కొడుకుని చంపిన తండ్రి.. ఎందుకో తెలుసా..?  

ఇప్పుడు ఉన్న సమాజం లో డబ్బు మనిషిని ఎంతకైనా దిగరాజూస్తుంది. డబ్బుకి  ఫీలింగ్ ఉండవ్   ఎమోషన్స్ ఉండవ్, ఓన్లీ క్యాలుకులేషన్ మాత్రమే ఉంటాయి. మద్యం, డబ్బు మత్తులో మనిషి ఎంతటికైనా తెగిస్తాడు. ఎవరినైనా కడతేరుస్తాడు. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి.

గుమ్మడిదల మండలం. కొత్తపల్లి గ్రామం. ఆ దంపతులు గడ్డమీది శ్రీనివాస్‌గౌడ్‌, పద్మ, వారి కుమారుడు సాయికిరణ్ గౌడ్.  వయసు (23) సంవత్సరాలు. అందరూ కూలి పనులు చేస్తూ జీవితం కొనసాగిస్తుంటారు. రోజు మాదిరిగానే సోమవారం ముగ్గురూ పనులు చేసుకుని రాత్రి ఇంటికి చేరుకున్నారు. తండ్రిని డబ్బు కావాలని కుమారుడు కావాలని అడగడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఇద్దరూ వాదులాడుకుంటుండగా తల్లి పద్మ అరిచింది. అది వైనిపించుకోలేదు. పద్మ భయపడి బయటకు వెళ్లి తెలిసిన వారింట్లో పడుకుంది. 

కట్ చేస్తే.. రాత్రి ఇంట్లో నుండి వెళ్లిపోయిన పద్మ మంగళవారం ఉదయం వచ్చి చూసింది. కుమారుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు.  ఆ తల్లి ఒక్కసారిగా షాక్ తిన్నది. బిడ్డను, తండ్రి కర్రతో తీవ్రంగా కొట్టాడని ఆమె గమనించిన కొద్ది సేపటికే సాయికిరణ్‌ మృతి చెందడంతో తల్లి బోరుమని విలపించింది. అక్కడే ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌ను ఆమె కోపంతో రాయితో కొట్టడంతో గాయపడి బయటకు వెళ్లి పోయాడు.  అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని జిన్నారం సీఐ లాలునాయక్‌ సందర్శించి వివరాలను సేకరించారు. గ్రామ వీఆర్‌ఏ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయకృష్ణ తెలిపారు.

హైదరాబాద్ లో భారీ పేలుడు.. 

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ జయరాంనగర్‌ చౌరస్తా వద్ద భారీ పేలుడు సంభవించింది. ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న బ్యాగ్‌ను విసరడంతో ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఓ పూజసామగ్రి దుకాణం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. పేలుడు శబ్దం సుమారు కిలోమీటర్‌కుపైగా వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. బ్యాగ్‌తో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలో మరో బ్యాగు ఉండడంతో పోలీసులు ఇంకో బ్యాగ్‌ను తెరవడానికి డాగ్‌ స్క్వాడ్‌ రప్పించారు. అందులో చెత్తఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తనకు బ్యాగ్‌ బాలానగర్‌లో దొరికిందని, దానిని తీసుకువస్తుండగా కుక్కలు మొరగడంతో పడేసినట్లు అనుమానితుడు పోలీసులతో చెప్పాడు. దీంతో క్లూస్‌ టీమ్‌ సాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.