SRH నెట్ బౌలర్‌పై ఐసీసీ 8 ఏళ్ల బ్యాన్: హైదరాబాద్ క్రికెటర్ పతనం వెనుక అసలు నిజాలివే!

posted on: Aug 4, 2026 9:12AM

హైదరాబాద్‌ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం వరకు సాగిన ఒక యువకుడి ప్రయాణం ఎంతటి సంచలనమో, అంతే ఘోరమైన పతనంతో ముగిసింది. స్థానిక మైదానాల్లో ఆడుతూ, ఐపీఎల్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి నెట్ బౌలర్‌గా సేవలు అందిస్తూ, భారత డొమెస్టిక్ క్రికెట్‌లో తనకంటూ ఒక స్థానం కోసం అహర్నిశలు శ్రమించిన ఒక క్రికెటర్ కథ ఇది. అవకాశాలు రాలేదన్న బాధతో అమెరికాకు బాటపట్టి, అక్కడ యుఎస్ఏ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగిన 26 ఏళ్ల బోడుగుమ్ అఖిలేష్ రెడ్డి జీవితం ఒక్క తప్పుడు నిర్ణయంతో ఊహించని మలుపు తిరిగింది. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకుని, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి ఏకంగా 8 సంవత్సరాల కఠినమైన నిషేధాన్ని ఎదుర్కొంటూ, తన భవిష్యత్తును తానే చేతులారా నాశనం చేసుకున్నాడు.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అఖిలేష్ రెడ్డి విజయ్ హజారే ట్రోఫీ కోసం తెలంగాణ రాష్ట్ర జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నెట్ బౌలర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. అయితే, భారత దేశీయ క్రికెట్‌లో రెగ్యులర్ స్థానం దక్కకపోవడంతో, మెరుగైన భవిష్యత్తును వెతుక్కుంటూ యుఎస్ఏకి పయనమయ్యాడు. అక్కడి నార్త్ అమెరికా టి20 కప్‌లో కేమాన్ ఐలాండ్స్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అఖిలేష్, అమెరికా తరఫున 4 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 1 వికెట్ తీశాడు. అదనంగా మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక సామాన్య నెట్ బౌలర్ స్థాయి నుంచి అమెరికా జాతీయ క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టడం అనేది అతని కష్టానికి దక్కిన ప్రతిఫలంగా అందరూ భావించారు.

కానీ, 2025 యూఏఈలో జరిగిన అబుదాబి టి10 టోర్నమెంట్‌ అతని జీవితంలో ఊహించని విషాదాన్ని నింపింది. ఈ టోర్నమెంట్‌లో ఆస్పిన్ స్టాలియన్స్ జట్టు ఆడే తొలి మ్యాచ్‌ కంటే ముందు, నవంబర్ 19, 2025న అఖిలేష్ రెడ్డి ఒక ఘోరమైన తప్పుకు పూనుకున్నాడు. మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఉద్దేశంతో, తన జట్టులోని సహచర ఆటగాడైన 'ప్లేయర్ ఏ'ని సమీపించి, బౌలింగ్ చేసేటప్పుడు ధారాళంగా 'రన్లు ఇవ్వాలని' ప్రలోభపెట్టాడు. టీమ్ మేనేజ్‌మెంట్ సూచనల మేరకే ఇలా చేయాలని కోరినట్లు విచారణలో తేలింది. అయితే, ఆ సదరు ఆటగాడు అఖిలేష్ ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరించడమే కాకుండా, వెంటనే ఐసీసీ నిరోధక విభాగానికి సమాచారం అందించాడు. ఈ ఘటనతో ఆ ఆటగాడిని తుది 11 మంది సభ్యుల జట్టు నుంచి పక్కన పెట్టారు.

అంతేకాకుండా, విచారణ నుంచి తప్పించుకునేందుకు అఖిలేష్ రెడ్డి తన మొబైల్ ఫోన్ నుంచి వాట్సాప్ చాట్లు, కాల్ లాగ్‌లను పూర్తిగా తొలగించి ఆధారాలను తుడిచిపెట్టడానికి ప్రయత్నించాడు. అది కేవలం తన డేటా మేనేజ్‌మెంట్ అని అతను చెప్పుకొచ్చినప్పటికీ, ఐసీసీ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ దానిని తీవ్రమైన నేరంగా పరిగణించింది. ఈ విచారణ అనంతరం, ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్‌లోని 3 కీలక నిబంధనలను ఉల్లంఘించినందుకు అఖిలేష్‌ రెడ్డిని ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్ దోషిగా నిర్ధారించింది. నవంబర్ 21, 2025 నుంచి అమల్లోకి వచ్చేలా అతడిపై 8 ఏళ్ల సుదీర్ఘ నిషేధం విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

srh net bowler match fixing ban,akhilesh reddy icc 8 year ban,usa cricketer akhilesh reddy fixing.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...