గోవా అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

 

గోవా నైట్ క్లబ్‌‌ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ అగ్నిప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ ఘటనల్లో కొందరు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందిస్తూ, ఇది చాలా బాధాకరమైన సంఘటన అని విచారం వ్యక్తం చేశారు.  గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు. బిర్చ్‌ నైట్‌ క్లబ్‌లో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని వివరించారు. అగ్నిప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు జరుపుతామని తెలిపారు. . . క్లబ్‌ను సీజ్‌ చేసి నిర్వాహకులను ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్లబ్‌లో భద్రతా చర్యలకు సంబంధించి దర్యాప్తు జరుపుతామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu