ముఖేష్ అంబానీని బెదిరించింది నగలవ్యాపారి
posted on Aug 15, 2022 7:45PM
దేశంలో ఇటీవలికాలంలో ధనికులు, పారిశ్రామికవేత్తలకు బెదిరింపు కాల్స్ రావడం, బ్యాంకు దోపిడీలు జరగడం వింటున్నాం. తరచూ దేశంలో ఎక్కడో ఒక ప్రాంతంలో బ్యాంకు దోపిడీ జరుగుతూనే ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇటు వంటి సంఘటనలు ఎదుర్కొనడం ఇది రెండవసారి. గతేడాది ఫిబ్రవరిలో ముంబైలోని అంబానీ నివాసం సమీ పంలో పేలుడు పదార్థాలతో కూడిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్యూవీ) దొరికింది. అనంతరం పోలీసు అధికారులతో సహా కొందరిని అరెస్టు చేశారు. కాగా తాజాగా ఆయనను బెదిరించినవాడు నగల వ్యాపారి భౌమిక్గా గుర్తించారు.
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని దక్షిణ ముంబైకి చెందిన విష్ణు భౌమిక్ అనే నగల వ్యాపారిగా గుర్తించారు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని ఆసుపత్రికి ఫోన్ చేసి బెదిరించిన సౌత్ ముంబై నగల వ్యాపారి తప్పుడు గుర్తింపుతో మొత్తం ఎనిమిది సార్లు కాల్ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విష్ణు భౌమిక్ అనే అనుమానితుడు కాల్ చేస్తున్నప్పుడు అఫ్జల్ అని పేర్కొన్నాడు.
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం(ఆగస్ట్ 15 ) అనేక బెదిరింపు కాల్లు వచ్చాయి. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో రిలయన్స్ ఫౌండేషన్ వారి హర్స్కిసాందాస్ హాస్పిటల్ నంబర్కు కాల్స్ వచ్చాయి.
56 ఏళ్ల భౌమిక్ కూడా ఒకసారి బెదిరింపు కాల్స్లో ధీర్బుభాయ్ అంబానీ పేరును ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.
దహిసర్లో నివాసముంటున్న భౌమిక్ నేరచరిత్రను పోలీసులు ధృవీకరిస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 506(2) కింద నగల వ్యాపారిపై కేసు నమోదు చేశారు. కొన్ని కేంద్ర ఏజెన్సీలు కూడా ఈ కేసుకు సంబంధించిన వివరాలను కోరినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు ముఖేష్ అంబానీని బెదిరించి దుర్భాషలాడాడు. క్రిమినల్ బెదిరింపులు మరియు బెదిరింపులు జారీ చేసినందుకు సెక్షన్ 506(2) కింద అతన్ని అరెస్టు చేశారు" అని డిసిపి నీలోత్పాల్ మీడియాకి తెలిపారు. పోలీసులు ప్రస్తుతం నిందితు డిని విచారిస్తున్నారు, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.