ఈజిప్ట్ లో విమానం కూలి 212 మంది దుర్మరణం

 

ఈజిప్ట్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈజిప్ట్ నుండి రష్యా వెళతున్న విమానం ప్రమాదవశాత్తు సినాయ్ లో కూలిపోయింది. విమానం కూలిపోయినట్టు ఈజిప్ట్ ప్రధాని షరీఫ్ ఇస్మాయిల్ ధృవీకరించారు. వివరాల ప్రకారం కాగా ఈజిప్ట్ నుండి రష్యా వెళతున్న విమానం ఐఎస్ఐఎస్ ప్రాబల్యం ఎక్కువగా ఉండే సినాయ్ ప్రాంతంలో గల్లతైంది. తరువాత అక్కడి నుండి కంట్రోల్ రూంకు విమానం నుంచి సిగ్నల్స్ లేదు. దీంతో ఈజిప్ట్ సైనిక విమానాలు గల్లంతైన విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టగా అది సెంట్రల్ సినాయ్ లోని పర్వత ప్రాంతాల్లో అది కూలిపోయిందని గుర్తించారు. ఈ విమానంలో మొత్తం 212 మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బంది ఉండగా ఎక్కువ మంది రష్యా ప్రయాణికులే ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రయాణికుల్లో ఎవరైనా బతికి ఉన్నారా అన్నది ఇప్పుడు సందేహం.. కాగా విమానంలోని వారంతా చనిపోయి ఉంటారు అని ఓ అధికారి అన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu