ఒక్కసారే 45 మంది కాంగ్రెస్ అభ్యర్థులపై సస్పెండ్ వేటు..
posted on Dec 1, 2015 3:30PM
.jpg)
బీహర్ ఎన్నికల్లో మహాకూటమిగా ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసి ఊహించని మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లిచ్చిన కొంతమంది కాంగ్రెస్ నేతలు రెబల్స్ గా పోటీ చేశారు. పార్టీ పెద్దలు ఎంతగా బుజ్జగించినా వినకుండా పలుచోట్ల రెబెల్స్ ఓట్లను చీల్చి కాంగ్రెస్ అధికారిక అభ్యర్థుల గెలుపును అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెబల్స్ గా బరిలో దిగిన కాంగ్రెస్ నేతలపై ఇప్పుడు వేటు వేసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 45 మంది తిరుగుబాటు నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండు చేస్తూ తీసుకున్న నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే జగన్నాథ్ ప్రసాద్ రాయ్ నేతృత్వంలో సమావేశమైన పార్టీ డిసిప్లినరీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.