వాజ్‌పేయి కలల రోడ్డుమార్గం.. సాకారంలో స‌మ‌స్య‌లేంటి?

posted on: Jun 9, 2026 6:23AM

భారత్- మయన్మార్- థాయిలాండ్ మధ్య.. రవాణా కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చే రెండు కీలక ప్రాజెక్టులు.. కలాడాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్- కేఎమ్ఎమ్టీటీపీ.  ఇక రెండోది.. ఇండియా, మయన్మార్, థాయిలాండ్ త్రైలాటరల్ హైవే- (IMT Highway). ఇప్పుడు 2027 లక్ష్యంతో ఫాస్ట్ ట్రాక్  మీదకు తిరిగి వచ్చాయి. ఇవి కేవలం రోడ్లు, నదీమార్గాలు, పోర్టులు మాత్రమే కాదు. భారతీయ ఈశాన్యానికి, ఆగ్నేయాసియాకు, భారత విదేశాంగ వ్యూహానికి, భద్రతా సమీకరణానికి కొత్త రూపరేకలు గీసే భౌగోళిక.. రాజకీయ పథాలు.

వాజ్‌పేయి  లుక్ ఈస్ట్  నుంచి  యాక్ట్ ఈస్ట్ వరకు ఒక‌ దృష్టి కోణంగా మారింది. రోడ్డు ద్వారా దక్షిణాసియా–ఆగ్నేయాసియా కలయిక, ఇండియా –మయన్మార్–థాయిలాండ్ త్రైలాటరల్ హైవే ఆలోచన.. 2002లో యాంగోన్‌లో జరిగిన త్రైపాక్షిక మంత్రివర్గ సమావేశంలో రూపుదిద్దుకుంది.  ఇది నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేపట్టిన లుక్ ఈస్ట్ పాలసీకి  చెందిన‌ భౌతిక రూపం. భారత్‌ ఈశాన్యాన్ని ఆగ్నేయాసియాతో నేరుగా కలపడం, ఆసియన్‌తో.. వాణిజ్య–రాజకీయ సంబంధాలను బలోపేతం చేయడం, చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడం వంటి లక్ష్యాలతో.. కలాడాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఆలోచన 2003 ప్రాంతంలో మొదలై, 2008లో ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం, ప్రోటోకాల్స్ రూపంలో అధికారికంగా స్థిరపడింది. 

ఇది వాజ్‌పేయి కాలంలో ప్రారంభమైన  లుక్ ఈస్ట్ దిశను, తరువాత మన్మోహన్ సింగ్, మోడీ కాలంలో యాక్ట్ ఈస్ట్ పాలసీగా విస్తరించిన దీర్ఘకాలిక వ్యూహంలో భాగం. వాజ్‌పేయి కాలంలో మొదలైన లుక్ ఈస్ట్ దృష్టి, ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ రూపంలో కలాడాన్–త్రైలాటరల్ హైవే ద్వారా భౌతిక వాస్తవంగా మారుతోంది. సంఘటనల కాలక్రమం ఒక సారి  ప‌రిశీలిస్తే.. డెడ్‌లైన్‌లు, ఆలస్యాలు, కొత్త లక్ష్యాలు ఎలాంటివో తెలుస్తాయి. కలాడాన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ (KMMTTP) 2003లో ప్రాథమిక ఆలోచన, ఫీజిబిలిటీ అధ్యయనాలు- RITES ద్వారా జ‌రిగిన‌వి. 2008లో ఇండియా–మయన్మార్ మధ్య ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం, ప్రోటోకాల్స్ సంతకం. ఇక 2010లో సిట్వే పోర్టు, పాలెట్వా జెట్టీ, నదీ డ్రెడ్జింగ్ పనులకు కాంట్రాక్టులు- Essar Projects, IWAI వంటి అంశాలు ఇందులో ఉన్న‌ట్టు క‌నిపిస్తాయి. 
 
