పసిడి పట్టిన లక్ష్యసేన్
posted on Aug 8, 2022 5:58PM
బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్గేమ్స్లో సోమవారం భారత్ మరో స్వర్ణపతకం సాధించింది. భారత్ ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ పోటాపోటీగా జరిగిన ఫైనల్లో మలేషియా ప్లేయర్ జియాంగ్ పై విజయం సాధించాడు. భారత్ స్టార్ 21-10, 18-21, 21-16 తో అంతకుముందు సెమీస్ లో సింగపూర్ స్టార్ జియా హెంగ్ తే ను చిత్తు చేశాడు. భారత్కు బ్యాడ్మింటన్ లో ఇది రెండవ స్వర్ణపతకం. మొదట మహిళల సింగిల్స్లో పి.వి.సింధు స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ నిజానికి భారత్ప్లేయర్ల మధ్యనే పోటాపోటీగా జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ తన సెమీస్లో జి యాంగ్ చేతిలో ఓడి పోయాడు. ఇద్దరూ కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనడం ఇదే ప్రధమం.