రజనీ, బాలయ్యలకు ఇఫీ సన్మానం ఎప్పుడు? ఎక్కడో తెలుసా?

ప్రముఖ నటులు రజనీకాంత్, బాలకృష్ణలను ఇఫీ సన్మానించనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. త్వరలో  గోవా వేదికగా జరగనున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ వేడులలలో వీరిని సన్మానించనున్నట్లు కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన  ఈ ఇరువురీ చలనచిత్ర పరిశ్రమలో అర్ధశతాబ్ధ ప్రయాణం పూర్తి చేసుకున్నారన్నారు.

ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వీరిని సన్మానించనున్నట్లు తెలిపారు.  రజనీకాంత్, బాలకృష్ణ  50 ఏళ్ల సినీ ప్రస్థానం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైలు రాయిగా పేర్కొన్న ఆయన..  వారి అద్భుతమైన నటన, ప్రజాదరణతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారన్నారు. వారి కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో వారిని సన్మానించనున్నట్లు తెలిపారు.  ప్రతిష్ఠాత్మక ఇఫి వేడుకలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu