అయోధ్యకు చేరిన పురాతన సాలగ్రామం.. ఎందుకంటే?
posted on Feb 2, 2023 1:38PM
అయోధ్యలో రామజన్మ భూమిలో నిర్మాణంలో ఉన్నరామమందిరంలో శ్రీరాముడి ప్రధాన విగ్రహాన్ని మలిచేందుకు నేపాల్ నుంచి అత్యంత అరుదైన సాలగ్రామాన్ని తీసుకువచ్చారు. ఈ భారీ సాలగ్రామంతోనే శ్రీరామచంద్రుని విగ్రహాన్ని తయారు చేసి, గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు.
ఈమేరకు శ్రీ రామజన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్టు రెండు అరుదైన సాలగ్రామాల వివరాలను వెల్లడించింది. ఇవి 60 మిలియన్ ఏళ్లకంటే పురాతనమైనవని, ఒక రాయి 26 టన్నులు, మరొకటి 14 టన్నుల బరువుందని ట్రస్టు వివరించింది. వీటిని దేవ శిలలుగా పిలుస్తారు. ఈ శిలలనునేపాల్ లోని ముక్తినాథ్ సమీపంలోని గండకి నది సేకరించారు. గండకి నదిలోనే అరుదైన సాలగ్రామాలు లభిస్తాయి.
అయోధ్యలో ఉన్నది రామ్ లల్లా మందిరం. అంటే బాల రాముడు, రాముడు బాలుడి అవతారంలో ఉంటారు కనుక ఈ అరుదైన..అత్యంత పురాతన, భారీ సాలగ్రామంతోనే రామయ్య బాలుడి రూపాన్ని చెక్కి, ప్రతిష్ఠాస్తారు. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికల్లా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసేలా పనులు సాగుతున్నాయి.