బీసీ రిజర్వేషన్ల బంద్ వాయిదా

 

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బంద్ అక్టోబర్‌ 18కి వాయిదా పడింది. రిజర్వేషన్ల కోసం ఇవాళ పలు బీసీ సంఘాలు ఒక్కటై బీసీ జేఎసీగా ఏర్పాడ్డాయి. ఛైర్మన్‌గా ఆర్ కృష్ణయ్య, వైస్ ఛైర్మన్‌గా వీజీఆర్‌ నారగొని,వర్కింగ్ ఛైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్‌గా దాసు సురేష్ , రాజారామ్ యాదవ్‌లు ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వాస్తవానికి అక్టోబర్‌ 14న బీసీ సంఘాలు బంద్‌ చేపట్టాల్సి ఉంది.  అయితే ఈ క్రమంలో బీసీ సంఘాలు ఆదివారం (అక్టోబర్‌ 12) సమావేశమయ్యాయి. ఈ భేటీలో బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఈ నెల 18న చేపట్టాలని నిర్ణయించాయి. 

  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu