Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దాదా మృతి
posted on: Apr 3, 2026 10:38PM

మావోయిస్టు అగ్రనేత, పొలిట్బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దాదా కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. జార్ఖండ్లో జైలులో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటిన ఆయనను రాంచీలో రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (ఏప్రిల్ 3) మరణించారు. మరణించారని అధికారులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రశాంత్ బోస్, మావోయిస్టు ఉద్యమంలో అత్యంత ప్రభావమంతమైన నాయకులలో ఒకరు. కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరోలో కీలక సభ్యుడిగా ఉండటంతో పాటు, ఆ సంస్థ యొక్క తూర్పు ప్రాంతీయ బ్యూరో కార్యదర్శిగా కూడా పనిచేశారు.ప్రశాంత్ కిషోర్ కిషన్ దాదా, మనీష్, బుద్ధ పేర్లతో కూడా గుర్తింపు పొందారు.
2021 నవంబర్ 12న, సెరైకేలా-ఖర్సవాన్ జిల్లాలోని కంద్రా టోల్ బ్రిడ్జి సమీపంలో బోస్ను అతని భార్య షీలా మారండీతో పాటు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆయన తలపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. ప్రశాంత్ బోస్ జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో పలు ఘటనలో పాల్గొన్నారు. నాలుగు దశాబ్దాలుగా చురుకుగా ఉన్న ఆయన మావోయిస్టులకు కీలక వ్యూహకర్తగా, సిద్ధాంతకర్తగా ఉన్నారు. అరెస్టు అయినప్పటి నుంచి బోస్ జ్యూడీషియన్ కస్టడీలో ఉన్నారు.
మావోయిస్టు అగ్రనేతలు అయిన నంబాల కేశవరావు, చెరుకూరి రాజ్కుమార్, పటేల్ సుధాకర్ రెడ్డి తదితరులతో కలిసి పని చేసిన ప్రశాంత్ బోస్ పీపుల్స్ వార్. ఎంసిసి విలీనంలో కీలకపాత్ర పోషించారు. విభిన్న విప్లవ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రశాంత్ బోస్ మృతి మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. నాలుగు దశాబ్దాల పాటు అండర్గ్రౌండ్ రాజకీయాల్లో కొనసాగిన ఆయన జీవితం ఇప్పుడు ముగిసింది.






