డబ్బు దాచుకున్న వారిలో ఐశ్వర్యా రాయ్.. అంతా అబద్దం
పనామా పేపర్స్ అనే పత్రిక దేశాల్లో డబ్బు దాచుకున్న వారి జాబితాలోని పేర్లను బయటపెట్టి అందరికి షాకిచ్చారు. ఇందులో 500 మంది భారతీయుల పేర్లు బయటపెట్టి అందరికి షాకిచ్చింది పనామా పేపర్స్. అయితే ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. ఈ 500 మందిలో 140 మందికి పైగా రాజకీయ నాయకులు, 200 మంది వరకూ వ్యాపారవేత్తలు, 12 మంది రాష్ట్రాధినేతలు, సెలబ్రిటీల పేర్లను పనామా పేపర్స్ విడుదల చేసింది. దీనిలో బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ పేర్లు ఉండటం ఆశ్చర్యం. ఐశ్వర్యా రాయ్, ఆమె తల్లిదండ్రులు, సోదరులు బ్రిటన్ లో 2005లో రిజిస్టరైన అమిక్ పార్ట్ నర్స్ లిమిటెడ్ లో డైరెక్టర్లని, ఆ సంస్థ ద్వారా బ్లాక్ మనీని నిర్వహించారని పేర్కొంది. అమితాబ్ నాలుగు విదేశీ సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నారని ఈ కంపెనీలు 5 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల మూలధనం నిల్వలను కలిగినప్పటికీ, మిలియన్ల విలువైన డీల్స్ చేశాయని పేర్కొంది. అయితే దీనిపై ఐశ్యర్యరాయ్ స్పందిస్తూ..బ్లాక్ మనీ కుంభకోణంలో తన పేరుండటం షాక్ ను కలిగించిందని, ఇదంతా పచ్చి అబద్ధమని, పూర్తి అవాస్తవమని పేర్కొంది.