కరోనా చావు.. బంగారం పోవు..  

మీ ఇంట్లో ఎవరికైన కరోనా వచ్చిందా..? వాళ్ళకి సీరియస్ గా ఉంటే ఆసుపత్రిలో చేర్పించాలనుకుంటున్నారా..? అయితే వారి ఒంటి మీద ఏమైనా బంగారు ఆభరణాలు ఉంటే, ముందుగానే తీసుకోండి.. ఎందుకంటే..? ఆ బంగారాన్ని అమ్మితే కనీసం వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకైనా ఎంతో అంతో ఆసరావుతుంది. అదేంటి అలా చెపుతున్నాడు అనుకుంటున్నారా..?  ప్రస్తుతం కరోనా హాస్పిటల్ లో జరుగుతున్న సంఘటలను చూస్తే అదే బెటర్ అనిపిస్తుంది. ఒకవేళా కరోనా వచ్చిన వాళ్ళ వంటి మీదా తాళి ఉంటే అని.. సందేహం పడుతున్నారా.. ? తాళి కూడా తీకుకొండి అని కూడా చెప్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. 

కరోనా కాలంలో మనుషులు మరణానికి దగ్గర అవుతూ.. బంధాలకు దూరమవుతున్నారు. మరి కొంత మంది సచ్చినోడి సొమ్ము వచినంతనే సాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సచ్చిన శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు నీచమైన దారుణానికి వడిగడుతున్నారు. మానవత్వాన్ని మరిచిన మృగాలు అవుతున్నారు. ఒక వైపు కరోనా వచ్చిన వాళ్ళని హాస్పిటల్ సిబ్బంది ఆర్థికంగా పట్టి పీడిస్తుంటే.. హాస్పిటల్ లో సేవలు అందించే కొతం మంది ఆ పేషేంట్స్ వంటి మీద ఉన్న బంగారాన్ని దోచుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రిలో కరోనా శవాలను కూడా కుటుంబాలకు అప్పగించడం లేదని మరోవైపు ప్రచారం జరుగుతుంది. 

పుంగనూరు కు  చెందిన ఓ బాధితురాలు ఈ నెల 3వ తేదీన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం చేరారు. మరుసటి రోజు మృతి చెందారు. మృతదేహాన్ని అప్పగించేటప్పుడు ఆమె మెడలోని 60 గ్రాముల బంగారం తాళిబొట్టు కనిపించలేదు. బాధితుల బంధువులు ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా గతంలో తిరుపతిలోని స్విమ్స్‌, రుయాతో పాటు జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ మృతుల శరీరాలపై ఉన్న ఆభరణాలు మాయం అయ్యాయి. పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు సైతం నమోదయ్యాయి. రెండో కొవిడ్‌ అలలో మృతుల సంఖ్య పెరుగుతున్నందున ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ విషయంపై ఎలాంటి విధి విధానాలు పాటించడం లేదు. కొవిడ్‌ బారినపడ్డారని తెలియగానే బాధితులు భయాందోళనలకు గురవుతూ వెంటనే ఆస్పత్రికి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో తమ శరీరంపైౖ ఎలాంటి విలువైన ఆభరణాలు ఉన్నాయోనని గుర్తించే పరిస్థితి ఉండదు. ఆస్పత్రిలో చేరే వారికి కొంత దూరంగా బంధువులు ఉన్నప్పటికీ ఆభరణాలు గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. తీరా మృతి చెందాక మృతదేహాన్ని పూర్తిగా కప్పి జిప్‌ బ్యాగ్‌లో పెట్టి దహన సంస్కారాలకు తరలిస్తారు.          

పర్యవేక్షణ..       

రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో సుమారు 900 మంది కొవిడ్‌ బాధితులు వైద్యం పొందుతున్నారు. వారి పడకల వరకు వైద్యులు, నర్సులు, అటెండర్లు వెళ్తుంటారు. బాధితుల శరీరంపై ఎలాంటి ఆభరణాలు ఉన్నాయి, వాటికి ఎలాంటి రక్షణ ఇస్తున్నామనే వ్యవస్థ అక్కడ కన్పించడం లేదు. కనీసం ఆస్పత్రిలో చేరే సమయంలో అయినా విలువైన ఆభరణాలు బంధువులకు అప్పగించాలని చెప్పడం, ఒక వేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ప్రత్యేకంగా నమోదు చేయడం వంటివి చేయడం లేదు. ఆభరణాలు మాయం అయితే అందుకు దోషులు ఎవరని నిర్ధరించేందుకు ఎలాంటి ఆధారాలు అక్కడ లభించని పరిస్థితి.              

స్విమ్స్‌లో సీసీ కెమెరాలే దిక్కు         

గతంలో మృతదేహాలపై బంగారు ఆభరణాలు మాయమైన ఘటనలు స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో చోటుచేసుకున్నాయి. చివరకు ముగ్గురు స్విమ్స్‌ సిబ్బందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదు అందలేదు. అన్ని వార్డుల్లో ఉన్న సీసీ కెమెరాలు దొంగలను పట్టిస్తాయనే నమ్మకంతో స్విమ్స్‌ యాజమాన్యం ఉంది. ఇదివరకటిలా బాధితులు చేరే సమయంలోనే ఆభరణాలు నమోదు చేసి.. డిశ్ఛార్జి సమయంలో అప్పగించే వ్యవస్థ ప్రస్తుతం కన్పించడం లేదు. ప్రస్తుతం ఆక్సిజన్‌ పడకల కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తూ శరీరంపై ఎలాంటి ఆభరణాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించకుండా చేరిపోతున్నారు.                  

అలాంటి ఫిర్యాదులు రాలేదు..    

మరోవైపు స్విమ్స్‌ కరోనా ఆస్పత్రిలో బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు  ఫిర్యాదులు ఇప్పటి వరకు రాలేదని. గతంలో జరిగిన కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్స్ లో  సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది. గతంలో మాదిరిగా ఇప్పుడు మృతదేహాల వద్దకు ఎవరు రాలేని పరిస్థితి ఉందని. కరోనా వల్ల చనిపోయిన పది నిమిషాలకే ఆ శవాలను కుటుంబ సభ్యులకు రెండు గంటల్లోనే  అప్పగిస్తున్నాం అని, చేర్చుకునే సమయంలోనే కేసు షీటులో ఆభరణాల గురించి నమోదు చేస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం చెపుతుంది.