పాము కాటుకు 5  మంది మృతి .. 

పాములు పగబడతాయా ? అంటే నమ్మాలో నమ్మకూడదో అర్థం కాదు. కొన్ని సార్లు శాస్త్రీయంగా లోచిస్తే పగపట్టావు అని.. మరి కొన్ని సంఘటనలు చూస్తే నమ్మాల్సి వస్తుంది.. మరి ఇంతకీ పాములు పగబడుతాయా ?  తాజాగా జరిగిన సంఘటన గురించి వింటే పగపడుతాయి అనే అనుమానం మీకు కూడా వస్తుంది. తాజాగా పాములు 24 గంటల వ్యవధిలోనే ఐదుగురిన కాటు వేశాయి. చివరికి పొట్టనబెట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలోని వివిధ పాముకాటు ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా..వీరిలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది. మృతుల్లో ఎక్కువగా యుక్త వయస్కులే ఉన్నారు. మృతుల్లో 22, 28, 14, 18 ఏళ్ల వయస్కులు కూడా ఉన్నారు. పాపం ఇంకా జీవితాన్ని చూడాల్సిన వాళ్ళు ఇలా  పాము కాటుతో మరణాన్ని చవి చూశారు.  తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పాము కాటుకు ఒక సమస్య ఇయితే.. అక్కడి  సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు లేకపోవడం కూడా మరో ముఖ్య మైన సమస్య అని చెప్పాలి. పాము కాటుకు మరణించే  మృతుల సంఖ్య పెరగటానికి ప్రాధమిక కేంద్రంలో మందులు లేకపోవడమే ప్రధాన  కారణంగా తెలుస్తోంది. 24 గం.ల వ్యవధిలోనే ఒకే జిల్లాలో ఐదుగురు వ్యక్తులు పాముకాటుతో మృతి చెందడం యూపీ వ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారింది.

యూపీ రాష్ట్ర వ్యాప్తంగానూ గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో పాముకాటు ఘటనలు నమోదయ్యాయి. ప్రతిరోజూ ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో జనం పాముకాటుతో మృతి చెందారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా కలుగులో పుట్టలో తల దాచుకున్న పాములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో మరి ఎక్కువ  పాము కాటు ఘటనలు చోటుచేసుకోవడంతో సకాలంలో వారికి వైద్య చికిత్స కల్పించలేకపోతున్నారు. చికిత్స ఆలస్యం కావడంతో బాధితులు మృతి చెందుతున్నారు. వర్షాల నేపథ్యంలో వాళ్ళ ఎక్కడికైనా హాస్పత్రికి తీసుకుపోదాం అన్న వరదలు ఒక వైపు, మారు మూల గ్రామాల్లో అయితే రోడ్లు సరిగ్గా ఉండదు. రవాణా సరిగ్గా ఉండదు. ఇది ఇలా ఉంటే పాము కాటు నివారణ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆ జిల్లా ప్రజలను సూచించారు. అటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటుకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. మిగిలిన జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను  పాము కాటు చికిత్స పట్ల అప్రమత్తం చేశారు. చివరిగా చూస్తే పాములు పగబట్టావ్ అని తెలుస్తుంది.