ఫ‌స్ట్ టార్గెట్.. 2014 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక ర‌చించారు. తరువాత 2023కి వాయిదా వేశారు. 2017లో సిట్వే పోర్టు, పాలెట్వా IWT జెట్టీ నిర్మాణం పూర్తయి, మయన్మార్‌కు హస్తాంతరం చెందింది.  2023లో కోల్‌కతా నుంచి మొదటి కార్గో షిప్ సిట్వే పోర్టుకు చేరింది. సముద్ర, నదీ భాగాలు ఆపరేషనల్. 
2025–2026లో మిజోరాం సీఎం, కేంద్ర మంత్రి ప్రకటనలు చేశారు. పాలెట్వా–జోరిన్పుయి రోడ్డు 2027 నాటికి పూర్తికానుంది, 

ఇక ఇండియా–మయన్మార్–థాయిలాండ్ త్రైలాటరల్ హైవే విష‌యానికి వ‌స్తే.. 2001లో ఇండియా–మయన్మార్ ఫ్రెండ్‌షిప్ రోడ్.. మోరె–తాము–కలేమ్యో–కలేవా.. 160 కి.మీ. భాగం పూర్తి, 2001 ఫిబ్రవరి 13న ప్రారంభం వంటి ఘ‌ట‌న‌లు న‌మోద‌య్యాయి. 2002లో యాంగోన్‌లో త్రైపాక్షిక సమావేశం జ‌ర‌గ్గా.. 1,360 కి.మీ. త్రైలాటరల్ హైవే ఆలోచన అధికారిక రూపం దాల్చింది.
 
మొదటి లక్ష్యం.. 2015 నాటికి పూర్తి కావాల‌న్న‌ది  కాగా.. తరువాత ఇది 2019కి వాయిదా ప‌డింది. ఇప్పుడు 2027 కొత్త డెడ్‌లైన్ పెట్టారు. 2020–2023లో భారత భాగంలో సుమారు 70శాతం పనులు పూర్తయ్యాయని అధికారిక ప్రకటనలు విడుద‌ల‌య్యాయి. థాయిలాండ్ భాగం దాదాపు పూర్తయింది. 2021 తర్వాత  మయన్మార్ సైనిక తిరుగుబాటు జ‌ర‌గ్గా, అంతర్గత యుద్ధం కారణంగా మయన్మార్ భాగంలో పనులు   నిలిచిపోవడం వంటి ఘ‌ట‌న‌లు న‌మోద‌య్యాయి. లాడాన్–త్రైలాటరల్ హైవే రెండూ 2014–2015లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల‌కు.. ఇప్పుడు 2027- ఒక‌ కొత్త  టార్గెట్ గా మారింది. 

ప్రాజెక్టుల నిర్మాణం..  మార్గాలు, పొడవులు, సాంకేతిక రూపకల్పన.. వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తే.. కలాడాన్ మల్టీమోడల్ ప్రాజెక్ట్.. సముద్రం–నది–రోడ్డు త్రిముఖ మార్గం. మొత్తం కాన్సెప్ట్.. కోల్ కతా పోర్టు- మ‌య‌న్మ‌మార్ సిట్వే పోర్టు.. వ‌ర‌కూ సాగుతుంది. సముద్ర మార్గం, సుమారు 539 కి.మీ. కాగా.. చిన్ రాష్ట్రంలోని సిట్వే- పాలెట్వా వ‌ర‌కూ  సాగుతుంది. 
 
కలాడాన్ నదీ మార్గం, సుమారు 158–159 కి.మీ. కాగా.. పాలెట్వా- నుంచి మీజోరాం  స‌రిహ‌ద్దు జోరిన్పుయి  వ‌రకూ సుమారు 109 నుంచి 110 కి.మీ. మ‌య‌న్మార్ రోడ్డు భాగం వ‌ర‌కూ ఉంటుంది. జోరిన్పుయి- లావంగ్‌ట్లై-  ఐజాల్.. అదనపు రోడ్డు కనెక్టివిటీ, మిజోరాం అంతర్గత రోడ్డు–రైల్వే విస్తరణతో అనుసంధానం సైతం ఇందులో భాగ‌మే. 

సిట్వే పోర్టు, పాలెట్వా జెట్టీలు, నదీ డ్రెడ్జింగ్, పవర్ సదుపాయాలు ఇప్పటికే పూర్తి కాగా.. రోడ్డు భాగం ఎక్కువగా.. 2 లైన్, కొన్ని సెక్షన్లు 4 లైన్—భూభౌగోళిక పరిస్థితులు, అటవీ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల కారణంగా.. ఈ మార్గం ద్వారా సిలిగురి  చికెన్ నెక్ కారిడార్ మీద ఆధారాన్ని తగ్గించడం, ఈశాన్య భారత రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ సముద్ర–నదీ మార్గం కల్పించడం ప్రధాన లక్ష్యంగా మారింది.
 
