ముఖ్యమంత్రికి భూకంపాలు తట్టుకొనే శక్తి ఉందిట

 

బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తే భూకంపం సృష్టిస్తామని తెరాస అద్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. దానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంతే దీటుగా స్పందిస్తూ మా ప్రభుత్వానికి భూకంపాలు తట్టుకొనే శక్తి ఉందని అన్నారు. బయ్యారం గనుల విషయంలో తీసుకొన్న నిర్ణయంలో ఇసుమంత మార్పు కూడా ఉండబోదని ఆయన తెగేసి చెప్పారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులకు గనులు కేటాయించినప్పుడు మాట్లాడని తెరాస నేతలు ఇప్పుడు ప్రభుత్వ సంస్థకు కేటాయిస్తే ఎందుకు గొంతు చించుకొంటున్నారని ఆయన ఎదురు ప్రశ్నించారు.