Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మెగా డీఎస్సీపై పిల్.. ఏపీ హైకోర్టు ఏమందంటే?
posted on: Aug 4, 2026 5:06PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించింది. ఈ పిల్ దాఖలు చేసినది వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి. పర్వతరెడ్డి చంద్రభేఖరరెడ్డి దాఖలు చేసిన పిల్ లో ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయనీ, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ) చేత విచారణ జరిపించాలని కోరారు.
అయితే.. హైకోర్టు ఈ పిల్ విచారణకు నిరాకరించింది. ఈ సందర్భంగా హైకోర్టు.. సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత అజెండాల కోసం వినియోగించడం తగదని హెచ్చరించింది. పిటిషనర్ పేర్కొంటున్న బాధితులు, అభ్యర్థులు నేరుగా కోర్టు ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది.
బాధితులు కోర్టుకు రావడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ వాదనతో హైకోర్టు విభేదించింది. మెగా డీఎస్సీ నియామకాలు, నోటిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే న్యాయస్థానంలో వందలాది పిటిషన్లు దాఖలైన అంశాన్ని గుర్తు చేసిన హైకోర్టు.. ఆధారాలు లేకుండా నియామక ప్రక్రియ మొత్తాన్ని సవాల్ చేయడం తగదని విస్పష్టంగా పేర్కొంది.
Mega DSC AP, AP High Court DSC Verdict, YCP PIL Mega DSC, AP Teacher Recruitment News, Parvathareddy Chandrasekhar Reddy PIL