ఇండియా–మయన్మార్–థాయిలాండ్ త్రైలాటరల్ హైవే విష‌యానికి వ‌స్తే.. మ‌ణిపూర్ లోని మోరెనుంచి థాయిలాండ్ లోని మే సోట్ వ‌ర‌కూ మొత్తం పొడవు సుమారు 1,360 కి.మీ.గా ఉంది. ప్రధాన మార్గం. భారత్ లోని మోరె- ఇంఫాల్- కోహిమా- గువాహటి- సిలిగురి- విస్త‌రించిన క‌నెక్టివిటీలో భాగంగా కోల్‌కతా వ‌ర‌కూ సాగుతాయి. 
ఇక మయన్మార్ లోని తాము- కలేవా- కలేమ్యో- మండలే- మైక్తిలా- నైపీడా- మియావడ్డీ వ‌ర‌కూ కొన‌సాగుతుండ‌గా.. థాయిలాండ్ లోని మే సోట్- సుఖోతాయ్- బ్యాంకాక్, తరువాత ఈస్ట్–వెస్ట్ ఎకనామిక్ కారిడార్ ద్వారా కంబోడియా, లావోస్, వియత్నాం వరకు విస్తరించేలా ఒక‌ ప‌థ‌క ర‌చ‌న‌. 

ఎక్కువ భాగం 4 లైన్ హైవే, కొన్ని సెక్షన్లు 2 లైన్ నుంచి 4 లైన్‌కు అప్‌గ్రేడ్ కావ‌డం వ‌ర‌కూ ఒక ఎత్తు. భారత భాగంలో 69 పాత బ్రిడ్జిల అప్‌గ్రేడ్, 200 కి.మీ. రోడ్డు నిర్మాణ బాధ్యతల‌ను తీసుకుంది  భారత్‌. థాయిలాండ్ భాగం దాదాపు పూర్తయింది. అయితే ప్రధాన బాటిల్ నెక్ అయిన మయన్మార్ భూభాగం విష‌యానికి వ‌స్తే.. అక్కడి అంతర్గత యుద్ధం, మిలీషియా నియంత్రణ, ఆర్థిక–రాజకీయ అస్థిరత వంటివి ప్ర‌భావం చూపుతున్నాయి.  కలాడాన్ సముద్ర–నదీ–రోడ్డు త్రిముఖ మార్గం  కాగా.. త్రైలాటరల్ హైవే భూభాగం మీద  ఈశాన్య భారత్–ఆగ్నేయాసియా నేర కనెక్టివిటీ.. ఇవ‌న్నీ  కలిపితే ఒకే వ్యూహాత్మక భావ‌జాలంగా తెలుస్తోంది. 

న్యాయపరమైన అంశాలు.. ఒప్పందాలు, ప్రోటోకాల్స్, భద్రతా హామీలు, ద్వైపాక్షిక–త్రైపాక్షిక ఒప్పందాల నిర్మాణం వంటి విష‌యానికి వ‌స్తే.. క‌ల‌డాన్ ప్రాజెక్ట్, 2008లో ఇండియా–మయన్మార్ మధ్య ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్, సంబంధిత ప్రోటోకాల్స్ వంటివి ఫిక్స్ అయ్యాయి. ప్రాజెక్టు నోడల్ మంత్రిత్వ శాఖ.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ కన్సల్టెంట్ ఐలాండ్ వాట‌ర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఇన్వాల్వ్ అయ్యాయి.

ఇక 2002 యాంగోన్ త్రైపాక్షిక సమావేశం—ఇండియా, మయన్మార్, థాయిలాండ్ మధ్య రవాణా లింకేజెస్‌పై మంత్రివర్గ స్థాయి ఒప్పందం జ‌రిగింది. తరువాతి కాలంలో ఆసియన్–ఇండియా కనెక్టివిటీ ప్రాజెక్టుల కోసం భారత్ 1 బిలియన్ డాల‌ర్ల రుణ స‌దుపాయ ప‌రిమితిగా మారింది.  

