కేసీఆర్ ను ఏడిపించిందెవరు?
posted on Jun 24, 2015 3:06PM

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏడుపు తన్నుకుంటూ వచ్చిందట.. కానీ ఏవరైనా చూస్తారేమో అని ఆపుకున్నారట.. ఈ విషయం ఎవరో కాదు కేసీఆరే స్వయంగా చెప్పారు. అంతలా కేసీఆర్ ని ఏడిపించిందెవరు అనుకుంటున్నారా.. వివరాల ప్రకారం... కేసీఆర్ గజ్వేల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారట. అయితే అక్కడ ఓ ఇద్దరు అమ్మాయిలు కేసీఆర్ దగ్గరకొచ్చి ‘సార్... మేము పదో తరగతి చదువుకుంటున్నాం. తర్వాత ఏమి చేయాలో తెలియడం లేదు. మేము అనాథలం. మాకు ఎవరూ లేరు సార్..’ అన్నారట.. అంతే ఆ మాటలకి కేసీఆర్ కు ఏడుపొచ్చిందంట కానీ కంట్రోల్ చేసుకున్నారట. దీంతో కేసీఆర్ పదో తరగతి తర్వాత అనాథ పిల్లలకు ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు తెరవాలని అధికారులకు సూచించారు. దీనిలో భాగంగానే మొదటి రెసిడెన్షియల్ స్కూల్ ను యాదగిరిగుట్టలో ప్రారంభించాలని, ఈ స్కూల్ శంకుస్థాపనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చెప్పారు.