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రూ.7,859కోట్ల బకాయిలు పెండింగ్లు ఉన్నాయని ఎన్టీపీసీ వెల్లడించింది. ఇందులో అగ్ర భాగం రూ. 4,890 కోట్లు బకాయిలు కేవలం ఈ మూడు రాష్ట్రాల నుంచే రావాల్సి ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్లు తెలిపారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.