గోరంట్లపై, సహకరిస్తున్న పోలీసులపైనా చర్యలు తీసుకోండి..టీడీపీ నేత అనిత
Publish Date:Aug 11, 2022
మహిళలకు రక్షణ కల్పించడంలో తాను ముందుంటానని ఏపీ సీఎం జగన్ ప్రచారం బాగానే చేయించుకున్నారు. కానీ తన ఎంపీయే ఊహిం చనివిధంగా పట్టుబడినా అదంతా కట్టుకధే అన్నట్టు జగన్ వ్యవహ రించడంపట్ల విపక్షాలు మండిపడుతున్నాయి. వైసీపీ అనంతపురం ఎంపీ గోరంట్లమాధవ్ న్యూడ్ వీడియో లోకమంతా చూసి నివ్వెరపో యింది. అయినా అందులో ఉన్నది నకిలీ, అదంతా మార్ఫింగ్ వ్యవ హారమని వైసీపీ నేతలు అంటున్నారు. ఎంతయినా తమవాడు అంత దుర్మార్గానికి ఒడిగడతాడా అన్నది వారి ధీమా. కానీ అందులో కని పించినది గోరంట్ల మాధవుడే అని తప్పుల్లేకుండా అందరూ అన్నారు. కానీ అందుకు అవ కాశం లేదని వైసీపీ కితాబునిచ్చింది.
మావాడు మహా మంచివాడని చెబుతూ తప్పించుకునే యత్నం చేస్తోంది. ఫోరెన్సిక్ నివేదికలు వస్తేగాని ఏదీ తేల్చలేమని అం టున్నారు. సీఎం, మంత్రులు, ఎంపీలు కూడా గోరంట్ల పట్ల ఎంతో ప్రేమగా ఉండడం, ఆయన్నుదీన్నించీ తప్పించడానికే పూను కున్నారని విశ్లేషకులు అంటున్నారు. కానీ విపక్షాలకు అంత అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టే చీల్చి చెండాడుతారు. అందు లోనూ ప్రజల దృష్టిలో పరువు పోగొట్టుకున్న వైసీపీ సర్కార్ సమాధానం చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది.
ఎస్పీ ఫక్కీరప్ప చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఆయన సెల్ఫోన్ను స్వాధీనం చేసుకోవడం వీలుకాదని ఎస్పీ చెప్పడంపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అస హనం వ్యక్తం చేశారు. గోరంట్ల న్యూడ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షకు పంపితే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్లపై, సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ను కోరారు. మహిళల పట్ల వైసీపీ నేతల అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకే కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్ సర్కార్ విఫలమైం దన్నారు.
గోరంట్ల పై చర్యలు తీసుకోండి.. ప్రధానికి, స్పీకర్కి గిల్ లేఖ
Publish Date:Aug 11, 2022
ఈ బంధం అనుబంధమేనా?
Publish Date:Aug 11, 2022
దేశభక్తి.. జాతీయమా..గుజరాతీయమా!
Publish Date:Aug 11, 2022
తెలంగాణ బీజేపీకి సీఈసీ షాక్.. సాలుదొర సెలవు దొర ప్రచారానికి బ్రేక్
Publish Date:Aug 11, 2022
80 ఏళ్లకు గమ్యం చేరిన పెయింటింగ్!
Publish Date:Jun 19, 2022
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్లోని ఆర్నెహెమ్లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్స్టర్డామ్లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
పవార్ సారథ్యంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్?
Publish Date:Mar 17, 2021
బడ్జెట్ రెడీ సంక్షేమానికి పెద్ద పీట?
Publish Date:Mar 16, 2021
ప్రచారం ముగిసింది.. ఇక పోరాటం మిగిలింది..
Publish Date:Mar 12, 2021
నేనూ హిందువునే..! ఓట్ల కోసం నేతల నినాదం
Publish Date:Mar 10, 2021
చంద్రబాబుకు సీఐడీ నోటీసులు
Publish Date:Mar 15, 2021
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు..ఆయన నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.
41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తామని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. అమరావతి నుంచి రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులుకూ సీఐడీ నోటీసులు అందాయి. 41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
2 వేల నోటు ఇక ఉండదా!
Publish Date:Mar 15, 2021
బీజేపీ నోటాను బీట్ చేసింది...
Publish Date:Mar 15, 2021
స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఖర్చు 10 వేల కోట్లు!
Publish Date:Mar 15, 2021
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దేనా..?
Publish Date:Mar 15, 2021
నేటి యువత రేపటి సూత్రధారి!
Publish Date:Aug 11, 2022
ఈ ప్రపంచంలో రేపు ఎలా ఉంటుంది అనేది యువత మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే యువతలో ఉత్సాహం, వారి ఆలోచనలు, వారి ప్రణాళికలే రేపటిని గొప్పగా ఉంచాలన్నా, అధఃపాతాళంలోకి నెట్టివేయలన్నా మూలకారణం అవుతాయి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు, నేటి యువత రేపటిని నడిపించే బాధ్యతాయుత సూత్రధారులు అవుతారు.
ప్రపంచం మొత్తం మీద జనాభాలో యువత శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే యువత ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిలో నిరుద్యోగం ఎంతో ముఖ్యమైనది. డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్నా, ఉన్నత విద్యలు చదివినా ఉద్యోగ అవకాశాలు సరైనవిధంగా లేక మిగిలిపోతున్న యువత ఎందరో ఉన్నారు.
అయితే యువతకు సరైన మార్గం చూపేందుకు ఈ ప్రపంచం కూడా కృషి చేస్తోంది. అంతర్జాతీయ యువ దినోత్సవ కర్తవ్యం అదే.
తేడా!!
చాలామంది యువ దినోత్సవం అని వినగానే అది వివకానందుడి జన్మదిన సందర్భంగా నిర్వహించుకునే జాతీయ యువజన దినోత్సవం అని అనుకుంటారు. అయితే జాతీయ యువజన దినోత్సవానికి, అంతర్జాతీయ యువ దినోత్సవానికి మధ్య బేధాన్ని గుర్తించడం అవసరం.
అంతర్జాతీయ యువ దినోత్సవం!!
ఈ ప్రపంచంలో ఉన్న యువతకు సరైన మార్గనిర్దేశకత్వం అవసరమని, వారికి సరైన సలహాలు, సూచనలు దొరికితే ఈ ప్రపంచాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ప్రపంచదేశాల అభిప్రాయం. దానికి అనుగుణంగానే 1999లో 54/120 అనుసరణ ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న అంతర్జాతీయ యువ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించారు.
కార్యక్రమాలు!!
ప్రతి రోజుకూ ఒక ప్రత్యేకత ఉన్నట్టు, ఆ ప్రత్యేకమైన రోజు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం సహజం. అంతర్జాతీయ యువ దినోత్సవం రోజున యువతకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయడం, ఆచరణ విషయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలు, యువత తమ ఆలోచనలను, నైపుణ్యాలను పెంచుకునేందుకు అవగాహన కల్పించడం. ప్రపంచ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడం, వర్క్ షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేసి యువతలో ఉన్న నైపుణ్యాలు బయటకు తీయడం చేస్తారు.
యువత కోసం కొన్ని మాటలు!!
స్వేచ్ఛ అనేది అడగాల్సినది కాదు అది ఎవరికి వారు తీసుకునేది అంటారు సుభాష్ చంద్రబోస్. యువతకు లభించే స్వేచ్ఛ వారిని అభివృద్ధి చేసేదిగా ఉండాలి. ఆ అభివృద్ధి దేశాన్ని కూడా ముందుకు నడిపించగలగాలి. యువతలో ఉండే విభిన్న ఆలోచనలను నిరుత్సాహ పరచకుండా వారిని ప్రోత్సహించాలి.
