భార్యను  కొండపై నుంచి తోసేసి భర్త.. 

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన మహిళలపై అనుమానాలు పెంచుకోవడం. మహిళను హత్యలు చేయడం. అత్యాచారాలు చేయడం. యాసిడ్ దాడులు. రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా కుటుంబ కలహల కారణంగా ఏకంగా కట్టుకున్న భార్యను హింసించి.. కొండపై నుంచి తోసేసి హత్యచేశాడో ప్రబుద్ధుడు. ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..  24 ఏళ్ల రాజేష్‌రాయ్‌ అనే యువకుడు సెల్స్‌మెన్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో అతడు, గతేడాది 29 ఏళ్ల బబిట అనే మహిళను అత్యాచారం చేశాడు.

దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే, బబిటా తనను వివాహం చేసుకుంటే.. ఫిర్యాదు వెనక్కు తీసుకుంటానని చెప్పింది. దీంతో, రాజేష్‌ రాయ్‌, బబిటను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులపాటు వీరి వివాహబంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాఫీగానే కొనసాగింది. కాగా, గత కొంత కాలంగా రాజేష్‌ రాయ్‌, బబిటను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. నరలోక బాధలు అని భార్యను పెట్టేవాడు. చిలికి చిలికి గొడవ పెద్దది అయినట్లు  భార్యభర్తల మధ్య గొడవలు రోజు రోజుకు ఎక్కువయ్యాయి. ఈక్రమంలో, భర్త పోరు పడలేక బబిట ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో గత నెల జూన్‌ 11న రాయ్‌ పుట్టింటికి వెళ్లి తన భార్యను తిరిగి తన ఇంటికి తీసుకువచ్చాడు. 

కొన్ని రోజుల తర్వాత బబిట ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వచ్చింది. దానితో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. రాజేష్‌రాయ్‌ను బబిట గురించి ప్రశ్ని‍స్తే.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో యువతి బంధువులు రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసుకు రంగంలోకి దిగారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. రాజేష్‌ రాయ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. దీంతో బబిటను నైనిటల్‌ కొండపై తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసినట్లు.. రాయ్‌ పోలీసుల విచారణంలో అంగీకరించాడు. కాగా, కొండ ప్రాంతంలో బాధిత మహిళ మృతదేహం కోసం గాలింపు కొనసాగిస్తున్నామని ఉత్తరాఖండ్‌ పోలీసులు తెలిపారు.  ఈ సంఘటన ఉత్తరాఖండ్‌ రాష్ట్రము లో ఉధామ్‌సింగ్‌ నగర్‌ జిల్లా చోటు చేసుకుంది.