భద్రతా హామీల వంటివి ప‌రిశీలిస్తే.. మయన్మార్ భూభాగం భారత్‌ భద్రతకు వ్యతిరేకంగా కాదని తెలిసింది. ఇటీవలి సమావేశాల్లో మయన్మార్ ప్రభుత్వం, తన భూభాగాన్ని భారత్‌ భద్రతకు వ్యతిరేకంగా ఎవరూ ఉపయోగించుకోకుండా చూస్తామని హామీ ఇచ్చింది—ఇది కేవలం డిప్లొమాటిక్ స్టేట్‌మెంట్ కాదు. భారత ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న.. ఇన్సర్జెన్సీ, చైనా–పాకిస్తాన్–ఇతర నెట్‌వర్క్‌లను దృష్టిలో పెట్టుకుని కీలక ప్ర‌క‌ట‌న చేసింది. 

అయితే, గ్రౌండ్ రియాలిటీలో మయన్మార్‌లోని చిన్, రఖైన్, సాగాంగ్, కరెన్ ప్రాంతాల్లో వివిధ ఎథ్నిక్ మిలీషియా, రెబెల్ గ్రూపులు, జుంటా–విపక్ష మధ్య గృహయుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ హామీని అమలు చేయడం ఎంతవరకు సాధ్యమో అనేది పెద్ద ప్రశ్న. 

మయన్మార్ ఇచ్చిన భద్రతా హామీ, ప్రాజెక్టు పేపర్‌పై బలమైనది. కానీ, అంత‌ర్యుద్ధం మధ్య  టెర్రిటరీ కంట్రోల్ వాస్తవాలు దానిని సవాలు చేస్తున్నాయి. రాజకీయ, సామాజిక, మీడియా కోణాలు
భారత విదేశాంగ– భద్రతా వ్యూహం వంటి అంశాల ప‌రిశీల‌న చేస్తే.. చైనా ప్రభావానికి ప్రత్యామ్నాయ మార్గాలు క‌నిపిస్తాయి. 

ఇందులోని చైనా ఫ్యాక్ట‌ర్ ఎలాంటిదో చూస్తే.. మయన్మార్‌లో చైనా ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టి, ఎథ్నిక్ మిలీషియా గ్రూపులతో నేరుగా డీల్ చేసి తన ప్రాజెక్టులను రక్షించుకుంటోందని కొన్ని మీడియా క‌థ‌నాల సారం. కలాడాన్–త్రైలాటరల్ హైవే ద్వారా.. భారత్‌ కూడా  సాఫ్ట్ బ్యాలెన్సింగ్  చేస్తూ, ఈశాన్య భారత రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ సముద్ర–భూభాగ మార్గాలు కల్పించి, చైనా–బంగ్లాదేశ్ మీద ఆధారాన్ని తగ్గించాలనుకుంటోంది.  

ఇక బంగ్లాదేశ్ ట్రాన్సిట్ నిరాకరణ అంశానికొస్తే.. గతంలో భారత్‌, బంగ్లాదేశ్‌ను ఈశాన్య రాష్ట్రాలకు ట్రాన్సిట్ హక్కులు, చిట్టగాంగ్ పోర్టు యాక్సెస్ ఇవ్వమని కోరినా, బంగ్లాదేశ్ నిరాకరించింది. 
ఈ నేపథ్యంలో కలాడాన్ ప్రాజెక్టు ఒక  జియోపాలిటికల్ బైపాస్ గా అవ‌త‌రించింది. 

బంగ్లాదేశ్‌ను పక్కన పెట్టి, మయన్మార్ ద్వారా సముద్ర–నదీ మార్గం, మయన్మార్ అంతర్గత రాజకీయ సంక్షోభం.. ప్రాజెక్టులపై ప్రభావం, 2021 సైనిక తిరుగుబాటు తర్వాత మయన్మార్‌లో గృహయుద్ధం, ఎథ్నిక్ ఆర్మీలు, ప్రజాస్వామ్య శక్తులు, జుంటా మధ్య పోరాటం తీవ్రతరమైంది.
 
త్రైలాటరల్ హైవే మార్గంలోని కీలక సెక్షన్లు ఎలాంటివంటే, మండలే, మియావడ్డీ, చిన్–కరెన్ ప్రాంతాలు.. ఇప్పుడు వివిధ మిలీషియా, రెబెల్ గ్రూపుల నియంత్రణలో ఉండటం వల్ల.. నిర్మాణం, నిర్వహణ, భద్రత వంటివి సవాలుగా మారాయి. 

