దటీజ్ పూరీ
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా డైరెక్టర్ పూరి సహనంతో సక్సెస్ సాధించారని సహచర నిర్మాతలు, డైరక్టర్లతో పాటు సినీ పరిశ్రమ యావత్తూ అనుకుంటున్నారు. తెలంగాణ ఏరియాలో పవన్ కల్యాణ్ కున్న ఫాలోయింగ్ని తగ్గించడానికే తెలంగాణ వాదులు ఇలా చేశారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అభ్యంతరకర సీన్లు కట్ చేస్తామని చెప్పిన తరువాత తెలంగాణవాదులు రీళ్లను, తగులబెట్టటం, పవన్ కల్యాణ్ ఫ్లెక్స్లలను, పోస్టర్లను చింపటం అభిమానులను కొట్టటం తోపాటు నైజాం ఏరియా బయ్యర్ దిల్ రాజు, పూరి జగన్నాద్ ఇళ్లమీద, ఆఫీసలు మీద దాడి చేయడం తెలిసిందే. అయితే ఎక్కడా ఉద్యేగాలకు తావు నియ్యకుండా సంయమనం పాటించి రెండు రోజుల్లో సినిమా మళ్లీ ప్రదర్శనకు తెచ్చారని సినీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానిగా ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఆరం గ్రేటం చేసిన శ్రవణ్ ని ఎదుర్కుంటాం అన్న అభిమాన సంఘాలను శాంత పరచి, రాస్తారోకో చేస్తామన్న అభిమానులను దానివల్ల గొడవలు మరింత పెరుగుతాయని చెప్పి సినిమాను పండుగ రోజుల్లో హౌస్ ఫుల్ కలెకన్లలో నడిపించారు. అధిష్టానం తమ వాదనలు పట్టించుకోకుండా ప్రత్యేక తెలంగాణ అజెండాను పక్కన పెట్టటం, ఇదిగో తెలంగాణ అదిగో తెలంగణా అని ప్రస్తం తం ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ప్రస్టేషన్ లో ఉన్న తెలంగాణ నాయకులు రాంబాబు సినిమాని ఇష్యూ చెద్దామనుకుంటె కుదుర లేదు. మిగతా ఫ్రొడ్యూసర్లు, డైరెక్టర్లు దానిపై స్పందించ కుండా పూరీ చూసుకుంటుంతో మీడియాలో కూడా రాద్దాంతం చేయటం కుదరలేదు. ఏది ఏమైనా ప్రస్తుతానికి హైదరాబాద్ సినిమా పరిశ్రమకు అంత సేఫ్ కాదని మాత్రం అనుకుంటూ విశాఖ పట్టణానికి తరలి పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నుండి పలు పరిశ్రమలు, ఐటి పరిశ్రమలు ఇతర రాష్టామలకు తరలిపోవడం తెలిసిందే.