Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇడుపు కాయితం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ను అడగండి : కవిత
posted on: Jun 28, 2026 3:59PM
.webp)
రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు.. అందుకే ఆ మౌనం...
తెలంగాణ సంస్కృతి, భాషపై కొందరు కావాలనే కుట్రలు పన్నుతున్నారని, ఉద్యమ వ్యతిరేకులే మళ్లీ తెరపైకి వస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని వారే నేడు తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.
ఇటీవల ఓ సినిమాకు ‘ఇడుపు కాయితం’ అనే పేరు పెట్టడంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్ను కవిత తీవ్రంగా ఖండించారు. తెలంగాణ యాస, భాషలపై అవగాహన లేని వారే ఇటువంటి విమర్శలు చేస్తున్నారన్నారు. ‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటో, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను అడగాలని ఆమె సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కూడా కవిత ఈ సందర్భంగా ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుత సీఎంకు తెలంగాణ మలిదశ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని, అందుకే రాష్ట్ర భాషను అవమానిస్తున్నా ఆయన మౌనంగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. పాలకులు స్పందించకపోవడం వల్లే విమర్శకులు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలైన నారాయణ, చైతన్య యాజమాన్యాల తీరును తప్పుబడుతూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యను కాస్తా వ్యాపారంగా మార్చేసి, గుంటనక్కల్లా ప్రవర్తిస్తున్న ఇలాంటి శక్తులకు బీఆర్ఎస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడబోదని స్పష్టం చేశారు. వారి ఒత్తిళ్లకు తాము లొంగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
తెలంగాణ యాస, భాషలను గతంలో సినిమా రంగంలో ఏ విధంగా హాస్యాస్పదంగా చూపించారో, ఇప్పుడు మళ్లీ అదే ధోరణిని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
భాష అనేది ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవమని, దానిని తక్కువ చేసి మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకోదని టీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణ సంస్కృతిని కాపాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
రానున్న రోజుల్లో ఈ భాషా వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపై రాజకీయ యుద్ధం మరింత తీవ్రతరం కానుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