భారత్‌ ముందున్న ప్రశ్న ఏంటంటే..  జుంటాతోనే డీల్ చేయాలా? లేక చైనా మాదిరిగా ఎథ్నిక్ మిలీషియాలతో కూడా నేరుగా చర్చలు జరిపి ప్రాజెక్టులను రక్షించుకోవాలా? అన్న‌ది  తేలాల్సి ఉంది. 
 
ఒక సెక్ష‌నాఫ్ మీడియా, విదేశాంగ విశ్లేషకులు.. ఈ ప్రాజెక్టులను రియల్ గేమ్ చేంజర్,  ఈశాన్య భారత ఆర్థిక పునరుజ్జీవనానికి కీలక మార్గంగా అభివర్ణిస్తున్నారు. స‌రిగ్గా అదే సమయంలో, ఇతర కథనాలు భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన/విలువైన వ్యూహాత్మక ప్రాజెక్ట్ నిలిచిపోయింది వంటి  టైటిళ్ల‌తో హోరెత్తించాయి. ఇక‌ మయన్మార్ అంత‌ర్యుద్ధాల‌తో, కాంట్రాక్టర్ వైఫల్యాలు, న్యాయపరమైన వివాదాలు, ఆర్థిక ఆలస్యాలను మ‌రింత ఓపెన్ అప్ చేస్తున్నాయి. 

ప్రాజెక్టులు  గేమ్ చేంజర్ కావచ్చు. కానీ, ఇప్పటి వరకు అవి  డెడ్‌లైన్ చేంజర్ గానే ఎక్కువగా నిరూపించుకున్నాయి.  ఈశాన్య భారత రాష్ట్రాలపై ప్రభావం దూరం తగ్గింపు కావ‌చ్చు. కలాడాన్ ద్వారా ఐజాల్–కోల్‌కతా మధ్య దూరం సుమారు 700 కి.మీ. తగ్గుతుందని అంచనా. సిలిగురి చికెన్ నెక్  మీద ఆధారాన్ని తగ్గించడం, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ మార్గం కల్పించడం కీల‌కం. భౌగోళిక భద్రత, ఆర్థిక అభివృద్ధి రెండింటికీ ముఖ్య‌మే. 

ఇక వాణిజ్యం, లాజిస్టిక్స్ విష‌యానికి వ‌స్తే.. కార్గో ట్రాన్స్‌పోర్ట్ టైమ్, ఖర్చు తగ్గడం.. మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అసోం వంటి రాష్ట్రాలకు కొత్త మార్కెట్లు, పోర్టులు, పెట్టుబడులు రావ‌డం వంటివి కీల‌కంగా మారాయి. 

సామాజిక–సాంస్కృతిక కనెక్టివిటీ ఎలాంటిదంటే.. త్రైలాటరల్ హైవే ద్వారా పీపుల్- టు- పీపుల్ కనెక్టివిటీ, టూరిజం, విద్య, ఆరోగ్య సేవల మార్పిడి, బౌద్ధ–హిందూ సాంస్కృతిక మార్గాలు పునరుజ్జీవనం అవుతాయి. 

ఆసియన్–ఇండియా ఫ్రీ ట్రేడ్ ఏరియా, 2023లో సుమారు 100 బిలియన్ డాల‌ర్ల‌ ద్వైపాక్షిక వాణిజ్యం జ‌రిగింది. ఈ హైవే, కలాడాన్ ద్వారా మరింత విస్తరించే అవకాశం క‌నిపిస్తోంది. 3,200 కి.మీ. వరకు విస్తరించే థాయిలాండ్–కంబోడియా–వియత్నాంతో అనుసంధానం ద్వారా ఈస్ట్- వెస్ట్ ఎక‌నామిక్ కారిడార్ భారత్ నుంచి వియత్నాం వరకు ఒక‌ భూభాగ కనెక్టివిటీగా క‌నిపిస్తోంది.

ఇందులో గుర్తించాల్సిన అంశాలు ఎలాంటివంటే.. 2014, 2015, 2019, 2023.. ప్రతి డెడ్‌లైన్‌ను  దాదాపు పూర్తి అని చెప్పి, తరువాత వాయిదా వేయడం. ఇప్పుడు 2027 కొత్త లక్ష్యంగా పెట్టుకోవ‌డం. ఇది కేవలం మయన్మార్ అంత‌ర్యుద్ధం వల్ల మాత్రమే కాదు. భారతీయ కాంట్రాక్టర్ల‌ వైఫల్యాలు, అండర్ ఎస్టిమేషన్, కోఆర్డినేషన్ లోపాలు కూడా కారణ‌మే.
 
