హైదరాబాద్ చేరుకున్న కన్నయ్య.. ఉద్యమాన్ని ఆపేది లేదు..

జెఎన్ యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నేటి ఉదయం విమానంలో బయలుదేరి శంషాబాదు ఎయిర్ పోర్టులో దిగిన కన్నయ్యకు సీపీఐ అగ్రనేతలు కె.నారాయణ, చాడా వెంకటరెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన కన్నయ్య హెచ్ సీయూ రోహిత్ తల్లి, సోదరుడిని కలుస్తానని.. రోహిత్ తల్లి చేసే దీక్షకు మద్దతు తెలుపడానికే వచ్చానని.. కానీ హెచ్ సీయీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. రోహిత్ పేరిట చట్టం తెచ్చేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన ప్రకటించారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే తాను హెచ్ సీయూకు వెళుతున్నానని.. ఇవాళ సాయంత్రం హెచ్ సీయూకి వెళతానని చెప్పాడు.   మరోవైపు హెచ్ సీయూలో ఇప్పటికే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్ధి సంఘాల వివిధ సమావేశాలతో అక్కడి వాతావరణం వేడెక్కింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

నా మాట విని ఉంటే ఈ దాడులు జరిగేవి కావు.... ట్రంప్‌

బెల్టియంలో అలా ఉగ్రవాదుల దాడులు జరిగాయో లేదో, ఇలా ట్రంప్ తన నోటికి పని చెప్పడం మొదలుపెట్టాడు. కాకపోతే ఈసారి ట్రంప్‌కు తోడుగా మరో రిపబ్లికన్‌ అభ్యర్ధి టెడ్‌ క్రూజ్‌ కూడా తోడయ్యాడు. బెల్జియం దాడుల నేపథ్యంలో, అమెరికాలోని ముస్లింలు అధికంగా ఉండే చోట నిఘాని పెంచాల్సి ఉంటుందని వీళ్లిద్దరూ పేర్కొన్నారు. తరచూ ముస్లింల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్‌ను చూసి క్రూజ్‌ కూడా స్ఫూర్తిని పొందాడో ఏమో... ముస్లిం శరణార్థులు అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలంటూ ప్రకటించారు. ఇక ట్రంప్ అయితే ఏకంగా తన మాట విని ఉంటే బెల్జియంలో బాంబులు పేలేవి కావని అన్నారు. ఇంతకీ ఆ మాట ఏమిటంటారా! పోలీసులకు ఎవరన్నా ఉగ్రవాదులు పట్టుబడితే, వారి నుంచి నిజాలను రాబట్టేందుకు, వారిని చిత్రహింసలకు గురిచేయాలన్నది ట్రంప్ ఉవాచ. గతంలో ప్యారిస్‌లో పట్టుబడిన ఉగ్రవాదిని కనుక చావచితక్కొట్టి ఉంటే, అతను బెల్జియం దాడులు గురించి చెప్పేసేవాడన్నది ట్రంప్ బాధ. ట్రంప్‌ వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవహక్కుల సంఘాలవారు ఖండిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను మొదలుపెడితే, వాటికి ఎక్కువగా బలయ్యేది అమాయకులే అని వారి వాదన. కానీ ట్రంప్‌ ప్రజాదరణ పెరిగిపోవడం చూస్తుంటే, ఆయన మాటలతో ఏకీభవించేవారి సంఖ్య కూడా పెరుగుతోందని అనిపిస్తోంది.

పఠాన్ కోట్లో మరో ఘటన.. తుపాకి గురి పెట్టి కారు అపహరణ

  పంజాబ్ లోని పఠాన్ కోట్ విమానం స్థావరంపై ఉగ్రవాది జరిపిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. అయినా ఏదో ఒక సంఘటనతో నిరంతరం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. మొన్నటకి మొన్న ఆ పరిసర ప్రాంతాల దగ్గర అనుమానంగా తిరుతున్న నేపథ్యంలో ఓ మహిళను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఓ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న కారును ముగ్గురు దుండగులు అడ్డుకుని తుపాకితో బెదిరించి కారును ఎత్తుకెళ్లారు. దీంతో మరోసారి భద్రతా దళాలను పని పడింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పఠాన్ కోట్ - జమ్మూ జాతీయ రహదారిపై రాత్రి 7 గంటల సమయంలో ఓ వ్యక్తి తన కారులో వస్తుండగా, ఓ వ్యక్తి లిఫ్ట్ కోసం కారు ఆపాడని... అనంతరం ఆగిన కారులోని వ్యక్తికి తుపాకీ చూపి బెదిరించి, తనతో పాటు ఉన్న మరో ఇద్దరుతో పారిపోయాడని అన్నారు. అయితే వారు ఉగ్రవాదులు కారని చెప్పారు.

మాల్యాను పట్టుకోలేరుగానీ.... ఓ మహిళ ఆవేదన!

  లక్ష రూపాయలు కావాలంటే సవాలక్ష ప్రశ్నలు అడిగే బ్యాంకులు, విజయ్ మాల్యాకు వేల కోట్లు ధారాదత్తం చేయడం గురించి భారతీయుల గుండెలు మండిపోతున్నాయి. దానికి ఇదిగో ఈ వార్తే సాక్ష్యం! ముంబైకు చెందిన ప్రేమ్‌లతా భన్సాలీ అనే 44 ఏళ్ల స్త్రీ మొన్న ఆదివారం ఓ మెట్రో రైలులో ప్రయాణం చేస్తున్నారు. ఆమె దగ్గర టికెట్‌ లేకపోవడం గమనించిన రైల్వే తనిఖీ అధికారులు, భన్సాలీకి 260 రూపాయల జరిమానాను విధించారు. భన్సాలీ దాన్ని కట్టగలిగే స్తోమత ఉండి కూడా, తాను జరిమానా కట్టేందుకు నిరాకరించారు. పైగా మాల్యా నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలను రాబట్టండి, ఆ తరువాతే నేను జరిమానా కడతానంటూ వాదించడం మొదలుపెట్టారు. సామాన్యులని పీడించే అధికారులు, విజయ్ మాల్యా పట్ల అంత మెతకగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. దాంతో ఆమెను రైల్వే పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచవలసి వచ్చింది. న్యాయమూర్తి ముందు కూడా భన్సాలీ తన పాత వాదననే కొనసాగించారు. జరిమానాకు బదులుగా వారం రోజుల జైలు శిక్షనైనా అనుభవిస్తాను కానీ, చస్తే జరిమానా కట్టనని చెప్పుకొచ్చారు. దాంతో న్యాయమూర్తి ఆమెకు వారంరోజుల జైలుశిక్షను విధించక తప్పలేదు. మాల్యా పేరు చెప్పి ప్రభుత్వానికి నష్టం కలిగించడం తప్పే కానీ, మాల్యాను వదిలేసిన ప్రభుత్వం తమని మాత్రమే ఎందుకు శిక్షిస్తోందన్న సందేహం రావడంలో తప్పు లేదు కదా!

హెచ్ సీయూలో ఉద్రిక్తత.. భోజనం, నీరు కట్..రేపు హెచ్ సీయూకి కన్నయ్య..!

హెచ్ సీయూ వీసీ అప్పారావు మళ్లీ బాధ్యతలు చేపట్టడంతో విద్యార్ధులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పారావు ఇంటిపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్ధులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో విద్యార్ధులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో హెచ్ సీయూ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు హెచ్ సీయూలోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీసీ అప్పారావుకు మద్దతు పలికారు. విద్యార్ధులకు భోజనం, నీరు, విద్యుత్ ను నిలిపివేశారు.   ఇదిలా ఉండగా రేపు సాయంత్రం హెచ్ సీయూ కి జెఎన్యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ రానున్నట్టు తెలుస్తోంది. దీంతో హెచ్ సీయూ లో భారీ సభకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం సభకు అనుమతి నిరాకరించినట్టు సమాచారం.

క్రికెటర్ శ్రీశాంత్ రాజకీయాల్లోకి.. ఎన్నికల్లో బీజేపీ తరపున..?

  త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. శ్రీశాంత్ ను ఎన్నికల్లో దించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలోభాగంగానే..  బీజేపీ నాయకులు శ్రీశాంత్ను సంప్రదించారట. అయితే తన నిర్ణయాన్ని మాత్రం రేపు వెల్లడిస్తానని శ్రీశాంత్ చెప్పాడు. మరోవైపు త్రిపునితుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీచేయాల్సిందిగా కోరుతూ ఆ పార్టీ అగ్రనేత ఢిల్లీ నుంచి శ్రీశాంత్కు ఫోన్ చేశారని మాత్రం అతని కుటుంబసభ్యులు తెలిపారు.

సంస్కారం లేనివాళ్లు సభ నడుపుతున్నారు.. డీకే అరుణ వ్యాఖ్యలతో డిప్యూటీ స్పీకర్ కంటతడి..

అసెంబ్లీ తెలంగాణ సమావేశాల్లో డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై గందరగోళం నెలకొంది. సంస్కారం లేనివాళ్లు సభను నడిపిస్తున్నారని డీకే అరుణ వ్యాఖ్యానించడంతో.. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి  కంటతడి పెట్టారు. దీంతో అధికార పక్ష పార్టీ నేతలు డీకే అరుణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. చైర్ ను గౌరవించడం సభ్యుల బాధ్యత..ఈ సమావేశాల్లో ఎవరు మాట్లాడినా రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారు.. ప్రతిపక్షాలు మాట్లాడటానికి చాలా సమయం ఇచ్చాం.. గత సమావేశాల్లో కూడా డీకే అరుణ మైక్ విసిరేశారు.. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన ఏపీ అసెంబ్లీలో రోజా వ్యవహరించిన తీరును కూడా గుర్తుచేశార. పక్క సభలో ఇలానే అనుచిత వ్యాఖ్యలు చేసినందకుగాను.. ఏడాది పాటు సస్పెండ్ చేశారని.. కానీ మేం అలా చేయడం లేదు..క్షమాపణ మాత్రం చెప్పితీరాల్సిందే అని డిమాండ్ చేశారు. మరోవైపు నేను సంస్కారం లేదన్న పదం వాడలేదు.. ఉద్దేశ్యపూర్వకంగానే నాపై ఆరోపణలు చేస్తున్నారని డీకే అరుణ అన్నారు.

ఐఫోన్ తన సరికొత్త మోడల్.. భారతీయులకు నిరాశే..

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐఫోన్ తన సరికొత్త మోడల్ ఎస్‌ఈని ఆవిష్కరించింది. 4 అంగుళాల స్క్రీన్‌తో ఉన్న ఈ ఫోన్ అందరిని ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం అమెరికాలోనే అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధర 26, 500 రూపాయలు. అమెరికాలో 26,500 గా ఉన్న ఫోన్ భారత్ లో 30,000కి విక్రయించాలని మొదట సంస్థ అనుకుంది. కానీ ఇప్పుడు ఈ ధరను కాస్త మార్చి ఇండియాలో 39,000 రూపాయలకు అందిస్తామని సంస్థ తాజాగా ప్రకటించింది. దీంతో సంస్థ తీసుకున్న తాజా నిర్ణయం ఇండియన్లకు మాత్రం నిరాశకు గురిచేసింది. కాగా, భారతదేశంలో ఏప్రిల్ చివరి నాటికి ఈ ఫోన్‌ను అందులోకి తెస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది.

మరో రెచ్చగొట్టే కార్యక్రమానికి ఉత్తర కొరియా..

  ఏదైనా పని చేసినప్పుడు పక్కన వాళ్లకు హాని కలుగకుండా చేయడంలోతప్పులేదు.. కానీ హాని కలుగుతుంది అని తెలిసినా కూడా కావాలని చేసే వాళ్లని ఏం చేయలేం. ప్రస్తుతం ఉత్తర కొరియా పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇప్పటికే ఉత్తర కొరియా అణ్వాయుధ ప్రయోగాలు చేసింది. దీనిపై ఐరాస ఆగ్రహం వక్తం చేసింది కూడా.. కానీ ఇప్పుడు మరో రెచ్చగొట్టే కార్యక్రమం చేయడానికి పూనుకుంది. బహుళ అణు రాకెట్లను ప్రయోగించగల మల్టీ రాకెట్ లాంచర్ ను తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలోనే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గ్రీన్ దానికి పరీక్షించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. ఈ విషయాన్ని ఆదేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ ప్రకటించింది. దీంతో ఈ విషయంపై దక్షిణ కొరియాతో పాటు అమెరికా మండిపడుతున్నాయి.

మోడీ దేవుడిచ్చిన వరమట....

  ప్రధాని నరేంద్ర మోడీ భారత్‌కు దేవుడిచ్చిన వరమట.. ఈ మాట ఎవరన్నారనుకుంటున్నారా.. ఇంకెవరూ ఆపార్టీ నేత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ భారత్ కు దేవుడిచ్చిన వరం అని పొగిడారు. అంతేకాదు.. మోడీ దేశంలోనే అత్యంత పాపులర్ అయిన నేతని, పేద ప్రజలకు అండగా నిలిచే వ్యక్తని కొనియాడారు. ప్రతి రంగంలో సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని, వాటిని ఎదుర్కొనడంలో మోడీ ముందుండి దేశ ప్రజలను నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో సైతం మోడీ తన సత్తా చాటుతున్నారని, ట్విట్టర్ ఖాతాలో 1.8 కోట్ల మంది, ఫేస్‌బు‌క్‌లో 3.2 కోట్ల మంది ఆయనను అభిమానించేవారు ఉన్నారని తెలిపారు.

మరోసారి తెగబడిన ఉగ్రవాదులు.. 14 మంది మృతి

  ఉగ్రవాదుల చర్యలు రోజురోజుకి పేట్రేగి పోతున్నాయి. ఈ మధ్య కాలంలోనే చాలా చోట్ల బాంబు దాడులు చేసి ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నారు. ఇప్పుడు తాజాగా మరోదాడి చేశారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జావెంటమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో  14 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు దాడుల వలన ప్రయాణికులు భయాందోళనలకు గురవ్వగా.. వారిని అత్యవసర ద్వారం ద్వారా విమానాశ్రయం నుంచి భయటకు పంపి అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. బాంబు పేలుళ్లవల్ల విమానాశ్రయంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో విమానాశ్రయాన్ని మూసివేశారు. అంతేకాదు జంట పేలుళ్ల అనంతరం దుండగులు కాల్పులకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది.

జయప్రకాశ్ నారాయణ సంచలన నిర్ణయం.. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయం.

  ఇకపై ఎన్నికల్లో పోటీ చేయం.. ఇంతటి కఠినమైన నిర్ణయం ఏపార్టీ తీసుకుంది అనుకుంటున్నారా.. రాజకీయ లబ్ది పొందే ఏ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోదు. మరి ఏ పార్టీ అనుకుంటున్నారా..? లోక్ సత్తా పార్టీ.. లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా పార్టీ రాజకీయ పార్టీ కాదని.. రాజకీయ పార్టీగా చూడొద్దని.. ఇకపై ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ పోటీ చేయదని.. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించామని ఆయన అన్నారు. ఎన్నికలకు దూరంగా ఉన్నా ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని ఆయన చెప్పారు.   కాగా, జయప్రకాష్ నారాయణ 2006లో లోక్‌సత్తా పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభలో తనదైన శైలిలో ప్రజా సమస్యలపై పోరాడారు. ఆ తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణలోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. మరి ఉన్నట్టుండి జేపీ ఇంత నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటో..

మరో వివాదానికి జెఎన్యూ విద్యార్ధులు.. దహనం చేస్తే తప్పేంటి..

జవహర్‌లాల్ విశ్వవిద్యాలయ (జెఎన్యూ) లో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే వివాదాలకు అడ్డాగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది. ఏబీవీపీ తిరుగుబాటు నేతలు, వామపక్ష ఏఐఎస్‌ఏ, ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఈనెల 8 వ తేదీన మనుస్మృతి పుస్తకాన్ని దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ అధికారులు ఐదుగురు విద్యార్థులకు నోటీసులు జారీచేసి, వివరణ కోరారు. అయితే దీనిపై విద్యార్ధులు స్పందిస్తూ ప్రాచీన న్యాయ గ్రంథం మనుస్మృతిని దహనం చేస్తే తప్పేంటని తిరిగి ప్రశ్నిస్తున్నారు. కాగా మనుస్మృతి దహన ఘటన ఆరోపణల సంబంధించి జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ తదితరులపై 'తీసుకున్న చర్యల నివేదిక' (ఏటీఆర్‌)ను సమర్పించాల్సిందిగా ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.  మొత్తానికి జెఎన్యూ విద్యార్ధులు తీరు చూస్తుంటే రోజుకో వివాదం లేనిదే నిద్ర పోయేలా కనిపించడం లేదు.   కాగా మార్చి 8వ తేదీన కన్హయ్య మరికొందరు విద్యార్థులు జేఎన్‌యూ క్యాంపస్‌లో మనుస్మృతి పుస్తకాన్ని దహనం చేసిన వీడియో యూట్యూబ్‌లో ఉన్నది. దీనిని వ్యతిరేకిస్తూ అజయ్‌గౌతమ్ అనే బ్రాహ్మణుడు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లవ్లీన్ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తూ.. విచారణను జూన్ 1వతేదీకి వాయిదా వేశారు.

పసిపిల్లలకి 30.. పశువులకి 70 అట

  పక్క పార్టీ నేతలని తిట్టడం.. వారిపై విమర్శలు గుప్పించడం సహజమే..కానీ సొంత పార్టీ నేతలే పార్టీపై విమర్శలు చేస్తే ఎలా ఉంటుంది. అలాంటిదే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారుపై సొంత పార్టీ బీజేపీ ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. అసలు సంగతేంటంటే.. మహారాష్ట్ర ప్రభుత్వం పశువుల సంరక్షణ కోసం అనేక పథకాలు చేపట్టిన సంగతి తెలసిందే. దీనిపై ఎమ్మెల్యే అనిల్ బోండే స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వానికి పిల్లల సంరక్షణ కంటే.. పశువులే ముఖ్యమైపోయాయి అని మండిపడ్డారు. అనాథలుగా ఉన్న పసిపిల్లల సంరక్షణ కంటే.. బడ్జెట్‌లో పశువుల సంరక్షణకు అధిక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. 'మా రాష్ట్ర ప్రభుత్వం పశువుల దాణా కోసం రోజుకు ఒక్కదానికి రూ.70 ఖర్చు చేస్తుండగా.. పిల్లలకు రోజుకు రూ.30 మాత్రమే ఇస్తుందని.. చిన్నారులకోసం నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. మరి ఎమ్మెల్యే గారు అన్నదాంట్లో నిజం లేకపోలేదు..