Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎవరెస్టుపై విషాదం...ఇద్దరు భారతీయులు మృతి
posted on: May 24, 2026 3:33PM

ఎవరెస్టు శిఖరాన్ని అధి రోహించి తిరిగి దిగివస్తున్న సమయంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపూర్కు చెందిన సందీప్ ఆరేగా గుర్తించారు. ప్రస్తుతం సందీప్ అమెరికాలో స్థిరపడి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నాడు. సందీప్ మే 20న విజయ వంతంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. అయితే మరుసటి రోజు తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు.
గతంలో కిలిమంజారో సహా పలు పర్వత శిఖరాలను అధి రోహించిన అనుభవం సందీప్కు ఉంది. మరో మృతుడు ఉత్తరప్రదేశ్కు చెందిన అరుణ్కుమార్ తివారిగా గుర్తించారు. హైదరాబాద్లో స్థిరపడి ఐటీ రంగంలో పనిచేస్తున్న తివారి, పర్వతారోహణలో విశేష అనుభవం సంపాదించాడు. రష్యా, అమెరికా, అర్జెంటీనాల్లోని పలు పర్వ తాలను విజయవంతంగా అధిరోహించాడు.ఈ ఇద్దరు
ఎవరెస్టు నుంచి దిగివస్తున్న సమయంలో తీవ్ర అలసట, ఎత్తు ప్రభావం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరినీ గైడ్లు రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతం మృతదేహాలను దిగువకు తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరు మృతి చెందినట్లుగా సమాచారం అందుకున్న వెంటనే రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకు న్నాయి.