మయన్మార్- భారత్‌ భద్రతకు వ్యతిరేకంగా భూభాగం ఉపయోగించనివ్వం అని చెప్పినా, ఎథ్నిక్ మిలీషియా, రెబెల్ గ్రూపులు, చైనా ప్రభావం, డ్రగ్–ఆర్మ్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా వ‌ర్క‌వుట్ చేయొచ్చు.

మీజోరాం, మణిపూర్, నాగాలాండ్ ప్రజలు ఈ ప్రాజెక్టులను అభివృద్ధి, ఉద్యోగాలు, కనెక్టివిటీ ఆశతో చూస్తున్నారు. కానీ ఆలస్యాలు, భద్రతా సమస్యలు, నష్టపరిహారం – పునరావాసం వివాదాలు ప్రజల్లో అసంతృప్తిని కూడా పెంచుతున్నాయి. 

ప్రాజెక్టులు భారత్‌–ఆసియన్ భవిష్యత్తు అని చెప్పే ముందు,  ఈశాన్య ప్రజల వర్తమానాన్ని.. నిజాయితీగా చూడాల్సిన బాధ్యత రాజకీయ–నిర్వాహక వ్యవస్థపై ఉంది. 

వాజ్‌పేయి కలల రోడ్డుమార్గం.. 2027లో నిజమవుతుందా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతుకుతూ పోతే.. కలాడాన్ మల్టీమోడల్ ప్రాజెక్ట్, ఇండియా–మయన్మార్–థాయిలాండ్ త్రైలాటరల్ హైవే—ఇవి రెండూ కలిపి చూస్తే, వాజ్‌పేయి కాలంలో మొదలైన  లుక్ ఈస్ట్ దృష్టి కోణం, ఇప్పుడు  యాక్ట్ ఈస్ట్ రూపంలో భౌతిక వాస్తవంగా మారే అవకాశం క‌నిపిస్తోంది.

అయితే ఈ ప్రాజెక్టులు సాంకేతికంగా సాధ్యమైనవి, ఆర్థికంగా లాభదాయకమైనవి, వ్యూహాత్మకంగా అవసరమైనవి, కానీ.. రాజకీయంగా సంక్లిష్టమైనవి, భద్రతాపరంగా ప్రమాదాలతో నిండినవి, 
నిర్వాహకంగా ఆలస్యాలు, కోఆర్డినేషన్ లోపాలతో బాధపడుతున్నవిగా తెలుస్తున్నాయి.

2027 డెడ్‌లైన్‌ను ఈసారి నిజంగా చేరుకోవాలంటే, భారత్‌–మయన్మార్–థాయిలాండ్ మూడు దేశాలు.. మయన్మార్ అంత్యుద్ధ‌ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్సిబుల్ స్ట్రాటజీగా చూడాల్సి ఉంది. అంటే బైపాస్ మార్గాలు, మల్టీమోడల్ కనెక్టివిటీ, మిలీషియా–జుంటా–విపక్షతో సమతుల్య డిప్లొమసీ వంటి విష‌యాల్లో అన్నమాట‌. 

ఇక ఈశాన్య ప్రజల హక్కులు, నష్టపరిహారం – పునరావాసం, పర్యావరణ–సాంస్కృతిక అంశాలను గౌరవించే ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్ మోడల్, చైనా–బంగ్లాదేశ్–ఇతర ప్రాంతీయ శక్తుల ప్రభావాన్ని సమతుల్యం చేసే దీర్ఘకాలిక జియోపాలిటికల్ విజన్ తో ముందుకు సాగాల్సి ఉంటుంది.

వాజ్‌పేయి కలల రోడ్డుమార్గం నిజమవుతుందా లేదా? అన్నది, కేవలం ఇంజనీరింగ్ ప్రశ్న కాదు. ఇది భారత విదేశాంగ ధైర్యం, ఈశాన్య ప్రజల న్యాయం, మయన్మార్ శాంతి, ఆసియన్–ఇండియా భవిష్యత్తు అన్నింటినీ కలిపిన పరీక్ష.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...