Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు ఎప్పుడంటే?
posted on: Apr 8, 2026 9:12AM

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు బుధవారం (ఏప్రిల్ 8) తీర్పు వెలువరించనుంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులు ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. అసలు కమిషన్ ఏర్పాటే చట్టబద్ధం కాదని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సరైంది కాదని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు.
ఈ కేసులో హైకోర్టు పిటిషనర్లకు హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కాళేశ్వరం వ్యవహారం న్యాయపరంగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పుతో ఈ వ్యవహారంలో స్పష్టత రానుంది. కమిషన్ చట్టబద్ధతపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలపై హైకోర్టు తీర్పుతో క్లారిటీ వచ్చే ఉంది. నివేదికను చెల్లుబాటు చేస్తే ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. .మొత్తానికి హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొని ఉంది.


.webp)