యువత గట్టిగా ఏదైనా నమ్మితే దాన్ని సాధించే ఆవేశం, కసి, పట్టుదల వారిలో ఉంటాయి కాబట్టి సాధించగలరు. కావాల్సిందల్లా వారిని ప్రోత్సహించడమే.
భారంగా మారిన నాలుగు మేఘాలు ఆకాశంలో పక్కపక్కనే చేరితే కుండపోతగా వర్షం ఎలా కురుస్తుందో, మెండైన ఆలోచనలు కలిగిన యువకులు ఒకచోట చేరితే ఎంతో గొప్ప ఆలోచనలు కలుగుతాయి. ఎన్నో గొప్ప అద్బుతాలు ఈ ప్రపంచానికి పరిచయం అవుతాయి.
చట్టపరంగానూ, సమాజికంగానూ, ఆర్థిక, కుల, మత బేధాలతో ఎన్నో అవకాశాలు అందుకోలేకపోతున్న యువతకు తెలియాల్సిన విషయం ఒకటుంది. తమ ప్రతిభే తమా భవిష్యత్తుకు, తమ జీవితానికి పెట్టుబడి అనే విషయం గ్రహించడం.
కాబట్టి యువత తమ జీవితాన్ని దురదృష్టం పేరుతోనో, నమ్మకాల పేరుతోనో, సోమరితనంతోనో, ఇంకా అవకాశాలు లేవని చెబుతూనో చేజార్చుకోకుండా అవకాశాలను సృష్టించుకుంటే అది యువత శక్తి అవుతుంది.
◆ నిశ్శబ్ద.
చెల్లి రక్ష అన్న బాధ్యత!! అదే రాఖీ పూర్ణిమ అంతరార్థం!
Publish Date:Aug 10, 2022
ఆదివాసుల జీవితాలను ఆదుకోండి!
Publish Date:Aug 9, 2022
భారతీయ చేనేత….. వస్త్రప్రపంచానికి అధినేత!
Publish Date:Aug 8, 2022
ఫ్రెండ్షిప్ డే హంగామా ఇలా చేసేయండి!
Publish Date:Aug 7, 2022
శరీరం లో ప్లేటిలెట్స్ పెరగాలంటే ఏం చెయ్యాలి ?
Publish Date:Aug 11, 2022
శరీరం లో రక్తానికి సంబందించిన అన్నిరేపెర్లు చేసేది ప్లేటిలేట్లే. అలాంటిది డెంగు మలేరియా వచ్చిందో రోగికి శరీరం లో ప్లేటిలెట్స్ సమర్ధవంతంగా చేస్తాయి.ప్లేతిలేట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు మనిషి ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. మనం తినే ఆహారం లో నే ప్లేటిలేట్స్ సంఖ్య పెంచాలంటే అసలు మన శరీరానికి ప్లేటిలెట్స్ అందించాలంటే సహకరించే ఆహార పదార్ధాలు ఏమిటి?అసలు మనరక్తం లో ఎన్ని ప్లేటిలేట్స్ ఉండాలి అన్నవిష్యం మీకు తెలుసా ఆవిషయాలు తెలుసుకుందాం.ప్లేటిలేట్స్ సంఖ్య ఎంతఉండాలి?--మనశరీరంలో ప్లేటిలేట్స్ 1,5౦,౦౦౦ నుండి 4,5౦,౦౦౦ ప్లేటిలేట్స్ ఉంటాయి.శరీరంలో గాయాలు అయినప్పుడు.రక్తం గడ్డకట్టడానికి గాయాలు త్వరగా మానడానికి ప్లేటిలెట్స్ సహాయ పడతాయి. ప్లేటిలెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. ప్లేటిలేట్స్ తగ్గాయా తీవ్ర జ్వరం,బిపి, హార్ట్ ఎట్టాక్ నీరసం వచ్చే ప్రమాదం ఉంది.ఎప్పటికప్పుడు ప్లేటిలెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. రక్త పరీక్ష చేయించుకుంటే మనరక్తంలో ఎన్ని ప్లేటిలెట్స్ ఉన్నాయో తెలుస్తుంది.మనం తీసుకునే ఆహారం పైనే ప్లేటిలేట్స్ సంఖ్య ఆధార పడి ఉంటుంది.ప్లేటిలేట్స్ వృద్ది చెందేందుకు ఏఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
1) బొప్పాయి...
బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి జ్యూస్ చేసుకుని తాగడం.లేదా బొప్పాయి ఆకులను బాగా ఉడకపెట్టి వడపోసిన కషాయాన్ని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల ప్లేటిలెట్స్ పెరుగుతాయి. అలాగే బొప్పాయి వల్ల రక్త్గం వృద్ధిచెందుతుంది.రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది.
2)బీట్ రూట్...
బీట్ రూట్ వల్ల రక్తం వల్ల ప్లేటిలెట్స్ పెరగడానికి బీట్ రూట్ మంచిది. అనిమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్ రూట్ ను తీసుకోవాలి.
౩) క్యారెట్...
క్యారెట్ వల్ల రక్తం వృద్ధిచెంది ప్లేటిలేట్స్ పెరుగుతాయి. కనీసం వారానికి మూడుసార్లు అయినా క్యారెట్ తినాలి.
4)వెల్లుల్లి...
శరీరంలో సహజంగా ప్లేటిలేట్స్ పెంచుకోవాలంటే వెల్లుల్లి మంచిది. అని నిపుణులు సూచిస్తున్నారు .కాగా కొందరు ఉదయం వేళల్లో పరగడుపునే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే గుండే సంబందిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.
5)ఆకుకూరలు...
శరీరంలో ప్లేటిలేట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ కే పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.కాగా శరీరంలో రక్త్ఘహీనత అనీమియా ఉన్న వారికి తోటకూరను తినిపించడం ద్వారా రక్తం పుష్కలంగా లభిస్తుంది.అందుకే ఆకుకూరాలు తీసుకోవడం మంచిది.
6)దానిమ్మ..
శరీరం లో ప్లేటిలెట్స్ కౌంట్ పెరగాలంటే దానిమ్మ ఉపయోగ పడుతుంది.దీనిలో విటమిన్లు పోషకాలు అధికంగా ఉంటాయి.
7)ఎండు ద్రాక్ష...
ప్లేటి లెట్స్ కౌంట్ పెంచడానికి సహజంగా పెరగాలంటే ఎందుద్రాక్షను తీసుకోవాలి.లేదా రాత్రి నీళ్ళలో నానపెట్టి ఉదయాన్నే పరగడుపునే ఎండుద్రాక్ష ను తీసుకుంటే మచిదని నిపుణులు సూచిస్తున్నారు.కాగా వేదినీళ్ళ లో ఎందుద్రాక్షను నానపెట్టి తీసుకుంటే మలబద్దకం వంటి సమస్యనుండి బయపదవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
8) ఖర్జూరం...
ఖర్జూరం పండ్లలో ఐరన్,కాల్షియం,రక్తహీనత,ఇతర న్యుత్రీశియన్స్ అధికంగా లభిస్తాయి.ఎప్పటికప్పుడ్డు రక్త్ఘ పరీక్షలు చేయిస్తూ ఉంటె శరీరంలో ప్లేటిలేట్స్ సంఖ్య ఎంత ఉందొ తెలుసుకుంటూ ప్లేటిలెట్స్ సంఖ్య తగ్గకుండా చూసుకోవాలి. మనం తీసుకునే ఆహారం పైనే ప్లేటి లెట్స్ సంఖ్య ఆధార పడిఉంటాయి.పైన పేర్కొన్న ఆహారం తీసుకోవడం వల్ల మీ ప్లేటిలేట్స్ పెరుగుతాయి. కీప్ యువర్ సెల్ఫ్హేల్తీ
భోజనం తరువాత నీరు తాగితే ?
Publish Date:Aug 10, 2022
నాడీ పతితో ఫ్యాటీ లివర్ ను తగ్గించవచ్చా ?
Publish Date:Aug 9, 2022
కల్తీ...కల్తీ...కల్తీ...ఎటు చూసినా కల్తి
Publish Date:Aug 8, 2022
వరల్డ్ బోన్ అండ్ జాయింట్ డే...
Publish Date:Aug 5, 2022
కండ్ల ముందే ప్రపంచం.. కళ్లజోడు లోనే సమస్తం
Publish Date:Jul 17, 2020
సాంకేతిక రంగంలో మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ తెరతీసింది. జియో ఇంటర్నెట్ తో లక్షలాది మంది వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకున్న ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన జియో గ్లాసెస్ డిజిటల్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాయి.
రిలయన్స్ సంస్థ 43న వార్షికోత్సవంలో జియో గ్లాస్ ను ఆవిష్కరించారు. ఈ కళ్లజోడుతో ఇప్పటివరకు అరచేతిలో ఇమిడిన ప్రపంచం ఇంక కంటి ముందు సాక్షాత్కరించబోతుంది.
కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా డిజిటలైజ్ అయ్యిన తరుణంలో ఆన్ లైన్ క్లాస్ లు, వీడియా కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్ లు సగటు మనిషి జీవితంలో సాధారణమైన తరుణంలో ఈ జియో గ్లాస్ లు ఎంతో ఉపయోగకరంగా ఉండ బోతున్నాయి. అయితే వీటి ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
జియో గ్లాస్ ఫీచర్స్
- నల్లని రంగు..కాస్త మందంగా.. కూలింగ్ గ్లాసెస్ లను పోలిన వీటి బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే.
- ఈ గ్లాసెస్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ నుంచి 25 మిక్సిడ్ రియాలిటీ యాప్స్ పనిచేసేలా సెట్టింగ్ చేసుకోవచ్చు.
- ప్రత్యేకంగా పొందుపరిచిన 3 డి హోలో గ్రాఫిక్ డిజైన్ ద్వారా వర్చువల్ రియాల్జీలో మీటింగ్స్ నిర్వహించుకోవచ్చు.
- ఇందులో అమర్చిన సెన్సార్లు, హార్డ్ వేర్ అధునాతన టెక్నాలజీలో పనిచేస్తాయి. ఎక్స్ ఆర్ సౌండ్ సిస్టం ద్వారా ఎలాంటి కేబుల్ అటాచ్ మెంట్ లేకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లు వినవచ్చు. అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది.
- హై రిజల్యూషన్ లో ఉండే డిస్ ప్లే ద్వారా గేమింగ్, షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు.
- ఇందులోని హోలా గ్రాఫిక్ వీడియో కాల్ ద్వారా పెద్ద స్క్రీన్ పై ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు.
- అంతేకాదు 3డీ వర్చువల్ అవతార్, 2డి వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా కూడా మీకు కావల్సిన విధంగా ఈ కళ్లజోడు పనిచేస్తుంది.
- జియో మిక్స్ డ్ రియాలిటీ క్లౌడ్ అందుబాటులో ఉండటంతో ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
- ప్రపంచాన్నిసుందరంగా చూపించగల టెక్నాలజీని ఈ కళ్లజోడుతో అందిస్తున్నారు.
విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపార వేత్తలు ఇలా అన్నిరంగాల వారికి ఉపయోగపడేలా ప్రపంచాన్ని అరచేతిలో నుంచి కండ్లముందుకు తీసుకువస్తున్నారు.
YouTube Premium and Music services launched in India, starts at Rs 99 per month
Publish Date:Mar 13, 2019
Your WhatsApp account will be deactivated if you use these apps
Publish Date:Mar 11, 2019
Best phones under 20,000 in 2019
Publish Date:Mar 9, 2019
Google introduces educational app Bolo to improve children’s literacy in India
Publish Date:Mar 6, 2019